కాంతా రావు (నటుడు)
సినీ నటుడు From Wikipedia, the free encyclopedia
కాంతారావుగా ప్రసిద్ధి పొందిన తాడేపల్లి లక్ష్మీ కాంతారావు (1923 నవంబరు 16 - 2009 మార్చి 22) ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, నిర్మాత.[2][3]
కాంతారావు | |
---|---|
![]() తాడేపల్లి లక్ష్మీ కాంతారావు | |
జననం | తాడేపల్లి లక్ష్మీకాంతా రావు 1923 నవంబరు 16 |
మరణం | మార్చి 22, 2009 85) | (aged
మరణ కారణం | క్యాన్సర్ |
ఇతర పేర్లు | నట ప్రపూర్ణ, కత్తుల కాంతారావు, ఆంధ్రా ఎం.జి.ఆర్ |
వృత్తి | సినిమా నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1950 - 1990 |
జీవిత భాగస్వామి | సుశీల, హైమవతి[1] |
పిల్లలు | నలుగురు మగపిల్లలు ప్రతాప్, కేశవ, రాజా, సత్యం - ఒక కూతురు సుశీల |
తల్లిదండ్రులు |
|
పురస్కారాలు | రఘుపతి వెంకయ్య అవార్డు, రాష్ట్రపతి అవార్డు, నంది అవార్డు |
జననం
కాంతారావు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామములో జన్మించాడు.[4]
సినీ ప్రస్థానం
తెలుగు సినిమాల్లో అనేక సాంఘిక, జానపద, పౌరాణిక పాత్రలు ధరించిన కాంతారావు నిర్దోషి చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు.[5] ఈయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2000 లో రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించింది. ఆయన స్వీయ చరిత్ర "అనగనగా ఒక రాకుమారుడు". ఆయన మొత్తం 400 పైగా చిత్రాలలో నటించాడు. రామారావు, నాగేశ్వరరావు లకు సమకాలికులుగా కొన్ని సందర్భాలలో వారితో సమానమైన గుర్తింపు పొందారు. దాసరి నారాయణరావు మాటల్లో "తెలుగు చలనచిత్ర సీమకు రామారావు, నాగేశ్వరరావులు రెండు కళ్ళైతే , వాటి మధ్య తిలకం వంటివారు కాంతారావు".
కాంతారావు కుమారుడు రాజా, సుడిగుండాలు సినిమాలో నటించారు. ఆ చిత్రానికి ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డు అందుకున్నారు.[6]
చిత్ర సమాహారం
నటుడిగా
నిర్మాతగా
- సప్తస్వరాలు (1969)
- గండర గండడు (1969)
- ప్రేమ జీవులు (1971)
- గుండెలు తీసిన మొనగాడు (1974)
- స్వాతి చినుకులు (1989)
మరణం
కాంతారావు 2009 మార్చి 22న క్యాన్సర్ వ్యాధి మూలంగా హైదరాబాదులోని యశోద హాస్పిటల్లో రాత్రి గం 9.50 ని.లకు కన్నుమూశారు.
శత జయంతి
కాంతారావు శతజయంతి సందర్భంగా 2022, నవంబరు 16న ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించాడు.[7] తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలోని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్లో కాంతారావు శత జయంతోత్సవం నిర్వహించబడింది. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, కాంతారావు కుమారుడు రాజా పాల్గొని కాంతారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. అనంతరం, కాంతారావు నటించిన 'రణభేరి' సినిమా ప్రదర్శన జరిగింది.[8]
చిత్రాలు
- కాంతారావు శతజయంతి కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు
- కాంతారావు శతజయంతి కార్యక్రమంలో పాల్గొన్న కాంతారావు అభిమానులు
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.