లోక్‌దళ్

భారతీయ రాజకీయ పార్టీ From Wikipedia, the free encyclopedia

లోక్‌దల్ అనేది వ్యవసాయ విధానాలపై ఆధారపడిన భారతీయ రాజకీయ పార్టీ. దీనిని భారత మాజీ ప్రధాని చరణ్ సింగ్ స్థాపించాడు.[1][2][3][4] ఇది జనతా పార్టీ (సెక్యులర్), సోషలిస్ట్ పార్టీ, ఒరిస్సా జనతా పార్టీలను విలీనం చేయడం ద్వారా 1979, సెప్టెంబరు 26న ఈ పార్టీ స్థాపించబడింది.[5] లోక్ దళ్ అధ్యక్షుడిగా చరణ్ సింగ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజ్ నారాయణ్ ఎన్నికయ్యారు.[5]

త్వరిత వాస్తవాలు లోక్‌దళ్, స్థాపకులు ...
లోక్‌దళ్
స్థాపకులుచరణ్ సింగ్
స్థాపన తేదీ1980
Preceded byభారతీయ లోక్ దళ్/జనతా పార్టీ (సెక్యులర్)
ప్రధాన కార్యాలయంసెంట్రల్ ఆఫీస్, 8, మాల్ అవెన్యూ, లక్నో, ఉత్తర ప్రదేశ్
రాజకీయ విధానంలౌకికవాదం
ECI Statusప్రాంతీయ పార్టీ
మూసివేయి

1982 ఆగస్టులో, లోక్ దళ్‌లో పెద్ద చీలిక ఏర్పడింది, ఒక వర్గం చరణ్ సింగ్, మరొక వర్గంలో కర్పూరి ఠాకూర్, మధు లిమాయే, బిజూ పట్నాయక్, దేవి లాల్, జార్జ్ ఫెర్నాండెజ్, కుంభా రామ్ ఆర్య ఉన్నారు.[6] లోక్ దళ్, జనతాపార్టీ, కాంగ్రెస్ (సెక్యులర్) ల విలీనాన్ని సులభతరం చేసేందుకు ఏర్పాటైన సమన్వయ కమిటీతో చరణ్ సింగ్ విడిపోవడం వల్ల తిరుగుబాటుదారులు కలత చెందారు.[7] తరువాత, 1983 జనవరిలో, కర్పూరీ ఠాకూర్ నేతృత్వంలోని లోక్ దళ్ జనతా పార్టీలో విలీనమైంది.[8]

1984, అక్టోబరు 21న, లోక్ దళ్, డెమోక్రటిక్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ హేమవతి నందన్ బహుగుణ, రాష్ట్రీయ కాంగ్రెస్ ఆఫ్ రతుభాయ్ అదానీ, దేవి లాల్ వంటి జనతా పార్టీకి చెందిన కొందరు నాయకులు కలిసి దళిత మజ్దూర్ కిసాన్ పార్టీని స్థాపించారు.[9][10] తరువాత దాని పేరును తిరిగి లోక్ దళ్ గా మార్చుకుంది.[11]

1987 ఫిబ్రవరిలో, లోక్ దళ్ రెండు వర్గాలుగా (అజిత్ సింగ్ లోక్ దళ్ (ఎ), హేమవతి నందన్ బహుగుణ లోక్ దళ్ (బి)) చీలిపోయింది. యుపి శాసనసభలో లోక్ దళ్ నాయకుడిగా ఉన్న ములాయం సింగ్ యాదవ్‌ను అజిత్ సింగ్ తొలగించి, సత్యపాల్ సింగ్ యాదవ్‌ను లోక్ దళ్ నాయకుడిగా చేశారు.[12][13]

1988 మే లో, అజిత్ సింగ్ లోక్ దళ్‌ను జనతా పార్టీలో విలీనం చేసి జనతా పార్టీ అధ్యక్షుడయ్యాడు.[14]

సునీల్ సింగ్ నేతృత్వంలోని చీలిక బృందం ఇప్పటికీ ఉత్తరప్రదేశ్‌లో 'లోక్ దళ్'గా చురుకుగా ఉంది.

ప్రముఖ సభ్యులు

ఇవికూడా చూడండి

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.