డిసెంబర్ 25 , గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 359వ రోజు (లీపు సంవత్సరములో 360వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 6 రోజులు మిగిలినవి.
1861 : మదన్ మోహన్ మాలవ్యా , స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1946)
1876: భారత్ ను విభజించి పాకిస్తాన్ ను ఏర్పాటు చేసిన నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా (మ.1948)
1901 : తుమ్మల సీతారామమూర్తి , ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడు. అభినవ తిక్కన బిరుదాంకితుడు/[మ.1990]
1910 : కల్లూరి తులశమ్మ , సంఘసేవకురాలు, ఖాదీ ఉద్యమ నాయకురాలు. (మ.2001)
1924 : అటల్ బిహారీ వాజపేయి , పూర్వ భారత ప్రధానమంత్రి. (మ.2018)
1917 : ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ , కవయిత్రి, పరిశోధకురాలు, గృహలక్ష్మి స్వర్ణకంకణ గ్రహీత (మ.1996)
1927 : రాం నారాయణ్ , హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కళాకారుడు.
1933 : పటేల్ అనంతయ్య , ఉర్దూ అకాడెమీ "తెలుగు - ఉర్దూ నిఘంటువు" ప్రాజెక్టుకు డైరెక్టర్గా వ్యవహరించాడు. ఆకాశవాణిలో బాలగేయాలు, జాతీయ కవితానువాదాలు ప్రసారం చేశాడు.
1936 : ఇస్మాయిల్ మర్చెంట్ , భారతదేశంలో జన్మించిన సినీ నిర్మాత , సుదీర్ఘ కాలంలో మర్చెంట్ ఐవరీ ప్రొడక్షన్స్తో అనుబంధం కలిగి ఉన్న వ్యక్తిగా బాగా సుపరిచితుడు
1950 : ఆనం వివేకానందరెడ్డి , ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజకీయనాయకుడు. (మ.2018)
1951: చంద్రకళ, తెలుగు చలన చిత్ర నటి, నిర్మాత. (మ.1999)
1956 : ఎన్.రాజేశ్వర్ రెడ్డి , మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మేల్యే. (మ.2011)
1971: ఎ.కరుణాకర్, చలన చిత్ర దర్శకుడు .
1974: నగ్మా, తెలుగు, తమిళ, చిత్రాల నటి, రాజకీయ నాయకురాలు.
1977 : ప్రియా రాయ్ , భారతీయ సంతతికి చెందిన అమెరికన్ నీలి చిత్రాల నటి.
1991: సుహాని కలిత, తెలుగు, హిందీ, మలయాళ, బెంగాలీ చిత్రాల నటి.
చక్రవర్తి రాజగోపాలాచారి
1846 : స్వాతి తిరునాళ్ , కేరళలోని తిరువంకూరు మహారాజు, గొప్ప భక్తుడు, రచయిత. (జ.1813)
1970 : దాడి గోవిందరాజులు నాయుడు , తెలుగు, ఇంగ్లీష్, హిందీ నాటకాలలో స్త్రీ పురుష పాత్రధారి. (జ.1909)
1972 : చక్రవర్తి రాజగోపాలాచారి , భారతదేశపు చివరి గవర్నర్ జనరల్. (జ.1878)
1972 : కాకాని వెంకటరత్నం , ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి.
1996 : హరిత కౌర్ డియోల్ , భారత ఎయిర్ ఫోర్సుకు చెందిన మొట్టమొదటి మహిళా పైలట్. (జ.1972)
1997 : జోస్యం జనార్దనశాస్త్రి , అభినవ వేమన బిరుదాంకితుడు, అష్టావధాని (జ.1911)
1998 : పెనుమర్తి విశ్వనాథశాస్త్రి , తెలుగు వచన కవితా ప్రవీణులు.
2009 : అజిత్ నాథ్ రే , భారతదేశ సుప్రీంకోర్టు పద్నాల్గవ ప్రధాన న్యాయమూర్తి . (జ. 1912)
2011 : ఇలపావులూరి పాండురంగారావు , హిందీ సంస్కృత రచనలను తెలుగులోనికి, తెలుగు నుండి హిందీ, ఇంగ్లీషు భాషలకు అనేక పుస్తకాలను అనుసృజించాడు. (జ.1930)
2015 : మెట్ల సత్యనారాయణ రావు , రాజకీయనాయకుడు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (జ.1942)
2022 : తమ్మారెడ్డి చలపతిరావు , సినిమా నటుడు (జ.1944)
ప్రపంచ క్రిస్మస్ పండగ రోజు
జాతీయ సుపరిపాలన దినోత్సవం .
డిసెంబర్ 24 - డిసెంబర్ 26 - నవంబర్ 25 - జనవరి 25 -- అన్ని తేదీలు
మరింత సమాచారం నెలలు తేదీలు, జనవరి ...
మూసివేయి