1946: బికినీ ఈత దుస్తులను, పారిస్ ఫేషన్ షో లో, మొట్టమొదటిసారిగా ప్రదర్శించారు.
1954: గుంటూరులో 1954 జూలై 5 నాడు ఆంధ్ర రాష్ట్రహైకోర్టును నెలకొల్పారు. కోస్తాంధ్ర, రాయల సీమ ప్రాంతాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఈ రెండు ప్రాంతాల నాయకులు, శ్రీ బాగ్ ఒడంబడిక పై 1937 నవంబరు 15 న సంతకాలు చేసారు. దాని ప్రకారం, రాజధాని, హైకోర్టు, విశ్వ విద్యాలయం ఒకే చోట కాకుండా, వేరు వేరు ప్రాంతాలలో ఉండాలి. దాని ప్రకారం, గుంటూరులో 1954 జూలై 5 నాడు హైకోర్టుని నెలకొల్పారు. కర్నూలును (రాయల సీమ) రాజధానిని చేసారు. విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో ఉంది (ఆంధ్ర విశ్వ కళా పరిషత్).
1954: బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్(బి.బి.సి.) తన మొట్టమొదటి టెలివిజన్ వార్తా వాహినిని ప్రసారం చేసింది.
1977: పాకిస్తాన్ మిలిటరీ అధికారులు కుట్ర చేసి, పాకిస్తాన్ లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన జుల్ఫికర్ ఆలి భుట్టో ను, ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించారు.
1995: సోవియట్ రష్యా నుంచి స్వతంత్రం పొందిన నాలుగు సంవత్సరాల తరువాత, ఆర్మీనియా దేశం తన స్వంత రాజ్యాంగాన్ని అమలు చేసుకుంది.
1927: రావూరి భరద్వాజ, తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. (మ.2013)
1943: అదితి పంత్, ఓషనోగ్రాఫర్. అంటార్కెటికా మీద కాలుమోపిన మొట్టమొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్త.
1956: చౌలపల్లి ప్రతాపరెడ్డి,1994లో రాజకీయాలలో ప్రవేశించి కాంగ్రెస్ పార్టీలో చేరాడు, షాద్నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి 9838 ఓట్ల మెజారిటీతో ఎన్నికయ్యాడు.