From Wikipedia, the free encyclopedia
శ్రీ విష్ణువు పాద పద్మములనుండి పుట్టిన రేచర్ల వంశములో ఖడ్గ నారాయణుడను యాచమ నాయకుడుద్భవించెను. అతని ఇల్లాలు పద్మనాయికా సంజాత సోచమాంబ. అందుకే వీరిని రేచర్ల పద్మనాయకులు అంటారు.పద్మనాయక వంశానికి మూలం రేచెర్ల రెడ్లు. రేచెర్ల నామిరెడ్డి మేనల్లుడైన చెవ్విరెడ్డి (బేతాళ/భేతాళ రెడ్డి, బేతాళనాయకుడు) పద్మనాయక వంశానికి మూల పురుశుడు. వీరి పూర్వులు భేతిరెడ్డి, చెవ్విరెడ్డి మున్నగు నామములు. వీరిని రెడ్డి తెగవారిగా సూచిస్తుండగా మధ్యకాలంలో సేనా నాయకత్వం సూచించు నాయుడు బిరుదును బట్టి వీరిని వేర్వేరుగా భావించుచున్నది. చెవ్విరెడ్డి వంశస్థులే వైష్ణవ మతాన్ని స్వీకరించి సంస్కరణ మార్గంలో పయనించి వెల్మలై రేచెర్ల పద్మనాయకులయ్యారు. రేచర్ల పద్మనాయకులు నల్లగొండ జిల్లాలోని పిల్లలమర్రి, నాగులపాడు ప్రాంతాలను మహాసామంతులుగా పాలించారు.
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
- రేచర్ల వంశీయులు వెలమనాయుడు తెగకు చెందినవారే కాని క్షత్రియులు కారు. వీరు నల్గొండ జిల్లాలోని రాచకొండను రాజధానిగా చేసుకొని పాలించుచుండిరి. తమ దుర్గము బహమనీ సుల్తానులచే ఆక్రమింపబడినప్పుడు 15 వ శతాబ్దపు చివరి భాగములో కర్నూలు జిల్లాలోని వెలుగోడకు తరలువచ్చి ఇక్క్డ రాజ్యమును స్థాపించి వెలుగోటివారని ప్రసిద్ధి చెందిరి.కాకతీయ చక్రవర్తులకు అంగరక్షకులుగా నుండిన పద్మనాయకులు చాలా మంది ఉండిరి. వీరిలో 77 గోత్రముల వెలమవారు ప్రసిద్ధులు. వీటిలో రేచర్ల గోట్రమొకటి.
-కాకతీయ సామ్రాజ్య పతనానంతరం, ఢిల్లీ సుల్తానులను, బహ్మనీ సుల్తానులను అరికట్టి తెలంగాణను పాలించిన వారు రేచెర్ల పద్మనాయకులు. వీరు కొన్ని సందర్భాల్లో తెలంగాణేతర ప్రాంతాలను జయించినా కొంతకాలం తర్వాత వాటిని కోల్పోయారు. ఆమనగల్లు వీరి జన్మస్థలం. రేచెర్ల రెడ్లకు, కందూరి చోడులకు ఆమనగల్లు మొదట రాజధాని. చెవ్విరెడ్డిని గణపతి దేవుడు ఆమనగల్లు పాలకుడిగా నియమించాడు. చెవ్విరెడ్డికి నలుగురు కుమారులు. వారిలో.. 1. దామానాయుడు 2. ప్రసాదిత్యనాయుడు.
-తండ్రి రాజ్యాన్ని పాలిస్తుంగా వీరు రుద్రమదేవికి సేనానులుగా కాకతీయ రాజ్యంలో ప్రముఖ స్థానాన్ని పొందారు. రుద్రమదేవి రాజ్యానికి రాగా నే ఒక స్త్రీ రాజుగా రావడం సహించక ఒకవైపు బంధువర్గం, మరోవైపు యాదవ రాజులు ఓరుగల్లుపై దండెత్తారు. ఈ సమయంలో ప్రసాదిత్య నాయుడు ఈ చిక్కులను తొలగించి ఆమె అధికారాన్ని నిలబెట్టడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. కాకతీయ రాజ్య స్థాపనాచార్య, రాయ పితామహాంక అనే బిరుదులు పొందాడు. కాకతీయ సామ్రాజ్య పరిరక్షణలో భాగంగా నాయంకర వ్యవస్థను ప్రవేశపెట్టిన ఘతన ఇతనిదే.
