భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులు
From Wikipedia, the free encyclopedia
భారతదేశంలో ప్రాథమిక విధులు (ఆంగ్లం : Fundamental Duties)
1976 భారత రాజ్యాంగ 42వ సవరణ ప్రకారం భారతదేశపు పౌరులకు ప్రాథమిక విధులు ఇవ్వబడినవి.అధికరణ 51-ఏ, ప్రకారం పది ప్రాథమిక విధులు ఇవ్వబడినవి. పౌరులకు ఇవ్వబడిన ఈ పది విధులు, వ్యక్తగత, పరిసరాల పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల తమ విద్యుక్త ధర్మాన్ని తెలియజేస్తాయి.[1] 2002 భారత రాజ్యాంగ 86వ సవరణ ప్రకారం 11వ విధి ఇవ్వబడింది. ఈ విధి, "తండ్రి గాని, సంరక్షకుడు గాని, తమ బిడ్డలకు 6-14 వయస్సు వరకు విద్యా బోధన చేపట్టాలి", అని బోధిస్తుంది.పౌరులందరూ తమకు ఇవ్వబడిన విధులను గౌరవించి, దేశం పట్ల, సమాజం పట్ల, పరిసరాల పట్ల తమ వ్యక్తిగత బాధ్యతను గుర్తించి మసలుకోవలెను.[2][3]