ఫిబ్రవరి 15: తొమ్మిదిసార్లు గ్రాండ్స్లాం మహిళల టైటిళ్ళ విజేత మోనికా సెలెస్ టెన్నిస్ నుంచి రిటైర్మెంట్.
ఫిబ్రవరి 19: 1959 నుంచి అధికారంలో ఉన్న క్యూబా అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రో పదవికి రాజీనామా.
ఫిబ్రవరి 19: పాకిస్తాన్ ఎన్నికలలో దివంగత బెనజీర్ భుట్టోకు చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ, నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ పార్టీలు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి.
సెప్టెంబర్ 1: హైదరాబాదులోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఇస్రో పరిధిలోకి తీసుకువచ్చారు. ఇదివరకు ఎన్.ఆర్.ఎస్.ఏ.అంతరిక్ష విభాగం అధీనంలో ఉండేది.
సెప్టెంబర్ 4: లియాండర్ పేస్ అమెరికన్ ఓపెన్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ టైటిట్ కైవసం చేసుకున్నాడు. కారా బ్లాక్ (జింబాబ్వే) తో జతకట్టిన పేస్ ఫైనల్లో 7-6 (8-6), 6-4 స్కోరుతో లీజెల్ హ్యూబెర్, జేమీ ముర్రేలపై విజయం సాధించారు.
సెప్టెంబర్ 5: బెంగుళూరులో జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్షిప్ ఫైనల్లో భారత్ కు చెందిన పంకజ్ అద్వానీ విజయం సాధించాడు.
సెప్టెంబర్ 17: థాయిలాండ్ ప్రధానమంత్రిగా పీపుల్ పవర్ పార్టీకి చెందిన సొంచాయ్ వాంగ్సవత్ ఎన్నికైనాడు.
సెప్టెంబర్ 17: బీజింగ్లో పారాలింపిక్స్ క్రీడలు ముగిశాయి. 89 స్వర్ణాలతో సహా మొత్తం 211 పతకాలు సాధించి చైనా ప్రథమస్థానం పొదగా, బ్రిటన్, అమెరికాలు రెండో, మూడో స్థానాలలో నిలిచాయి.
సెప్టెంబర్ 27: చైనా టైకోనాట్ ఝూయ్ జియాంగ్ రోదసీ నడక చేయడంతో ఈ ఘనత సాధించిన మూడవ దేశంగా చైనా ఆవిర్బవించింది.
సెప్టెంబర్ 27: ఇరానీ ట్రోఫి క్రికెట్ను రెస్టాఫ్ ఇండియా విజయం సాధించింది. ఈ ట్రోఫీ రెస్టాఫ్ ఇండియా చేజిక్కించుకోవడం ఇది 21వ సారి. వదోదరలో జరిగిన ఫైనల్లో ఢిల్లీ జట్టుపై 187 పరుగుల ఆధిక్యతతో గెల్చింది.
సెప్టెంబర్ 27: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ నియమితులైనాడు. కార్యదర్శి పదవి ఎన్.శ్రీనివాసన్కు దక్కింది.
సెప్టెంబర్ 28: అమెరికా ప్రతినిధుల సభ భారత్-అమెరికా అణుఒప్పందపు బిల్లును ఆమోదించింది.
సెప్టెంబర్ 28: సింగపూర్ గ్రాండ్ప్రిని గెలిచి తొలి రాత్రి ఫార్మూలా-1 రేసు విజేతగా నిల్చి ఫెర్నాండో అలోన్సో రికార్డు సృష్టించాడు.
సెప్టెంబర్ 30: రాజస్థాన్ లోని జోధ్పూర్ లో చాముండా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 150 పైగా భక్తులు మరణించారు. 60కి పైగా గాయపడ్డారు.
అక్టోబర్
అక్టోబర్ 2: భారత్-అమెరికా అణుఒప్పందానికి అమెరికా సెనేట్ ఆమోదముద్ర వేసింది.
అక్టోబర్ 5: జర్మనీలో జరిగిన బిట్బర్గర్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ సింగిల్స్లో చేతన్ ఆనంద్ టైటిల్ సాధించాడు. చేతన్ ఆనంద్ భార్య గుత్తా జ్వాల మిక్స్డ్ డబుల్స్లో విజయం సాధించింది.
సెప్టెంబరు 29: జాగర్లమూడి వీరాస్వామి, హేతువాది, వృత్తిరీత్యా న్యాయవాది అయిన వీరాస్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ మాజీ కమిషన్ ఛైర్మన్. (జ.1919)