కర్ణాటక
భారతదేశంలోని రాష్ట్రం / From Wikipedia, the free encyclopedia
కర్ణాటక (కన్నడ: ಕರ್ನಾಟಕ) భారతదేశంలోని నైరుతి ప్రాంతంలో ఉన్న రాష్ట్రం. విస్తీర్ణ ప్రకారం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద, భారతదేశంలో ఆరవ అతిపెద్ద రాష్ట్రం. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదంతో ఇది 1956 నవంబరు 1న ఏర్పడింది. నిజానికి మైసూర్ రాష్ట్రంగా తొలిగా పిలిచినా,1973లో కర్ణాటకగా పేరు మార్చారు. దీని రాజధాని, అతిపెద్ద నగరం బెంగళూరు.
కర్ణాటక | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
From top, left to right: Mysore Palace, Pattadakal, Gommateshwara statue, Valley view in Kodagu, Shivanasamudra Falls, Hoysala Empire emblem, Yakshagana Dance and Virupaksha Temple, Hampi | |||||||||
Coordinates (బెంగళూరు): 12.97°N 77.50°E / 12.97; 77.50 | |||||||||
దేశం | India | ||||||||
రాజధాని | బెంగళూరు | ||||||||
జిల్లాల పేర్లు | జాబితా
| ||||||||
Government | |||||||||
• Body | కర్ణాటక ప్రభుత్వం | ||||||||
• కర్ణాటక గవర్నర్ | వాజుభాయ్ వాలా | ||||||||
• ముఖ్యమంత్రి | సిద్ధరామయ్య ( భారత జాతీయ కాంగ్రెస్ (Indian National Congress) ) | ||||||||
విస్తీర్ణం | |||||||||
• Total | 1,91,791 కి.మీ2 (74,051 చ. మై) | ||||||||
• Rank | 6వ | ||||||||
Highest elevation | 1,925 మీ (6,316 అ.) | ||||||||
Lowest elevation | 0 మీ (0 అ.) | ||||||||
జనాభా (2011)[2] | |||||||||
• Total | 6,11,30,704 | ||||||||
• Rank | 8th | ||||||||
• జనసాంద్రత | 320/కి.మీ2 (830/చ. మై.) | ||||||||
Demonym | కన్నడిగులు | ||||||||
GDP (2018-19) | |||||||||
• Total | ₹14.08 లక్ష కోట్లు (US$180 billion) | ||||||||
• Per capita | ₹1,46,416 (US$1,800) | ||||||||
Time zone | UTC+05:30 (IST) | ||||||||
ISO 3166 code | IN-KA | ||||||||
Official languages | కన్నడ[4] | ||||||||
అక్షరాస్యత | 75.60% (2011 census)[5] | ||||||||
HDI | 0.6176 (medium) | ||||||||
HDI rank | 8th (2015)[6] | ||||||||
Symbols of కర్ణాటక | |||||||||
Emblem | గండభేరుండ[7] | ||||||||
Song | జయభారత జననియ తనుజాతే[8] | ||||||||
Bird | Indian Roller[9] | ||||||||
Flower | కలువ[9] | ||||||||
Tree | శ్రీగంధం[9] | ||||||||
కర్ణాటకకు పశ్చిమాన అరేబియా సముద్రం, వాయవ్యాన గోవా, ఉత్తరాన మహారాష్ట్ర, ఈశాన్యాన తెలంగాణ, తూర్పున ఆంధ్రప్రదేశ్, ఆగ్నేయాన తమిళనాడు, దక్షిణాన కేరళ సరిహద్దులుగా ఉన్నాయి. మిగతా 4 దక్షిణ భారత సోదరి రాష్ట్రాలతో భూ సరిహద్దులు ఉన్న ఏకైక దక్షిణాది రాష్ట్రం ఇది. రాష్ట్రం 191,791 చదరపు కిలోమీటర్లు (74,051 చ. మై.). ఇది భారతదేశం మొత్తం భౌగోళిక ప్రాంతంలో 5.83 శాతంగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 61,130,704 మంది నివాసితులతో, జనాభా ప్రకారం ఎనిమిదవ అతిపెద్ద రాష్ట్రం. భారతదేశ ప్రాచీన భాషలలో ఒకటైన కన్నడ, రాష్ట్రంలో ఎక్కువగా మాట్లాడే అధికారిక భాష. అల్పసంఖ్యాకులు మాట్లాడే ఇతర భాషలలో ఉర్దూ, కొంకణి, మరాఠీ, తులు, తమిళం, తెలుగు, మలయాళం, కొడవ, బేరీ ఉన్నాయి . కర్ణాటకలో భారతదేశంలో సంస్కృతం ప్రధానంగా మాట్లాడే కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి.[10][11][12]
కర్ణాటక అనే పేరు కన్నడ పదాలైన కరు, నాడు నుండి ఉద్భవించింది. కరు అంటే "ఎత్తైన" అనే అర్ధంతో "ఎత్తైన భూమి" అని, "నలుపు" అనే అర్ధంతో "నల్లనిప్రాంతం" (బయలు సీమ ప్రాంతంలో కనిపించే ప్రత్తి పంటకు అనువైన నల్లమట్టి ) అనే అర్ధాలను సూచిస్తుంది. కృష్ణానదికి దక్షిణంగా భారతదేశం రెండు వైపులా వున్న ప్రాంతానికి బ్రిటిష్ పాలకులు కొన్నిసార్లు కర్ణాటక్ అనే పదాన్ని ఉపయోగించారు.[13]
పురాతన పాతరాతియుగం కాలంనాటి చరిత్రతో కర్నాటక ప్రాంతాన్ని అత్యంత శక్తివంతమైన పురాతన, మధ్యయుగ భారతదేశం సామ్రాజ్యాల రాజులు పరిపాలించారు. ఈ సామ్రాజ్యాలు పోషించిన తత్వవేత్తలు, సంగీతకారులు సామాజిక-మత, సాహిత్య ఉద్యమాలను ప్రారంభించారు. ఇవి నేటి వరకు కొనసాగుతున్నాయి. కర్ణాటక, హిందూస్థానీ సంప్రదాయాల భారతీయ శాస్త్రీయ సంగీతానికి కర్ణాటక గణనీయంగా దోహదపడింది.
స్థూల రాష్ట్ర ఉత్పత్తి ₹16.99 ట్రిలియన్ తో, తలసరి రాష్ట్ర ఉత్పత్తి ₹ 231,000 తో కర్ణాటక భారతదేశంలో నాల్గవ అతిపెద్ద రాష్ట్రం. మానవ అభివృద్ధి సూచికలో భారత రాష్ట్రాలలో పంతొమ్మిదవ స్థానంలో ఉంది.రాష్ట్రంలోని ఇతర ముఖ్య నగరాలు మైసూరు, మంగుళూరు, హుబ్లీ, ధార్వాడ్, బళ్ళారి, బెల్గాం