భారత రాష్ట్రపతి ఎన్నికల విధానం
From Wikipedia, the free encyclopedia
భారతదేశంలో అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతిని ఎన్నుకునే విధానాన్ని భారత రాజ్యాంగ పరిషత్, ఐర్లాండ్ దేశం నుండి ఆదర్శంగా తీసుకుంది. ప్రతి ప్రాంతంలోని జనాభాను, ఆ ప్రాంత విస్తీర్ణాన్నీ ప్రాతిపదికంగా తీసుకొని ఎన్నికలను నిర్వహిస్తారు. ఆర్టికల్-54 లో రాష్ట్రపతి ఎన్నికల ప్రస్తావన ఉంది. ఎలక్ట్రోరల్ కాలేజి సభ్యులు ఓటర్లుగా ఉంటారు. ఎలక్ట్రోరల్ కాలేజిలో అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలు, పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓటర్లుగా ఉంటారు. 1992లో 72 వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలకు ఓటు హక్కు కల్పించారు. దీన్ని భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.