శాలంకాయనులు
From Wikipedia, the free encyclopedia
శాలంకాయనులు - సా.శ. 300 - 420 మధ్యకాలం - వేంగినగరం వారి రాజధాని. వేంగి రాజధానిగా పరిపాలించినట్లుగా స్పష్టమైన ఆధారాలతో (ఏలూరు శాసనం ద్వారా) తెలియవస్తున్న మొదటి రాజులు శాలంకాయనులు. "శాలంకాయన" అనేది గోత్రనామమని, వంశం పేరు కాదని తెలుస్తున్నందువలన చరిత్రకారులు వీరిని వర్ణించడానికి "వైంగేయికులు" అనే పదాన్ని వాడుతున్నారు. సముద్రగుప్తుని అలహాబాదు ప్రశస్తిలో కూడా "వైంగేయక" అనే చెప్పబడింది.[1]. వీరిలో హస్తివర్మ సముద్రగుప్తుని సమకాలికుడు.1వ మహేంద్రవర్మ అశ్వమేధయాగం చేశాడని అంటారు. శాలంకాయనులు పాటించిన చిత్రరధస్వామి (సూర్యుడు) భక్తికి చెందిన ఆలయము యొక్క శిథిలాలు పెదవేగిలో బయల్పడ్డాయి.[2][3] శాలంకాయనులు "చిత్రరధస్వామి"ని పూజించినట్లు తెలుస్తున్నది (భగవత్ చిత్రరధస్వామి పాదానుధ్యాతః). ఈ చిత్ర రధ స్వామి శివుని రూపమో, విష్ణువు రూపమో, లేక సూర్యుని రూపమో తెలియడం లేదు.[4]
అధికార భాషలు | ప్రాకృతం సంస్కృతం తెలుగు |
రాజధానులు | వేంగి |
ప్రభుత్వం | రాచరికం |
శాలంకాయనులకు ముందు పాలించినవారు | శాతవాహనులుఇక్ష్వాకులు |
శాలంకాయనులకు తర్వాత పాలించినవారు | పల్లవులు |