మౌర్య సామ్రాజ్యం
అజపాల్ చంద్రగుప్త మౌర్య చక్రవర్తి స్థాపించిన సామ్రాజ్యం / From Wikipedia, the free encyclopedia
మౌర్య సామ్రాజ్యం (క్రీ.పూ 321– 187 ) మౌర్య వంశం చే పరిపాలించబడిన ఒక ప్రాచీన బలమైన, విశాలమైన సామ్రాజ్యం. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్య మహాపద్మనంద మనవడు, చంద్రగుప్త మౌర్య నంద రాజులకి, అడవి జాతికి చేందిన "ముర" అనే స్త్రీకి జన్మించినట్టు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. చంద్ర గుప్తుని తల్లి పేరు "ముర" అనగా అడవిలో నెమల్లని సంరక్షించే జాతికి చెందినది. ఈ విధముగా తల్లి పేరును మౌర్యగా మార్చుకొని తన రాజ్యమును పాలించాడు.[4]. నంద వంశస్థుల వలన అవమానము పొందిన చాణక్యుడు, ఎలాగైన నంద రాజ్యం నాశనము చేయాలనే ఆశయముతో చంద్రగుప్తుడిని రెచ్చకొట్టి తన చేతితోనే తన వంశస్తులని చంపేలాగా చేశాడని చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. విశకదత్తుడు రచించిన 4వ శతాబ్దము- "ముద్రరక్షస" అనే గ్రంథములో చంద్రగుప్త మౌర్య నంద వంశస్తుల కుమారుడు అని క్లుప్తముగా వివరించారు. దీనితో బలం పుంజుకున్న చంద్రగుప్తుడు క్రీ.పూ. 322 లో నంద వంశ పరిపాలనకు తెర దించి తానే ఒక మహా సామ్రాజ్యం స్థాపించాడు. అలెగ్జాండరు నాయకత్వంలోని గ్రీకుల దండయాత్ర సమయమున స్థానిక రాజ్యాల మధ్య ఉన్న మనస్పర్థలని ఉపయోగించుకుని తన సామ్రాజ్య సరిహద్దులని అమితంగా పెంచాడు. క్రీ.పూ. 316 నాటికి దాదాపు ఉత్తర భారతం అంతా ఇతని ఆధీనంలో ఉంది. అలెగ్జాండర్ సేనాని పశ్చిమ ఆసియా ప్రాంతాలని పరిపాలించిన సెల్యూకసు నికేటరుని ఓడించి తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
అశోకుడు పరిపాలన అత్యధికంగా విస్తరించిన మౌర్యసామ్రాజ్యం. | |
Imperial Symbol: The Lion Capital of Ashoka | |
Founder | చంద్రగుప్త మౌర్య |
---|---|
Preceding State (s) | Nanda Dynasty of మగధ మహాజానపదాలు |
Languages | పాలి ప్రాకృతం సంస్కృత భాష |
మతములు | బౌద్ధ మతము హిందూ మతము జైన మతము |
Capital | పాటలీపుత్ర |
Head of State | సమ్రాట్ (చక్రవర్తి) |
First Emperor | చంద్రగుప్త మౌర్య |
Last Emperor | బృహద్రథ |
Government | Centralized Absolute Monarchy with Divine Right of Kings as described in the Arthashastra |
Divisions | 4 provinces: Tosali Ujjain Suvarnagiri Taxila Semi-independent tribes |
Administration | Inner Council of Ministers (Mantriparishad) under a Mahamantri with a larger assembly of ministers (Mantrinomantriparisadamca). Extensive network of officials from treasurers (Sannidhatas) to collectors (Samahartas) and clerks (Karmikas). Provincial administration under regional viceroys (Kumara or Aryaputra) with their own Mantriparishads and supervisory officials (Mahamattas). Provinces divided into districts run by lower officials and similar stratification down to individual villages run by headmen and supervised by Imperial officials (Gopas). |
Area | 5 million km² [1] (Southern Asia and parts of Central Asia) |
Population | 50 million [2] (one third of the world population [3]) |
Currency | Silver Ingots (Panas) |
Existed | 322–185 BCE |
Dissolution | Military coup by Pusyamitra Sunga |
