పెమ్మసాని నాయకులు
From Wikipedia, the free encyclopedia
పెమ్మసాని నాయకులు 300 సవంత్సరాల పాటు గండికోట పాలకులుగా ఖ్యాతి గడించారు. పెమ్మసాని నాయకులు కమ్మ కులానికి చెందినవారు.[1] 1565లో తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పతనం తరువాత స్వతంత్రంగా కొంత కాలం గండికోట సీమ పాలించారు. 1652లో జరిగిన గండికోట యుద్ధంతో వీరి రాజ్యం పతనం అయింది. ముఖ్యముగా విజయనగర సామ్రాజ్య కాలములో గండికోట పాలకులుగా ప్రశస్తమగు విజయనగర సేనాధిపతులుగా పేరు ప్రఖ్యాతులుగాంచిరి. వీరి పూర్వీకులు కమ్మనాటిలోని బెల్లంకొండకు చెందిన ముసునూర్ల గోత్రీకులు.
1369వ[2] సంవత్సరములో ఓరుగల్లు సామ్రాజ్య పాలకులైన ముసునూరి నాయకుల పతనం తరువాత వీరు విజయనగరమునకు తరలిపోయి ఆ తరువాత మూడు శతాబ్దములు దక్షిణ భారతదేశమును హిందూమతమును రక్షించుటకు పాటుపడిరి.