నవంబర్ 3, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 307వ రోజు (లీపు సంవత్సరములో 308వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 58 రోజులు మిగిలినవి.
- 1956: పద్మజా నాయుడు పశ్చిమ బెంగాల్ గవర్నరుగా నియామకం.
- 1966: తుపాను ధాటికి పశ్చిమ బెంగాల్లో 1000 మంది మరణించారు.
- 1984: ప్రధాని ఇందిరా గాంధీ మరణానంతరం ఢిల్లీలో జరిగిన హింసాకాండలో 3000 మంది మరణించారు.
- 1688: మహారాజా జైసింగ్ II, అంబర్ (తరువాత జైపూర్ అని పిలవబడినది) రాజు. (మ.1743)
- 1874: మారేపల్లి రామచంద్ర శాస్త్రి, సాహితీవేత్త, సంఘ సంస్కర్త, నాటక రంగ ప్రముఖుడు. (మ.1951)
- 1878: బెంగుళూరు నాగరత్నమ్మ, గాయని, కళాకారిణి. (మ.1952)
- 1890: హీరాలాల్ జెకిసుందాస్ కనియా, భారతదేశ మొదటి ప్రధాన న్యాయమూర్తి (మ. 1951)
- 1904: క్రొవ్విడి లింగరాజు, స్వాతంత్ర్య సమర యోధుడు, రచయిత. (మ.1986)
- 1906: పృథ్వీరాజ్ కపూర్, హిందీ సినిమానటుడు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.1972)
- 1925: ఏల్చూరి విజయరాఘవ రావు, భారతీయ సంగీతకారుడు, వేణుగాన విద్వాంసుడు, సంగీత దర్శకుడు, రచయిత. (మ.2011)
- 1933: అమర్త్యా సేన్, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి స్వీకరించిన తొలి భారతదేశపు ఆర్థిక శాస్త్రవేత్త.
- 1935: ఇ.వి.సరోజ, 1950, 60 వ దశకాలకు చెందిన తమిళ, తెలుగు సినిమా నటి, నాట్య కళాకారిణి. (మ.2006)
- 1936: రాయ్ ఎమర్సన్, ఆస్ట్రేలియాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు.
- 1937: జిక్కి, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ, హిందీ భాషలలో సినీ గాయకురాలు. (మ.2004)
- 1937: లక్ష్మీకాంత్ ,(లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీత ద్యయం లో ఒకరు) సంగీత దర్శకుడు
- 1940: పెండ్యాల వరవర రావు, విప్లవ రచయిత.
- 1949: అన్నా వింటర్, ఒక బ్రిటిష్-అమెరికన్ పాత్రికేయుడు, సంపాదకుడు.
- 1955: కాత్యాయని విద్మహే, అభ్యుదయ రచయిత్రి.
- 1956 : కోట రాజశేఖర్, ధార్మికోపన్యాసకులు. సంస్కృతభాషా ప్రచారకులు.
- 1963: పైడి తెరేష్ బాబు, కవి. (మ.2014)
- 1968: మణిబాల. ఎస్, రంగస్థల నటి.
నవంబర్ 2 - నవంబర్ 4 - అక్టోబర్ 3 - డిసెంబర్ 3 -- అన్ని తేదీలు
మరింత సమాచారం నెలలు తేదీలు, జనవరి ...
మూసివేయి