నంద్యాల జిల్లా
ఆంధ్రప్రదేశ్ లో ఒక జిల్లా / From Wikipedia, the free encyclopedia
నంద్యాల జిల్లా ఇది ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ 2022లో భాగంగా పాత కర్నూలు జిల్లాలో కొంత భూభాగంతో కొత్తగా ఏర్పడిన జిల్లా.[1] జిల్లా కేంద్రం నంద్యాల. జిల్లాలో ఆపరేషన్ టైగర్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేసిన, ప్రపంచంలోకెల్లా పెద్దదైన, వన్యమృగ సంరక్షణ కేంద్రం (శ్రీశైలం - నాగార్జునసాగర్) ఉంది. శ్రీశైల క్షేత్రం, మంత్రాలయం, మహానంది అహోబిలం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు. కృష్ణా నదిపై ఇక్కడ నిర్మించబడ్డ శ్రీశైలం ఆనకట్ట దేశంలోని అతిపెద్ద వాటిలో ఒకటి. లక్షలాది ఎకరాలకు నీరందించడమే కాక, విద్యుదుత్పత్తిలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే ప్రధాన వనరుగా ఉంది. చిత్రావతి, కుందేరు, పాపాఘ్ని, సగిలేరు, చెయ్యేరు నదులు నంద్యాల జిల్లాలో ప్రవహించే ప్రధాన నదులు. నల్లమల కొండలు ఈ జిల్లాలో విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. Map
త్వరిత వాస్తవాలు నంద్యాల జిల్లా, దేశం ...
నంద్యాల జిల్లా | |||||||
---|---|---|---|---|---|---|---|
జిల్లా | |||||||
Coordinates: 15.5°N 78.5°E / 15.5; 78.5 | |||||||
దేశం | భారతదేశం | ||||||
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ | ||||||
కేంద్రం | నంద్యాల | ||||||
పరిపాలన విభాగాలు |
| ||||||
Government | |||||||
• జిల్లా కలెక్టరు | Dr. కే.శ్రీనివాసులు | ||||||
విస్తీర్ణం | |||||||
• మొత్తం | 9,154 కి.మీ2 (3,534 చ. మై) | ||||||
జనాభా (2011) | |||||||
• మొత్తం | 16,87,541 | ||||||
• జనసాంద్రత | 180/కి.మీ2 (480/చ. మై.) | ||||||
Time zone | UTC+5:30 (IST) |
మూసివేయి