భారత రాజకీయ నాయకుడు From Wikipedia, the free encyclopedia
రామ్ విలాస్ పాశ్వాన్ (జననం 1946 జూలై 5 - మరణం 2020 అక్టోబరు 8) భారతదేశ రాజకీయ నాయకుడు. అతను బీహార్ రాష్ట్రానికి చెందినవాడు. అతను ప్రస్తుత వినియోగదారుల వ్యవహారాల, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిగా ఉన్నాడు. పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు. అతను ఎనిమిది సార్లు లోక్సభ సభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా ఉన్నాడు.[3] అతను సంయుక్త సోషలిస్ట్ పార్టీ సభ్యునిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, 1969 లో అలౌలి (ఖాగారియా) నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. అతను 1974 లో లోక్ దళ్ ఏర్పడిన తరువాత దానిలో చేరి ప్రధాన కార్యదర్శి అయ్యాడు. అతను ఆ కాలంలో అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించినందున అతనిని అరెస్టు చేసారు. అతను 1977లో హాజీపూర్ నియోజకవర్గం నుండి జనతా పార్టీ సభ్యుడిగా లోక్సభలో ప్రవేశించాడు. అతను 1980, 1989, 1996, 1998, 1999, 2004, 2014లో మళ్లీ పార్లమెంటు సభ్యునిగా ఎంపికయ్యాడు. ఆయనకు భారత ప్రభుత్వం 2022లో పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.
రామ్ విలాస్ పాశ్వాన్ | |||
పదవీ కాలం 26 మే 2014 – 2020 అక్టోబర్ 8 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
ముందు | శరద్ పవార్ | ||
తరువాత | పీయూష్ గోయల్ | ||
పార్లమెంటు సభ్యుడు, రాజ్యసభ | |||
పదవీ కాలం 28 జూన్ 2019 – 2020 అక్టోబర్ 8 | |||
ముందు | రవిశంకర్ ప్రసాద్ | ||
నియోజకవర్గం | బీహార్ | ||
పదవీ కాలం జూలై 2010[1] – 2014 | |||
రసాయనాల, ఎరువుల మంత్రి [1] | |||
పదవీ కాలం 23 మే 2004 – 22 మే 2009 | |||
తరువాత | ఎం.కె.అళగిరి | ||
గనుల శాఖా మంత్రి [1] | |||
పదవీ కాలం 1 సెప్టెంబరు 2001 – 29 ఏప్రిల్ 2002 | |||
ముందు | సుందర్ లాల్ పట్వా | ||
కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి[1] | |||
పదవీ కాలం 13 అక్టోబరు 1999 – 1 సెప్టెంబరు 2001 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి | ||
ముందు | అటల్ బిహారీ వాజపేయి | ||
తరువాత | ప్రమోద్ మహాజన్ | ||
రైల్వే మంత్రి[2] | |||
పదవీ కాలం 1 జూన్ 1996 – 19 మార్చి 1998 | |||
ప్రధాన మంత్రి | హెచ్.డి.దేవెగౌడ ఐ.కె.గుజ్రాల్ | ||
ముందు | సి.కె.జాఫర్ షరీఫ్ | ||
తరువాత | నితిష్ కుమార్ | ||
కార్మిక, సంక్షేమ శాఖ మంత్రి | |||
పదవీ కాలం 5 డిసెంబరు 1989 – 10 నవంబరు 1990 | |||
ప్రధాన మంత్రి | విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ | ||
ముందు | బిందేశ్వరి దూబే | ||
తరువాత | కె.చంద్రశేఖర రావు | ||
పార్లమెంటు సభ్యుడు, లోక్సభ | |||
పదవీ కాలం 16 మే 2014 – 23 మే 2019 | |||
ముందు | రామ్ సుందర్ దాస్ | ||
తరువాత | పశుపతి కుమార్ పరస్ | ||
నియోజకవర్గం | హాజీపూర్ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | ఖగరియా, బీహార్ రాజ్యం, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం బీహార్, భారతదేశం ) | 1946 జూలై 5||
రాజకీయ పార్టీ | లోక్సనశక్తి పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | జనతా దళ్, జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | రాజ్కుమారి దేవి
(m. 1969–1981)రీనాశర్మ (m. 1982) | ||
సంతానం | 4; చిరాగ్ పాశ్వాన్ తో సహా | ||
నివాసం | ఖహారియా, బీహార్, భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | పాట్నా విశ్వవిద్యాలయం (M.A, LLB) | ||
30 May, 2019నాటికి |
2000 లో లోక్ జనశక్తి పార్టీ (ఎల్జెపి) ని స్థాపించి దాని అధ్యక్షుడిగా ఉన్నాడు. తదనంతరం 2004 లో పాలక యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వంలో చేరాడు. అతను ఆ ప్రభుత్వంలో రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ, ఉక్కు మంత్రిత్వ శాఖలో కేంద్ర మంత్రిగా పనిచేసాడు. అతను 2004 లోక్సభ ఎన్నికలలో గెలిచాడు కాని 2009 ఎన్నికలలో ఓడిపోయాడు. 2010 నుండి 2014 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్న తరువాత 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో హాజీపూర్ నియోజకవర్గం నుండి 16 వ లోక్సభ తిరిగి ఎన్నికయ్యాడు.
