1914 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
జూలై
జూలై 3 : నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు విశ్వనాథశర్మ.
సెప్టెంబర్
సెప్టెంబరు 20 - ఈ.సి.ఐ.ఎల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు పద్మ భూషణ్ పురస్కార గ్రహీత. ఈయన పేరు మీదుగానే హైదరాబాదులో ఈ.సి.ఐ.ఎల్ ఉద్యోగులు నివసించే కాలనీకి ఎ.యస్.రావు నగర్ గా నామకరణం చేశారు. [మ.2003]
డిసెంబర్
డిసెంబరు 15 : నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు కోదాటి నారాయణరావు.
శంకరంబాడి సుందరాచారి
ఫిబ్రవరి 9 : హరి గోవిందరావు వర్తక్ , మహారాష్ట్ర కు చెందిన సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకుడు. పద్మశ్ర్రీ అవార్డు గ్రహీత. (మ.1998)
ఫిబ్రవరి 13 : మాదాల నారాయణస్వామి , సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు. (మ.2013)
మార్చి 25 : నార్మన్ బోర్లాగ్ , అమెరికా వ్యవసాయ శాస్త్రవేత్త.
మార్చి 28 : పుట్టపర్తి నారాయణాచార్యులు , తెలుగు కవి. (మ.1990)
ఏప్రిల్ 3 : మానెక్షా , భారతదేశపు మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్ . (మ.2008)
ఏప్రిల్ 13 : విద్యా ప్రకాశానందగిరి స్వామి , ఆధ్యాత్మికవేత్త, శ్రీకాళహస్తి లోని శుక బ్రహ్మాశ్రమ స్థాపకులు, బహుభాషాకోవిదులు. (మ.1998)
ఏప్రిల్ 16 : కె.హెచ్. ఆరా , చిత్రకారుడు (మ. 1985)
మే 18 : సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ , స్వాతంత్ర్య సమరయోధురాలు, సంఘసేవకురాలు. (మ.2010)
జూన్ 20 : కె. అచ్యుతరెడ్డి , స్వాతంత్ర్య సమరయోధులు, శాసనసభ్యులు, మంత్రివర్యులు. (మ.1972)
ఆగష్టు 10 : శంకరంబాడి సుందరాచారి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత. (మ.1977)
ఆగష్టు 15 : పరశురామ ఘనాపాఠి వేదపండితుడు. (మ.2016)
ఆగష్టు 21 : పి.ఆదినారాయణరావు , తెలుగు సినిమా సంగీత దర్శకులు, నిర్మాత . (మ.1991)
సెప్టెంబర్ 5 : నికొనార్ పారా , చిలీ కవి. 'అకవిత్వం' అనే ప్రక్రియ సృష్టికర్త.
సెప్టెంబర్ 7 : జరుక్ శాస్త్రి , తెలుగు సాహిత్యంలో పేరడీలకు ఆద్యుడు. (మ.1968)
సెప్టెంబర్ 9 : కాళోజీ నారాయణరావు , తెలుగు కవి, తెలంగాణావాది. (మ.2002)
సెప్టెంబర్ 23 : ఒమర్ అలీ సైఫుద్దీన్ 3 , బ్రూనై దేశపు 28వ సుల్తాన్. (మ.1986)
అక్టోబర్ 5 : పేరేప మృత్యుంజయుడు , భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, స్వాతంత్య్రసమర యోధుడు. (మ.1950)
అక్టోబర్ 10 : భావరాజు నరసింహారావు , నాటక రచయిత , ప్రచురణకర్త, నటుడు. (మ.1993)
అక్టోబర్ 18 : కోగంటి రాధాకృష్ణమూర్తి , రచయిత, సంపాదకుడు, హేతువాది . (మ.1987)
నవంబర్ 13 :హెన్రీ లాంగ్లోయిస్ , అంతర్జాతీయ ఫిల్మ్ ఆర్కైవ్స్ సమాఖ్య (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్ (ఎఫ్.ఐ.ఎ.ఎఫ్) వ్యవస్థాపకుడు. (మ.1977)
డిసెంబర్ 14 : మాకినేని బసవపున్నయ్య , మార్క్స్, లెనిన్ సిద్ధాంతాలకు కట్టుబడి జీవితాంతం పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడాడు. (మ.1992)
డిసెంబర్ 26 : మరళీధర్ దేవదాస్ ఆమ్టే , సంఘసేవకుడు. (మ.2008)
: జి.వి.కృష్ణారావు , హేతువాది, రచయిత. (మ.1979)
1914 సంవత్సరంలో దేశోధ్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు మద్రాసు కేంద్రంగా ఆంధ్రపత్రికను దినపత్రికగా వెలువరించారు.