భారత పురాతత్వ సర్వేక్షణ
పురాతత్వ పరిశోధనలకై భారత కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నడిచే సంస్థ. / From Wikipedia, the free encyclopedia
భారత పురాతత్వ సర్వేక్షణ (Archaeological Survey of India) పురాతత్వ పరిశోధనలకై భారత కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నడిచే సంస్థ. దీన్ని 1861 లో అలెగ్జాండర్ కన్నింగాం అనే ఆంగ్లేయుడు స్థాపించాడు. దీని మొదటి డైరెక్టర్ జనరల్ కూడా ఆయనే. 1958 భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం దేశంలోని అన్ని పురావస్తు కార్యకలాపాలను ఈ సంస్థ నియంత్రిస్తుంది. పురాతన స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు ఇంకా జాతీయ ప్రాముఖ్యత కలిగిన అవశేషాల నిర్వహణ కోసం దేశం మొత్తం 37 మండలాలుగా విభజించబడింది.[2]
త్వరిత వాస్తవాలు సంకేతాక్షరం, లక్ష్యం ...
సంకేతాక్షరం | ASI |
---|---|
లక్ష్యం | प्रत्नकीर्त्तिमपावृणु (గత వైభవాన్ని వెలికితీద్దాం) |
అవతరణ | 1861 |
స్థాపకులు | అలెగ్జాండర్ కన్నింగాం |
రకం | ప్రభుత్వ సంస్థ |
కేంద్రస్థానం | 24-తిలక్ మార్గ్, న్యూఢిల్లీ |
సేవలందించే ప్రాంతం | భారతదేశం |
అధికార భాష | ఇంగ్లీషు హిందీ |
డైరెక్టర్ జనరల్ | వి. విద్యావతి, ఐ.ఎ.ఎస్ |
Parent organisation | కేంద్ర సాంస్కృతిక శాఖ |
బడ్జెట్ | ₹1,042.63 crore (US$130 million)[1] |
వెబ్సైటు | https://asi.nic.in/ |
మూసివేయి