-ప్రసాదిత్య నాయుడి కుమారుడు వెన్నమ నాయకుడు ప్రతాపరుద్రుడి సేనానిగా ప్రసిద్ధ్దుడు. సా.శ. 1303లో అల్లాఉద్దీన్ ఖిల్జీ కాకతీయ రాజ్యం పై చేసిన దండయాత్రను తిప్పికొట్టిన వారిలో ఇతడు ప్రముఖుడు. వెన్నమ నాయకుడి కొడుకు ఎరదాచానాయకుడు, సబ్బినాయుడు కొడుకు నలదాచానాయకుడు కూడా ప్రతాపరుద్రుని సేనానులే.
-కాకతీయులకు, పాండ్యరాజులకు (1326), హోయసాల రాజులతో జరిగిన యుద్ధాల్లో మిగతా సేనానులతో పాటు ఎరదాచానాయకుడు కీలక పాత్ర వహించాడు. ఇతని పరాక్రమానికి మెచ్చి ఇతనికి ప్రతాపరుద్రుడు. 1. పంచపాండ్యదళ విభాళ. 2. పాండ్యగజకేసరి. అనే బిరుదులు ఇచ్చాడు.
-ఎరదాచానాయకుడి తర్వాత సింగమనాయకుడు (1326-61) రాజ్యానికి వచ్చాడు. ఇతడు ప్రసిద్ధుడు. తండ్రితోపాటు పాండ్య యుద్ధంలో పాల్గొని చిన్నతనంలోనే పరాక్రమం చూపించి కంపిలి రాజ్యంతో జరిగిన యుద్ధంలో కూడా విజయం సాధించాడు.
-కాకతీయ రాజ్య పతనానంతరం సింగమనాయకుడు స్వతంత్ర రా జ్యాన్ని స్థాపించాడు. ఆమనగల్లును రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. సింగమనాయకుని తర్వాత అతని కుమారులు అనపోతానాయుడు, మాదానాయుడు రాజులై జల్లిపల్లి, ఇనుగుర్తి కోటలను మట్టడించి క్షత్రీయులను చంపి పగ తీర్చుకున్నారు. కొందరు క్షత్రీయులు హుజూరాబాద్, మొలంగూర్ కోటలలో దాచుకోగా వారందరినీ చంపివేశారు. శ్రీశైల ప్రాంతాన్ని జయించి తమ రాజ్యంలో కలుపుకున్నారు. రెడ్డి రాజ్యంలో భాగమైన ధరణి కోటను ముట్టడించి అనపోతా రెడ్డిని ఓడించారు. వెల్మ, రెడ్డి రాజ్యాల వైరం ఈ రాజ్యాల పతనం దాకా కొనసాగింది.
-క్షత్రీయులలో కొందరు భువనగిరి ప్రాంతానికి చేరి అనపోతానాయుడి శత్రువులను కలుపుకొని యుద్ధానికి సిద్ధంకాగా అనపోతానాయుడి భువనగిరి సమీపంలో మూసీ తీరంలో ఇంద్య్రాల వద్ద ఎదుర్కొని జయించాడు.
-ఈ విజయాల అనంతరం రాజధానిని ఆమనగల్లు నుంచి రాచకొండకు మార్చాడు. అనేక పర్వత పంక్తుల మధ్య ఉన్న ఈ దుర్గం అభేద్యం. రాజధానిని పునఃనిర్మాణం చేసి 1368లో ఓరుగల్లుపై దాడి చేశాడు. ఈ యుద్ధానంతరం ఓరుగల్లు వెల్మరాజుల వశమైనది. -అనపోతానాయుడి తర్వాత 2వ సింగభూపాలుడు 1384లో రాచకొండలో సింహాసనం అధిష్టించాడు.[1] అదే ఏడాది దేవరకొండలో పెద వేదగిరి నాయుడు అధికారంలోకి వచ్చాడు. సింగభూపాలుడు రాజ్యారంభకాలంలో విజయనగర రాజు 2వ హరిహర రాయలు రాచకొండ రాజ్యంలోని కొత్త కొండపై దండెత్తాడు. సింగభూపాలుడు యువరాజుగా ఉన్నప్పుడే కళ్యాణి (గుల్బర్గా) దుర్గాన్ని ఆక్రమించాడు. అనేక యుద్ధ విద్యలో ఆరితేరినాడు. కాబట్టి విజయనగర రాజులను సైతం ఓడించాడు.
-అనంతరం సింగమభూపాలుడు కళింగ దేశాన్ని జయించడానికి వెళ్ళి గోదావరి జిల్లాలో ఉన్న బెండపూడి, వేములకొండ ప్రాంతాలను జయించి 1387 లో సింహాచలం క్షేత్రంలో శాసనం చెక్కించాడు.
