సాళువ నరసింహదేవ రాయలు

From Wikipedia, the free encyclopedia

మరింత సమాచారం విజయ నగర రాజులు ...
విజయ నగర రాజులు
సంగమ వంశము
మొదటి హరిహర రాయలు 1336-1356
మొదటి బుక్క రాయలు 1356-1377
రెండవ హరిహర రాయలు 1377-1404
విరూపాక్ష రాయలు 1404-1405
రెండవ బుక్క రాయలు 1405-1406
మొదటి దేవరాయలు 1406-1422
రామచంద్ర రాయలు 1422
వీర విజయ బుక్క రాయలు 1422-1424
రెండవ దేవ రాయలు 1424-1446
మల్లికార్జున రాయలు 1446-1465
రెండవ విరూపాక్ష రాయలు 1465-1485
ప్రౌఢరాయలు 1485
సాళువ వంశము
సాళువ నరసింహదేవ రాయలు 1485-1491
తిమ్మ భూపాలుడు 1491
రెండవ నరసింహ రాయలు 1491-1505
తుళువ వంశము
తుళువ నరస నాయకుడు 1491-1503
వీరనరసింహ రాయలు 1503-1509
శ్రీ కృష్ణదేవ రాయలు 1509-1529
అచ్యుత దేవ రాయలు 1529-1542
సదాశివ రాయలు 1542-1570
ఆరవీటి వంశము
రామ రాయ 1542-1565
తిరుమల దేవ రాయలు 1565-1572
శ్రీరంగ దేవ రాయలు 1572-1586
వేంకటపతి దేవ రాయలు 1586-1614
శ్రీరంగ రాయలు 1 1614-1614
రామదేవ రాయలు 1617-1632
పెద వేంకట రాయలు 1632-1642
శ్రీరంగ రాయలు 2 1642-1646
మూసివేయి

సాళువ నరసింహ రాయ భూపతి

విజయ నగర సింహాసాధిపతికి ముందు ఇతని చరిత్ర

ఇతను పెనుగొండ దుర్గాధిపతి, అప్పటికే సంగమ వంశము క్షీణ దశలో పడి రాజ్య భాగాలు కాకులు పాలైనట్లు అటు గజపతులూ, ఇటు బహుమనీ సుల్తానులూ లాక్కోసాగినారు, నేరుగా సామ్రాజ్యమునకు గుండెవంటి విజయనగరము పైకి దండెత్తి వచ్చి ఓడించి కప్పాలు తీసుకోని పొయినారు. దీనితో సాళువ నరసింహ రాయ భూపతి, తన ధైర్య సాహసములతో పోరాటాలు చేసి రాజ్యభూభాగాలు రక్షించ ప్రయత్నించాడు.

ఉదయగిరి స్వాతంత్ర్యము తెచ్చుట

1470నందు నరసింహరాయలు ఉదయగిరి పై దండెత్తి అక్కడి రాజప్రతినిధిఅయిన కంటంరాజు తమ్మరాజును ఓడించాడు. దీనితో కపిలేశ్వర గజపతి కోపించి, కుమారునితో కలసి ఉదయగిరి పైకి దండెత్తినాడు, కానీ నరసింహరాయలు శక్తి సామర్ద్యాలముందు ఓడిపోయి ప్రాణాలు కోల్పోయినాడు. ఇదే అదనుగా నరసింహరాయలు తమ తమ తీరాంధ్ర భూభాగాలను గజపతులనుండి పునస్వాధీనము చేసుకున్నాడు.

బహుమనీ సైనికులను ఓడించుట

తరువాత గజపతులు అంతఃకలహాలతో రాజ్య భూభాగాలను బహుమనీలకు కోల్పోయినారు. ఈ సమయంలో చాలా యుద్ధాల తరువాత బహుమనీ సుల్తాన్ మూడవ మహమ్మద్ షా దండయాత్రకు బయలుదేరి రాజమహేంద్రవరమును గజపతుల నుండి ఆక్రమించి, కొండవీడును జయించి, కాంచీపురంను జయించి, విశేష ధనముతో వజ్ర వైడూర్య రత మణి మయ ఖచిత ఆభరణాలతో తిరిగి వెళ్లసాగినాడు.

ఇక్కడే నరసింహ రాయ భూపతి తెలివిగా ప్రవర్తించాడు, తుళువ ఈశ్వర నాయకుడు అను గొప్ప శూరుడైన సేనానిని పంపి కందుకూరు వద్ద బహుమనీ సైనికులను ఓడించి మొత్తం ధనుమును స్వాధీనము చేసుకున్నాడు. దీనితో పెనుగొండ సిరిసంపదలతో తులతూగసాగినది.

మచిలీ పట్నం ఆక్రమణ

తరువాత స్వయంగా నరసింహరాయలు మచిలీపట్నంపైకి దండయాత్రకు వెళ్లి ఆక్రమించుకున్నాడు.

బహుమనీ ప్రతీకారం

బహుమనీ సుల్తానులు ఓటమికి బాధపడి మరల గొప్పసైన్యంతో దండయాతకు బయలుదేరి మచిలీపట్నం జయించి పెనుగొండను మాత్రం ఏమీ చేయలేకపొయినారు.

విజయ నగర సింహాసనము అధిస్టించుట

సంగమ వంశీయులు చేతకానివార, చేవ చచ్చి, వ్యసనపరులై, సామంతుల నమ్మకాన్ని కోల్పోయినారు. సామంతుల కోర్కెపై సింహాసనం అధిస్టించాడు.

సింహాసనం అధిస్టించగానే సామంతుల తిరుగుబాటు అణిచివేసినాడు. తరువాత ఉదయగిరి యుద్ధములో ఓడిపోయి దానిని గజపతులస్వాధీనము చేసాడు.

వారసులు

ఇతనికి ఇద్దరు కుమారులు, చివరి క్షణాలలో తన సేనాని అయిన తుళువ నరసనాయకునికి, కుమారులనూ రాజ్యాన్ని అప్పగించి ఎలాగైనా గజపతులు, బహుమనీల ఆధీనంలోని విజయనగర రాజ్య ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోమన్నాడు.

సినిమాలలో ఈ రాజు

అన్నమయ్య సినిమా చూసిన వారికి "గండరగండ, ....పెనుగొండ దుర్గాధిపతి ... సాళువ నరసింహ రాయ భూపతి ..." అంటూ స్టైలుగా మీసం మెలేసే మోహన్ బాబు పాత్ర గుర్తు ఉండే ఉంటుంది, ఆ సాళువ నరసింహ రాయ భూపతే, ఈ సాళువ నరసింహ రాయలు, ఇతని ఆస్తానంలోనే అన్నమయ్య ఉన్నారు, ఇతనే అన్నమయ్యను గొలుసులతో బంధించినాడని చిన్నన్న తన అన్నమయ్య చరిత్ర అను ద్విపద కావ్యంలో వ్రాసినారు.

మరింత సమాచారం విజయనగర రాజులు ...
మూసివేయి


ఇంతకు ముందు ఉన్నవారు:
ప్రౌఢరాయలు
విజయనగర సామ్రాజ్యము
1485 1491
తరువాత వచ్చినవారు:
తిమ్మ భూపాలుడు
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.