From Wikipedia, the free encyclopedia
వీరనరసింహరాయలు విజయనగర సామ్రాజ్యపు చక్రవర్తి. తుళువ వంశ స్థాపకుడైన తుళువ నరస నాయకుని కుమారుడు. ఈయన అసలు పేరు కూడా తండ్రిలాగా నరస నాయకుడే, అయితే సింహాసనాన్ని మాత్రం వీర నరసింహ రాయలు అనే వీరోచిత పేరుతో అధిష్టించాడు. ఇతని తండ్రి నరస నాయకుడు 1503లో దివంగతుడైన తర్వాత వీరనరసింహరాయలు పెనుగొండ లో బందీగా ఉన్న సాళువ ఇమ్మడి నరసింహ రాయలు పేరుతో 1505 వరకు రాజ్యాన్ని పరిపాలించాడు. కానీ 1506లో అతనిని హత్యగావించి తనే రాజుగా సింహాసనాన్ని అధిష్టించాడు.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
విజయ నగర రాజులు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
వీరనరసింహరాయలు సాళువ వంశాన్ని అంతమొందించి తనే రాజుగా మారడాన్ని సహించని సామంతులు తిరుగుబాట్లు చేసారు, ముఖ్యంగా ఆదోని పాలకుడు కాసెప్ప ఒడయరు, ఉమ్మత్తూరు పాలకుడు దేవరాజు, శ్రీరంగపట్నం పాలకుడు గుండరాజులు తిరుగుబాటు చేసారు.
బహుమనీ సుల్తాను మహమ్మద్ షా ఆదేశానుసారం అతని సామంతుడు యాసుఫ్ ఆదిల్ఖాన్ 1502లో విజయనగర రాజ్యంపైకి దండయాత్రకు బయలుదేరినాడు. అప్పటికే తిరుగుబాటు చేస్తున్న ఆదోని కాసెప్ప ఒడయారు అతనికి వంతగా తనూ సైనికులను నడిపించాడు, కానీ అరవీటి రామరాజు కుమారుడు అరవీటి తిమ్మరాజు కందనవోలు (కర్నూలు) ప్రాంతాన్ని పరిపాలిస్తూ విజయనగరాధీశులకు సామంతునిగా ఉండెను. అతను ఈ యూసుఫ్ ఆదిల్ఖాన్, కాసెప్ప ఒడయారు సైనికులను మూడు సంవత్సరాలు జరిగిన యుద్ధమందు ఓడించి తరిమేశాడు. ఈ విజయానికి ఆనందించి వీర నరసింహరాయలు అదవాని (అదోని) సీమను అరవీటి తిమ్మరాజునకు విజయానికి కానుకగా ఇచ్చాడు. ఈ సంఘటన వల్ల అరవీటి వంశస్తులూ, తుళువ వంశస్తులూ చక్కని స్నేహితులు అయినారు.
వీరనరసింగ రాయలు మిగిలిన తిరుగుబాటు చేస్తున్న సామంతులను అణచివేయడానికి, తన సోదరుడైన శ్రీ కృష్ణదేవరాయలును రాజ్యపాలనకు నియమించి, 1508 నాటికి ఉమ్మత్తూరు, శ్రీరంగపట్టణములను ఓడించి విజయనగరము వచ్చాడు, కానీ మరల వీరు తోక జాడించారు. దానితో ఈ సారి తన సోదరులగు అచ్యుత రాయలు, శ్రీరంగ రాయలును సైన్యసమేతంగా సామంతులను అణుచుటకు పంపించెను, ఈ దండయాత్రలో కొంకణ ప్రాంతపాలకుడు కప్పము చెల్లించడానికి అంగీకరించాడు. మిగిలినవారు ఎదిరించి ఓడిపొయినారు.
ఉమ్మత్తూరుపై యుద్ధంలో పోర్చుగీసు వారు గుఱ్ఱాలు, ఫిరంగులు సరఫరాచేసి రాయలకు సహాయం చేశారు. ప్రతిగా వీరు భట్కళ్ రేవుపై ఆధీనాన్ని పొందారు.
తరువాత వీర నరసింహరాయలు మరొక దండయాత్రను దిగ్విజయంగా పూర్తిచేసాడు.
ఈ దండయాత్రలన్నీ ముగిసిన తరువాత వీరు ఆధ్యాత్మిక మార్గంలో పడి కంచి, కుంభకోణము, పక్షితీర్థము, శ్రీరంగము, చిదంబరము, శ్రీకాళహస్తి, గోకర్ణము, రామేశ్వరము, త్రిపురాంతకము, అహోబలము, శ్రీశైలము, తిరుపతి, సంగమేశ్వరము మొదలగు పుణ్యక్షేత్రములను దర్శించి అనేక దాన ధర్మాలను చేసాడు.
దక్షిణ దేశ యాత్రలు తరువాత వీర నరసింగ రాయలు జబ్బు పడినాడు. దానితో తన వద్ద మహామంత్రిగా ఉన్న సాళువ తిమ్మరుసును పిలిపించి, తన తరువాత, తన ఎనిమి సంవత్సరాల కొడుకు తిరుమల రాయలును రాజ్యానికి వారసునిగా చేయమనీ, అలాగే శ్రీ కృష్ణదేవ రాయలు కను గుడ్లు పీకి చూపించమనీ ఆజ్ఞాపించాడు. కానీ తిమ్మరుసు ముందుగానే అనేక యుద్ధములందు శ్రీ కృష్ణదేవరాయల ప్రతాప సామర్ధ్యములు ఎరిగి ఉన్నందువల్ల ఆ పని చేయలేక విషయమంతా కృష్ణదేవ రాయలుకు చెప్పి అతనిని ప్రవాసం పంపించి, ఓ మేక కనుగుడ్లు తెచ్చి చూపించి రాజును అవసాన కాలంలో సంతృప్తి పరచాడని ఒక కథనం ఉంది. కానీ అన్నదమ్ముల మధ్య సౌభ్రాతృత్వం తప్ప వైరమున్నట్టు ఎలాంటి చారిత్రకాధారాలు లేవు. వీర నరసింహరాయలు 1509లో మరణించాడు. ఆ తరువాత కృష్ణదేవరాయల పట్టాభిషేకం ఎలాంటి గొడవలు లేకుండా సునాయాసంగా జరిగిపోయింది.
విజయనగర రాజులు | |
---|---|
సంగమ వంశం | సాళువ వంశం | తుళువ వంశం | ఆరవీడు వంశం | వంశ వృక్షం | పరిపాలన కాలం | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధం | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యం |
ఇంతకు ముందు ఉన్నవారు: తుళువ నరస నాయకుడు |
విజయనగర సామ్రాజ్యము 1503 — 1509 |
తరువాత వచ్చినవారు: శ్రీ కృష్ణదేవ రాయలు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.