భారతదేశ ఎన్నికలు
భారతదేశ రాజకీయ ఎన్నికలు నిర్వహించే విధానం / From Wikipedia, the free encyclopedia
భారతదేశం తన రాజ్యాంగం ద్వారా నిర్వచించిన విధంగా పార్లమెంటరీ వ్యవస్థ కలిగి ఉంది, అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది. భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం.
భారతదేశం |
ఈ వ్యాసం భారతదేశ రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం. |
|
|
|
భారత రాష్ట్రపతి దేశ అధికారిక అధిపతి,దేశం లోని అన్ని రక్షణ దళాలకు సర్వోన్నత ప్రధాన అధిపతి.అయితే, లోక్సభకు జరిగే జాతీయ ఎన్నికలలో మెజారిటీ ఉన్న పార్టీ లేదా రాజకీయ కూటమి నాయకుడు భారత ప్రధానమంత్రి అవుతాడు.ప్రధాన మంత్రి భారత ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖకు నాయకుడు.ప్రధాన మంత్రి భారత రాష్ట్రపతి ప్రధాన సలహాదారుగా, కేంద్ర మంత్రుల మండలి అధిపతిగా వ్యహరిస్తాడు.
భారతదేశం ప్రాంతీయంగా రాష్ట్రాలు (కేంద్రపాలిత ప్రాంతాలు) గా విభజించబడింది. ప్రతి రాష్ట్రానికి రాష్ట్ర అధిపతిగా గవర్నరు హోదాలో ఉంటారు, అయితే కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రి వద్ద ఉంటుంది. ఆయన ప్రాంతీయ ఎన్నికలలో మెజారిటీ సాధించిన పార్టీ లేదా రాజకీయ కూటమి నాయకుడు అయిఉంటాడు. దీనిని ఆ రాష్ట్రంలో కార్యనిర్వాహక అధికారాలను అమలు చేసే రాష్ట్ర శాసనసభ ఎన్నికలు అని పిలుస్తారు. ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్రంలో కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి. రాష్ట్ర, కేంద్ర దృష్టి అవసరమయ్యే విషయాలపై భారత ప్రధాన మంత్రి లేదా వారి మంత్రులతో కలిసి సంయుక్తంగా పనిచేస్తారు. కొన్ని ప్రధాన కేంద్రపాలిత ప్రాంతాలు కూడా శాసనసభకు శాసనసభ్యులను ఎన్నుకుని, ప్రాదేశిక ప్రభుత్వాన్ని కలిగి ఉంటాయి. ఇతర చిన్న కేంద్రపాలిత భూభాగాలు భారత రాష్ట్రపతి నియమించిన వ్యక్తి ద్వారా పాలన కొనసాగుతుంది.
భారత రాష్ట్రపతి ప్రతి రాష్ట్రంలో వారిచే నియమించబడిన గవర్నర్ల ద్వారా చట్ట పాలనను పర్యవేక్షిస్తారు. ఎన్నికైన ప్రతినిధుల ద్వారా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో, శాంతియుత వాతావరణాన్ని సృష్టించడంలో విఫలమైనప్పుడు, గందరగోళంగా క్షీణించినప్పుడు,గవర్నరు సిఫారసు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి కార్యనిర్వాహక అధికారాలను తాత్కాలికంగా తీసుకోవచ్చు. అవసరమైతే భారత రాష్ట్రపతి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, కొత్త ఎన్నికలను నిర్వహించవచ్చు.