Succeeding state | Sunga Empire |
భౌగోళికంగా విస్తారమైన మౌర్య సామ్రాజ్యం మగధలో ఇనుప యుగపు చారిత్రక శక్తిగా ఉంది. ఇది క్రీ.పూ 322- 187 మధ్య భారత ఉపఖండంలో ఆధిపత్యంలో ఉంది. దక్షిణ ఆసియాలో ఎక్కువ భాగంలో విస్తరించిన మౌర్య సామ్రాజ్యం ఇండో-గంగా మైదానాన్ని జయించి కేంద్రీకృతమై ఉంది. పాటలీపుత్ర (ఆధునిక పాట్నా) రాజధాని నగరంగా చేసుకుని పాలన సాగించింది. [5][6] భారతీయ ఉపఖండంలో ఉనికిలో ఉన్న అతిపెద్ద రాజకీయ సంస్థగా ఈ సామ్రాజ్యం, అశోకచక్రవర్తి ఆధ్వర్యంలో 50 లక్షల చ.కి.మీ (s (1.9 మిలియన్ల చదరపు మైళ్ళు) విస్తరించి ఉంది.[7]
చంద్రగుప్త మౌర్య, చాణక్య (కౌటిల్య) సహాయంతో ఒక సైన్యాన్ని అభివృద్ధి చేసాడు.[8] క్రీ.పూ. 322 లో నంద సామ్రాజ్యాన్ని పడగొట్టి మౌర్యసామ్రాజ్యాన్ని స్థాపించాడు. "అలెగ్జాండర్ ది గ్రేట్" దండయాత్ర తరువాత పరిపాలనలో వున్న సాట్రాపులను జయించడం ద్వారా చంద్రగుప్త తన శక్తిని మధ్య, పశ్చిమ భారతదేశం అంతటా వేగంగా విస్తరించాడు. క్రీ.పూ 317 నాటికి సామ్రాజ్యం పూర్తిగా వాయవ్య భారతదేశాన్ని ఆక్రమించాడు.[9] మౌర్య సామ్రాజ్యం సెలూసిదు-మౌర్య యుద్ధంలో డయాడోకసు, సెలూసిదు సామ్రాజ్యం స్థాపకుడు మొదటి సెలూకసును ఓడించి సింధు నదికి పశ్చిమ భూభాగాన్ని సొంతం చేసుకుంది.[10][11]
ఈ సామ్రాజ్యం హిమాలయాల సహజ సరిహద్దు వెంట, తూర్పున అస్సాం వరకు, పశ్చిమాన బలూచిస్తాను (నైరుతి పాకిస్తాను, ఆగ్నేయ ఇరాను), ప్రస్తుత తూర్పు ఆఫ్ఘనిస్తాను, హిందూ కుషు పర్వతాల వరకు విస్తరించింది.[12] పుష్కరు, బిందుసార చక్రవర్తుల పాలనలో ఈ రాజవంశం భారతదేశం దక్షిణ ప్రాంతాలలో విస్తరించింది.[13][14] అయితే ఇది అశోకుడు జయించే వరకు కళింగ (ఆధునిక ఒడిశా) ను మినహాయింపుగా పాలనసాగించింది.[15] ఇది అశోక పాలన తరువాత సుమారు 50 సంవత్సరాలలో క్షీణించింది. క్రీస్తుపూర్వం 185 లో మగధలో షుంగా రాజవంశం స్థాపనతో మౌర్యసామ్రాజ్యం అంతరించి పోయింది.
చంద్రగుప్త మౌర్య, అతని వారసుల ఆధ్వర్యంలో అంతర్గత వాణిజ్యం, బాహ్య వాణిజ్యం, వ్యవసాయం, ఆర్థిక కార్యకలాపాలు వర్ధిల్లాయి. ఆర్థిక, పరిపాలన, భద్రత కలిగిన ఏకైక శక్తిగా సమర్థవంతమైన వ్యవస్థను సృష్టించి దక్షిణాసియా అంతటా అభివృద్ధి చెందుతూ విస్తరించింది. మౌర్య రాజవంశం ఆసియాలో పురాతనమైన సుదీర్ఘ వాణిజ్య వ్యవస్థకు అనుకూలంగా ఒకటైన పెద్ద రహదారి (గ్రాండు ట్రంకు రహదారి)ని నిర్మించింది. ఇది భారత ఉపఖండాన్ని మధ్య ఆసియాతో కలుపుతుంది.[16] కళింగ యుద్ధం తరువాత అశోకచక్రవర్తి ఆధ్వర్యంలో సామ్రాజ్యం దాదాపు అర్ధ శతాబ్దం కేంద్రీకృత పాలనను అనుభవించింది. చంద్రగుప్త మౌర్య జైన మతాన్ని స్వీకరించడం వల్ల దక్షిణ ఆసియా అంతటా సామాజిక-మత సంస్కరణలు జరిగాయి. అశోకచక్రవర్తి బౌద్ధమతాన్ని స్వీకరించడం, బౌద్ధ మిషనరీల తోడ్పాటు, ఆ విశ్వాసాన్ని శ్రీలంక, వాయవ్య భారతదేశం, మధ్య ఆసియా విస్తరించడానికి వీలైంది.[17] సామ్రాజ్యం జనాభా సుమారు 50-60 మిలియన్లుగా అంచనా వేయబడింది. దీని వలన మౌర్య సామ్రాజ్యం ఎక్కువ జనాభా కలిగిన పురాతన సామ్రాజ్యాలలో ఒకటిగా మారింది.[18][19] పురావస్తుపరంగా దక్షిణ ఆసియాలో మౌర్య పాలన కాలం నార్తరను బ్లాక్ పాలిషు వేరు (NBPW) యుగానికి చెందినదిగా భావించబడుతుంది. అర్ధశాస్త్రం,[20] అశోకుడి శాసనాలు మౌర్య కాలాల వ్రాతపూర్వక నివేదికలకు ప్రాథమిక వనరులుగా ఉన్నాయి. సారనాథ్ వద్ద ఉన్న " లయను క్యాపిటల్ ఆఫ్ అశోక " ఆధునిక భారతదేశం జాతీయ చిహ్నం.