పాశ్వాన్ బీహార్లో 1946 లో దళిత కుటుంబంలో జన్మించాడు.[4] అతను దుసాద్ వర్గానికి చెందినవాడు. పాశ్వాన్ కోసి కాలేజ్, పిల్కి, పాట్నా విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్, ఎం.ఏ డిగ్రీలను పొందాడు .[5] అతను 1969 లో బీహార్ పోలీసు శాఖలో డి.ఎస్.పి గా ఎంపికయ్యాడు.[6]
పాశ్వాన్ 1969 లో బీహార్ రాష్ట్ర శాసనసభకు రిజర్వు చేసిన నియోజకవర్గం నుండి సంయుక్త సోషలిస్ట్ పార్టీ ( "యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ" ) సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1974 లో, రాజ్ నారాయణ్, జయప్రకాష్ నారాయణ్ ల ముఖ్యమైన అనుచరుడిగా పాశ్వాన్ లోక్దళ్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యాడు. రాజ్ నారాయణ్, కార్పూరి ఠాకూర్, సత్యేంద్ర నారాయణ్ సిన్హా వంటి అత్యవసరపరిస్థితిని వ్యతిరేకించే నాయకులతో అతను వ్యక్తిగతంగా సన్నిహితంగా ఉన్నాడు. అతను మొరార్జీ దేశాయ్తో విడిపోయి, లోక్బంధు రాజ్ నరేన్ నేతృత్వంలోని జనతా పార్టీ-ఎస్లో చేరి పార్టీ అధ్యక్షుడిగా తరువాత దాని ఛైర్మన్గా పనిచేసాడు. 1975 లో భారతదేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు అతన్ని అరెస్టు చేసినందున పూర్తి కాలం జైలులో గడిపాడు. 1977 లో విడుదలైన తరువాత అతను జనతా పార్టీ సభ్యుడయ్యాడు.[7] జనతా పార్టీ టికెట్పై మొదటిసారి పార్లమెంటుకు ఎన్నికలలో గెలిచాడు. ఎన్నికలలో అత్యధిక తేడాతో గెలిచి ప్రపంచ రికార్డును స్వంతం చేసుకున్నాడు. హాజీపూర్ నియోజకవర్గం నుండి 1980, 1984 లో 7 వ లోక్సభకు తిరిగి ఎన్నికయ్యాడు. 1983 లో అతను దళిత విముక్తి, సంక్షేమం కోసం ఒక సంస్థ అయిన దళిత సేనను స్థాపించాడు.
పాశ్వాన్ 1989 లో 9 వ లోక్సభకు తిరిగి ఎన్నికయ్యాడు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర కార్మిక, సంక్షేమ మంత్రిగా నియమితులయ్యాడు. 1996 లో అప్పటి ప్రధాని రాజ్యసభ సభ్యుడు అయినందున లోక్సభలో పాలక కూటమి లేదా ప్రభుత్వ మద్దతు దారులకు నాయకత్వం వహించాడు. అతను మొదటిసారి కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సంవత్సరం కూడా ఇదే. అతను 1998 వరకు ఆ పదవిలో కొనసాగాడు. ఆ తరువాత అతను 1999 అక్టోబరు నుండి 2001 సెప్టెంబరు వరకు కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రిగా ఉన్నాడు.
లోక్ జనశక్తి పార్టీ (ఎల్.జి.పి) ను ఏర్పాటు చేయడానికి 2000 లో పాశ్వాన్ జనతాదళ్ నుండి విడిపోయాడు. 2004 లోక్సభ ఎన్నికల తరువాత పాశ్వాన్ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వంలో చేరి, రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ, ఉక్కు మంత్రిత్వ శాఖలో కేంద్ర మంత్రిగా చేశాడు.
