![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/09/Bahamani-sultanate-map.svg/langte-640px-Bahamani-sultanate-map.svg.png&w=640&q=50)
బహమనీ సామ్రాజ్యం
దక్షిణ భారత దేశంన దక్కన్ యొక్క ఒక ముస్లిం రాజ్యం / From Wikipedia, the free encyclopedia
బహమనీ సామ్రాజ్యము దక్షిణ భారత దేశమున దక్కన్ యొక్క ఒక ముస్లిం రాజ్యము. ఈ సల్తనత్ను 1347లో టర్కిష్ గవర్నర్ అల్లాద్దీన్ హసన్ బహ్మన్ షా, ఢిల్లీ సుల్తాన్, ముహమ్మద్ బిన్ తుగ్లక్కు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసి స్థాపించాడు. అతని తిరుగుబాటు సఫలమై, ఢిల్లీ సామ్రాజ్యము యొక్క దక్షిణ ప్రాంతాలతో దక్కన్లో ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరచాడు. 1347 నుండి దాదాపు 1425 వరకు బహమనీల రాజధాని ఎహసానాబాద్ (గుల్బర్గా). ఆ తరువాత రాజధాని, మహమ్మదాబాద్ (బీదర్) కు తరలించారు. బహమనీలు దక్కన్ మీద ఆధిపత్యానికై దక్షిణాన ఉన్న హిందూ ఓరుగల్లు ముసునూరి చక్రవర్తులపై, విజయనగర వారిపై పోటీ పడేవారు. ఈ సల్తనత్ యొక్క అధికారము మహమూద్ గవాన్ యొక్క వజీరియతులో (1466–1481) ఉచ్ఛస్థాయి చేరుకొన్నది. 1518 తర్వాత అంతఃకలహాల వలన బహమనీ సామ్రాజ్యము ఐదు స్వతంత్ర రాజ్యాలుగా విచ్ఛిన్నమైనది. ఆ ఐదు రాజ్యములు అహ్మద్నగర్, బీరార్, బీదర్, బీజాపూర్, గోల్కొండ సల్తనత్, దక్కన్ సల్తనత్ లుగా పేరు పొందాయి.
బహమనీ సామ్రాజ్యం | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1347–1518 | |||||||||
![]() బహమనీ సామ్రాజ్యం, 1470లో | |||||||||
రాజధాని | గుల్బర్గా, తర్వాత బీదర్ | ||||||||
ప్రభుత్వం | Monarchy | ||||||||
చరిత్ర | |||||||||
• స్థాపన | 1347 | ||||||||
• పతనం | 1518 | ||||||||
|