వేంకటపతి దేవ రాయలు
From Wikipedia, the free encyclopedia
వెంకటపతి దేవ రాయలు (1585-1614) పెనుకొండ, చంద్రగిరి, వెల్లూరులలో స్థావరాలు కలిగిన విజయనగర సామ్రాజ్యానికి పాలకుడు. అతడు తిరుమల దేవరాయల చిన్న కుమారుడు, శ్రీరంగ దేవరాయల తమ్ముడు. అతడి తండ్రి, అళియ రామరాయలుకు తమ్ముడు.అతని మూడు దశాబ్దాల పాలనలో సామ్రాజ్య బలసంపదలు పునర్జీవనం పొందాయి. అంతర్గత కలహాలతోను, బీజాపూర్, గోల్కొండ సుల్తాన్లతోనూ అతను విజయవంతంగా వ్యవహరించాడు. దేశంలో ఆర్థిక పునరుజ్జీవనాన్ని సాధించాడు. తిరుగుబాటు చేసిన తమిళనాడు నాయకులను, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని కొన్ని భాగాలనూ అదుపులోకి తెచ్చాడు.
విజయ నగర రాజులు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
వెంకటపతి దేవ రాయలు కొంతకాలం పాటు పెనుగొండను, తర్వాత చంద్రగిరిని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ఆయన కాలంలోనే ఈస్టిండియా కంపెనీ వారు వర్తకం కోసం చెన్నపట్టణం ప్రాంతాల్లోకి ప్రవేశించారు. పులికాట్ వద్ద డచ్చివారు స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ వర్తకసంఘాన్ని ఏర్పరుచుకున్న పోర్చుగీస్ వారు ఇతరదేశాల నుంచి దేశంలోకి దిగుమతి చేసే సరుకులపై నూటికి పావలా చొప్పున చక్రవర్తికి సుంకం చెల్లించేవారు.