2005 ఫిబ్రవరి బీహార్ రాష్ట్ర ఎన్నికలలో పాశ్వాన్ పార్టీ లోక్ జనశక్తి పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో కలసి ఎన్నికల్లో పోటీ చేసింది. ఫలితం ఏమిటంటే ఏ ప్రత్యేక పార్టీ లేదా కూటమికి స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సీట్లు లభించలేదు. ఏదేమైనా పాశ్వాన్ చాలా అవినీతిపరుడని ఆరోపించిన లాలూ యాదవ్ లేదా వామపక్షాలు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కు మద్దతు ఇవ్వడానికి నిరాకరించాయి. తద్వారా ప్రతిష్టంభన ఏర్పడింది. పాశ్వాన్ పార్టీలోని 12 మంది సభ్యులను మద్దతు కోసం ఒప్పించడంతో నితీష్ కుమార్ విజయవంతం కావడంతో ఈ ప్రతిష్టంభన తొలగింది; బీహార్ గవర్నర్ బుటా సింగ్ లోక్ జనశక్తి పార్టీ ఫిరాయింపుదారుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పడకుండా ఉండటానికి రాష్ట్ర శాసనసభను రద్దు చేసి కొత్తగా ఎన్నికలకు పిలుపునిచ్చాడు. బీహార్ ను రాష్ట్రపతి పాలనలో ఉంచారు. . 2005 నవంబరు బీహార్ రాష్ట్ర ఎన్నికలలో పాశ్వాన్ యొక్క మూడవ కూటమి పూర్తిగా నాశనమైంది; లాలూ యాదవ్-కాంగ్రెస్ కూటమి మైనారిటీకి వెళ్ళింది. ఎన్.డి.ఏ. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
బీహార్ రాష్ట్ర ఎన్నికలు కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపవని, ఈ ప్రభుత్వం అతనితో పాటు లాలూ యాదవ్ మంత్రులుగా కొనసాగుతుందని పాశ్వాన్ ప్రకటించాడు. పాశ్వాన్ ఐదు వేర్వేరు ప్రధానమంత్రుల క్రింద కేంద్ర మంత్రిగా పనిచేశాడు. 1996 నుండి (2015 నాటికి) ఏర్పడిన అన్ని మంత్రుల మండలిలో నిరంతరం క్యాబినెట్ బెర్త్ను కలిగి ఉన్నాడు. 1996 నుండి 2015 వరకు భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అన్ని జాతీయ సంకీర్ణాలలో ( యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ) అతను ఉన్నాడు.[8]
2009 భారత సార్వత్రిక ఎన్నికలలో పాశ్వాన్ లాలూ ప్రసాద్ యాదవ్, అతని రాష్ట్రీయ జనతా దళ్ లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అదే సమయంలో వారి పూర్వ సంకీర్ణ భాగస్వామి, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ నాయకుడైన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను కొత్త కూటమి నుండి తొలగించాడు. వీరిద్దరిని తరువాత ములాయం సింగ్ సమాజ్ వాదీ పార్టీ చేర్చి నాల్గవ ఫ్రంట్ గా ప్రకటించాడు. 33 సంవత్సరాలలో మొదటిసారి బీహార్ మాజీ ముఖ్యమంత్రి జనతాదళ్కు చెందిన రామ్ సుందర్ దాస్ హాజీపూర్ నుండి ఎన్నికలలో ఓడిపోయాడు. అతని పార్టీ లోక్ జనశక్తి పార్టీ 15 వ లోక్సబలో ఏ సీట్లు గెలవలేకపోయింది. అతని సంకీర్ణ భాగస్వామి యాదవ్, అతని పార్టీ కూడా మంచి ప్రదర్శన ఇవ్వలేక 4 సీట్లకు మాత్రమే పరిమితమైంది.
హాజీపూర్ నియోజకవర్గం నుండి 2014 భారత సార్వత్రిక ఎన్నికల తరువాత అతను 16 వ లోక్సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. అతని కుమారుడు చిరాగ్ పాశ్వాన్ బీహార్లోని జమూయ్ నియోజకవర్గం నుండి గెలిచాడు.[9]
పాశ్వాన్కు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖకు 2014 మేలో బాధ్యతలు అప్పగించారు. ఇది 2019 లో రెండవ మోడీ మంత్రిత్వ శాఖలో కొనసాగింది.[10]
పాశ్వాన్ బీహార్లోని ఖగారియా జిల్లా లోని షాహర్బన్నీ గ్రామానికి చెందినవాడు. అతను షెడ్యూల్డ్-కుల కుటుంబంలో జన్మించాడు. అతను 1960 లలో రాజ్కుమారి దేవిని వివాహం చేసుకున్నాడు. తన లోక్సభ నామినేషన్ పత్రాలను సవాలు చేసిన తరువాత 1981 లో అతను ఆమెను విడాకులు తీసుకున్నట్లు 2014 లో వెల్లడించాడు.[11][12] అతనికి మొదటి భార్య ఉషా, ఆశా నుండి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[13] 1983 లో అతను అమృత్సర్లో ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తున్న, పంజాబీ హిందూ కుటుంబానికి చెద్మిన రీనా శర్మను వివాహం చేసుకున్నాడు.[14][15] వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అతని కుమారుడు చిరాగ్ పాశ్వాన్ రాజకీయ నాయకుడు.[12][16] గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు.కొద్ది రోజుల క్రితమే ఆయనకు దిల్లీలోని ఓ ఆస్పత్రిలో గుండె శస్త్రచికిత్స జరిగింది. ఐదు వారాలుగా హాస్పిటల్లోనే చికిత్స పొందుతూ గురువారం 2020 అక్టోబరు 08 న మరణించారు.[17]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.