-సింగభూపాలుడి తర్వాత వచ్చినవారు అసమర్దులై రాజ్యాన్ని కోల్పోయారు. అనంతరం వీరి వంశం అంతమయ్యింది.
రేచర్ల భూపతులు తెలుగు సంస్కృత భాషలను సమముగానే ఆదరించిరి. వీరి కాలము నాటి సంస్కృత కావ్యములు వెలుగుకువచ్చి ఆదరణ పొందినట్లు తెలుగు కావ్యములు బయటకి రానేలేదు. కాని వీరి కాలము నాటి సింగభూపాలుడు వ్రాసిన రసార్ణవ సుధాకరము బాగా ప్రాచుర్యం పొందిన గ్రంథము. ఇది ఒక అలంకార గ్రంథము.సింగభూపాలుడు తనకు పూర్వము రచించిన అలంకారికుల సిద్ధాంతములు తప్పులుగా తోచినప్పుడు వాటిని ఖండించి తమ మతమును ఇందులో నిరూపించుచు వ్రాసిన ఒక అలంకారగ్రంధము. ఇది భరతుని నాట్యశాస్త్రమును అను సరించి విఫలముగా వ్రాయబడిన నాట్యశాస్త్ర ప్రధానమగు గ్రంథము. దీనిని రేచర్ల వంశీయుడగు రెండవ సింగభూపాలుడు రచించాడు. దీనిని ఇతడు సా.శ. 1381 తరువాత రచించెను. ఈ గ్రంథమున 3 విలాసములు ఉన్నాయి. నాట్యవేదోత్పత్తి, నాట్యలక్షణము, రసలక్షణము, నాయికా నాయక భేదములు, లక్షణముల, రీతులు, వృత్తులు, ప్రవృత్తులు, రసస్వరూపము, సాత్త్విక, వ్యభిచరి భావములు, సంస్కృత నాటక విషయము, దాని వైవిధ్యము, పంచ సంధులు, సంధ్యంగములు మొదలగు విషయములు ఉన్నాయి. దీనిని 1895లో శ్రీ. వేంకటగిరి రాజావారు తెలుగు లిపిలోను, 1916లో తిరువనంతపురం సంస్కృత గ్రంథమందలివారు మలయాళ లిపిలోను అనువదించిరి. 1950లో శ్రీ.బులుసు వేంకటరమణయ్య గారి ఆంధ్రానువాదమును శ్రీ. పిఠాపురం మహారాజావారు ప్రచురించిరి.అటుపై తిరుపతి శ్రీ. వేంకటేశ్వర ఓరియంటల్ కాలేజి తరుపున ప్రఖ్యాత సంస్కృత విద్వద్వరేణ్యులు శ్రీ. టి.వేంకటాచార్యులు గారి సహాయంతో మరల తెలుగులోకి ప్రచురించిరి. ఆయన అనేక గ్రంథాలయములలో ప్రతులను పరిశీలించి బహు ప్రయత్నసీలురై రచించినందు వలన ఈయనకి హ్యుమానిటస్ రీసర్చ్ కౌన్సిల్ ఆఫ్ కెనడా వారు ఆర్థిక సహాయము కూడా చేసిరి. రసార్ణవ సుధాకరము కావ్య, నాటక, నాట్య, రస విషయములకు పెన్నిధి.ఇందలి విషయములు లక్ష్య లక్షణ సమంవితములై మిక్కిలి సులభ శైలిలో వివరించబడినవి.రసికులకుల్లాసము కలిగించును గాన ఈ గ్రంథములోని భాగములకు విలాసమును అని పేరు.ఇందు రచించబడిన విషయములు నాట్య నాటక రచనలకే కాక శ్రావ్యములైన కావ్యముల రచనకు ఉపకరించుచున్నది కనుకనే ఇది ఒక అలంకార గ్రంథముగా భావింతురు.ఇందు ఉదహరించబడిన గ్రంథములను పరిశీలించిన సింగభూపాలుదేన్ని గ్రంథములు చదివెనో, ఆతని పాండిత్యమెట్టిదో విశదము కాగలదు. అంతే కాక దీనిలో ఆతని స్వరచన కువలయావళి (రత్నపాంచాలిక) ను ఉదహరించక పోవుటచే దీనిని రసార్ణవ సుధాకరము తరువాత వ్రాసినట్లు తెలియుచున్నది. ఇది కూడా మిక్కిలి ప్రమాణమైన అలంకారశాస్త్ర గ్రంథము, కావుననే మల్లినాధసూరి తమ వ్యాఖ్యానమున దీనిని పెక్కుమార్లు ప్రస్తావించెను.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.