ముసునూరి నాయకులు
From Wikipedia, the free encyclopedia
కాకతీయ ప్రతాపరుద్రుడి పతనానంతరం తెలుగునాట నెలకొన్న రాజకీయ అనిశ్చితి కాలంలో కాకతీయ వారసులైన ముసునూరి నాయకులు స్థానిక సైన్యాన్ని సంఘటితం చేసి ఢిల్లీ సుల్తానులను తెలుగునేల నుండి ప్రాలదోలారు. ప్రతాపరుద్రుడి మరణం తరువాత సాగిన 'అంధకార యుగం' అనుకొనే ఈ సమయం గురించి సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ విశేషంగా అధ్యయనం చేశాడు.
ముసునూరి నాయకులు | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1012–1436 | |||||||||||||
స్థాయి | సామ్రాజ్యము | ||||||||||||
రాజధాని | వరంగల్లు రాజమండ్రి | ||||||||||||
సామాన్య భాషలు | తెలుగు కన్నడ | ||||||||||||
మతం | హిందూ మతం | ||||||||||||
ప్రభుత్వం | రాజరికము | ||||||||||||
చరిత్ర | |||||||||||||
• స్థాపన | 1012 | ||||||||||||
• పతనం | 1436 | ||||||||||||
|
ముసునూరి ప్రోలయ నాయుడు, ముసునూరి కాపయ నాయుడు తురుష్క పాలకులతో స్వాతంత్ర్య పోరాటం సాగించడం, కాపయ నాయకుడు ఓరుగల్లును ఆక్రమించడం గురించి శర్మ తన 'Forgotten Chapter of Andhra History' లో వివరించాడు. "ముసునూరి నాయకుల యుగం" రాజకీయంగా సువర్ణ ఘట్టమని శర్మ నిరూపించాడు [1][2].
క్రీ.శ. 1012[3] -1436[4] కాలం మధ్య ముసునూరి వంశస్థుల శాసనాలు తెలుగునాట వున్నవి. ఈ వంశస్తులు సుమారు 425 ఏళ్లు పాలించినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. వీరు కాకతీయుల వారసులని కొన్ని శాసనాలు తెల్పుతున్నవి[5].