రెండవ బేతరాజు
From Wikipedia, the free encyclopedia
ప్రోలుని అనంతరం అతని కొడుకు రెండవ బేతరాజు 1076లో అనుమకొండ రాజ్యాధిపతి అయ్యాడు. చాళుక్య రాజ అంతరకలహాలలో ఇతను విక్రమాదిత్యుని సమర్థించి ఆతని ఆదరానికి పాత్రుడైనాడు. మంత్రి వైజదండనాయకుని రాజనీతితో సబ్బిమండలం చాలావరకు రాజ్యంలో కలుపుకున్నాడు. రెండవ బేతరాజు కాలముఖ శైవాచార్యుడు రామేశ్వర పండితుని నుండి శైవదీక్ష పొంది గురుదక్షిణగా అనుమకొండలో శివపురమనే భాగాన్ని, అందులో బేతేశ్వరాలయాన్ని నిర్మించాడు ఇతని బిరుదులు ' విక్రమచక్ర ', ' త్రిభువనమల్ల ' . అతని కుమారులు దుర్గరాజు, రెండవ ప్రోలరాజు.