గణపతి దేవుడు కాకతీయ చక్రవర్తులలో అగ్రగణ్యుడు. 6 దశాబ్దాల పాటు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. తెలుగు నాటిని ఏకం చేసి తెలుగు వారందరినీ ఒక గొడుగు క్రిందకి తెచ్చిన వారిలో కాకతీయ గణపతిదేవుడు ఒకడు (మిగిలిన వారు ముసునూరి ప్రోలయ నాయుడు, ముసునూరి కాపయ నాయుడు, శ్రీకృష్ణదేవరాయలు).
మరింత సమాచారం కాకతీయ సామ్రాజ్యం, ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఒక భాగం ...
మూసివేయి
దేవగిరి ఏలుతున్న యాదవ రాజు జైత్రపాలుడు 1195 లో కాకతీయ రుద్రదేవుని వధించి గణపతిదేవుని బంధిస్తాడు. రుద్రదేవుని తమ్ముడు మహాదేవుడు ఓరుగల్లు సింహాసనమెక్కి మూడు వర్షములు (1196-1198 CE) పాలిస్తాడు. 1198లో గణపతిని విడిపించుటకు దేవగిరిపై దండెత్తి విజయము సాధిస్తాడు కాని తన ప్రాణాలు కోల్పోతాడు. మహాదేవుని మరణానంతరము రాజ్యములో అరాచకము చెలరేగుతుంది. మహాదేవుని కుమారుడైన గణపతిదేవుడు 1198లో రాజ్యానికి వస్తాడు.[1] సేనాధిపతి రేచెర్ల రుద్రుడు తన శక్తియుక్తులు ధారపోసి రాజ్యము చక్కదిద్దుతాడు. గణపతిదేవుడు పాలించిన 62 సంవత్సరములు తెలుగు దేశ చరిత్రలో కొనియాడదగినవి. ఇతని పాలనలో రాజ్యవిస్తరణకు, వర్తకానికి ప్రాముఖ్యతనిచ్చాడు.[2]