![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/84/Uma-Maheswaraswami_Temple.jpg/640px-Uma-Maheswaraswami_Temple.jpg&w=640&q=50)
యాగంటి
నంద్యాల జిల్లాలో శైవ క్షేత్రం / From Wikipedia, the free encyclopedia
శ్రీ యాగంటి ఉమా మహేశ్వర దేవాలయం లేదా యాగంటి ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రం. భారత దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో శ్రీ శ్రీబ్రహ్మం గారు నివసించిన బనగానపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఈ దేవాలయం వైష్ణవ సంప్రదాయంలో నిర్మింపబడింది. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి.[1] ఇక్కడ ప్రతిష్టించిన నంది విగ్రహం అంతకంతకూ పెరుగుతూ వుంటుంది, ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాఖ వారు ధృవీకరించారు. యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం బనగానపల్లె పట్టణానికి 14 కి.మీ.ల దూరంలో ఉన్న పాతపాడు అనే గ్రామం సమీపంలో నెలకొనివుంది. అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహ, వీరబ్రహ్మేంద్రస్వామి తపస్సు చేసిన గుహ వంటి పేర్లతో ఇక్కడి చారిత్రక, పౌరాణిక గాథలు ముడిపడివున్నాయి. యాగంటి ఆలయంలోని నంది విగ్రహానికి "యాగంటి బసవన్న" అని పేరు. "కలియుగం అంతమయ్యేనాటికి యాగంటి బసవన్న లేచి రంకె వేస్తుందని శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు కాలజ్ఞానంలో వర్ణించారు". శ్రీ అగస్త్య మహర్షి శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఉండవని ప్రతీతి.
యాగంటి దేవాలయం | |
---|---|
![]() Yaganti Gopuram Sikharam | |
ఆంధ్ర ప్రదేశ్ లో స్థానం | |
భౌగోళికాంశాలు: | 15°21′3″N 78°08′22″E |
పేరు | |
ఇతర పేర్లు: | యాగంటి బసవన్న |
స్థానిక పేరు: | ఉమామహేశ్వర |
తమిళము: | யாகந்தி |
స్థానం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా: | నంద్యాల |
ప్రదేశం: | యాగంటి |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | శివుడు |
ప్రధాన పండుగలు: | శివరాత్రి |
చరిత్ర | |
కట్టిన తేదీ: (ప్రస్తుత నిర్మాణం) | 15th century |
వెబ్సైటు: | http://www.kalagnani.com |