1945: ఆగష్టు 6 న 'ఎనొలా గే' అనే అమెరికాబి-29 బాంబర్ ( బాంబులను ప్రయోగించడానికి వాడేది ), మొదటి సారి ఒక అణ్వాయుధాన్ని జపాన్ లోని హిరోషిమా పట్టణంపైన విడిచింది. ప్రపంచ చరిత్రలో అణ్వాయుధాన్ని ఒక దేశం పై ప్రయోగించడం అదే ప్రథమం. ప్రయోగించిన కొద్ది నిముషాల్లొనే మహా విస్పొటనం సంభవించింది. దీని నుంచి వెలువడిన అగ్ని క్షణాల్లొనే పట్టణం అంతా వ్యాపించి భస్మం చేసింది. ఈ విస్పొటనంలో 70, 000 అక్కడికక్కడే మరణించారు. అంటే ఈ సంఖ్య హిరోషిమా పట్టణ జనాభాలో మూడవ వంతు. మళ్ళీ మూడవ రోజున 1945 ఆగష్టు 9 అతి పెద్ద తీరప్రాంత పట్టణమైన నాగసాకి పై అటువంటిదే మరో అణ్వాయుధాన్ని అమెరికా ప్రయోగించింది. దీనితో జపాన్రెండవ ప్రపంచ యుద్దంలోఅమెరికాకు లొంగి పోక తప్పలేదు. ఇది ప్రపంచ చరిత్ర లోనే అతి ఖరీదైన యుద్దంగా మిగిలిపోయింది. రెండు పట్టణాలు మరల నిర్మించబడ్డాయి, కాని, మానవ చరిత్రలో మరిచి పోలేని పీడ కలగా ఈ సంఘటన మిగిలి పొయింది. 1945 ఆఖరికి 2 లక్షల మంది పైగా యుద్దబాధితులుగా మిగిలారు. వీరిలో చాలామంది జీవించగలిగినా, తరువాత చాలా వ్యాధులకు గురయ్యారు.
1962: భారతదేశంలో తొలి భారజల ఉత్పత్తి కేంద్రాన్ని పంజాబు లోని నంగల్లో ప్రారంభించారు.
1754: ఫ్రాన్సుకు చెందిన పియరి చార్లెస్ లీ ఎన్పేంట్ ప్రసిద్ధి పొందిన సివిల్ ఇంజనీరు, ఆర్కిటెక్ట్. (వాషింగ్టన్ డి.సి. లోని వీధులను ప్రణాళిక ప్రకారం అత్యంత మనోహరంగా రూపు దిద్దిన వాడు) (మ.1825).