భారతదేశంలో బ్రిటిషు పాలన
భారత ఉపఖండంలో బ్రిటిష్ పాలన, 1858-1947 / From Wikipedia, the free encyclopedia
బ్రిటిషు పాలన లేదా బ్రిటిషు రాజ్ భారత ఉపఖండంలో స్థూలంగా 1858 నుంచి 1947 వరకూ సాగిన బ్రిటిషు పరిపాలన. [1][2] ఈ పదాన్ని అర్థస్వతంత్ర కాలావధికి కూడా ఉపయోగించవచ్చు.[2][3] ఇండియాగా సాధారణంగా పిలిచే ఈ బ్రిటిషు పాలిత ప్రాంతంలో -బ్రిటిషర్లు నేరుగా పరిపాలించే ప్రాంతాలతో పాటుగా, వేర్వేరు రాజులు పరిపాలించే సంస్థానాలు కూడా కలిసి ఉన్నాయి- మొత్తంగా ఆ ప్రాంతమంతా బ్రిటిషు సార్వభౌమత్వం లేదా చక్రవర్తిత్వం కింద ఉన్నట్టు. ఈ ప్రాంతాన్ని కొందరు బ్రిటిషు ఇండియా అని కూడా వ్యవహరించేవారు.[4]
భారతీయ సామ్రాజ్యం Indian Empire | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1858–1947 | |||||||||||||
రాజధాని | కలకత్తా (1858–1911) క్రొత్త ఢిల్లీ (1911–1947) | ||||||||||||
సామాన్య భాషలు | |||||||||||||
మతం | హిందూ మతం, ఇస్లాం మతం, క్రైస్తవ మతం, సిక్కు మతం, బౌద్ధ మతం, జైన మతం, జొరాస్ట్రియన్ మతం, జుడాయిజం | ||||||||||||
ప్రభుత్వం | British Colonial Government | ||||||||||||
Monarch of the United Kingdom and Emperor/Empressa | |||||||||||||
• 1858–1901 | విక్టోరియా | ||||||||||||
• 1901–1910 | ఎడ్వర్డ్ VII | ||||||||||||
• 1910–1936 | జార్జి V | ||||||||||||
• 1936 | ఎడ్వర్డ్ VIII | ||||||||||||
• 1936–1947 | జార్జి VI | ||||||||||||
Viceroyb | |||||||||||||
• 1858–1862 (first) | Charles Canning | ||||||||||||
• 1947 (last) | Louis Mountbatten | ||||||||||||
Secretary of State | |||||||||||||
• 1858–1859 (first) | Edward Stanley | ||||||||||||
• 1947 (last) | William Hare | ||||||||||||
శాసనవ్యవస్థ | Imperial Legislative Council | ||||||||||||
చరిత్ర | |||||||||||||
1757 మే 23 , 1857 మే 10 | |||||||||||||
• Government of India Act | మే 2 1858 | ||||||||||||
జులై 18 1947 | |||||||||||||
1947 మే 14 , 15 | |||||||||||||
ద్రవ్యం | భారతీయ రూపాయి | ||||||||||||
ISO 3166 code | IN | ||||||||||||
| |||||||||||||
|
విక్టోరియా రాణి కొరకు భారత సామ్రాజ్యాన్ని అధికారికంగా టోరీ ప్రధాని బెంజమిన్ డిస్రేలీ 1876 లో ఏర్పరచాడు. జర్మనీ, రష్యా పాలకులకు విక్టోరియా తీసిపోయినట్టు భావించకుండా ఉండేందుకు ఈ ఏర్పాటుచేశారు.[5] భారతదేశం బ్రిటిషు పాలనలో ఉండగానే నానాజాతిసమితి వ్యవస్థాపక సభ్యదేశం. 1900, 1920, 1928, 1932,1936 సంవత్సరాల్లో వేసవి ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న దేశం. 1945లో శాన్ ఫ్రాన్సిస్కోలో ఐక్యరాజ్యసమితిలో వ్యవస్థాపక సభ్యత్వం ఉన్న దేశం.[6]
పరిపాలన విధానం 1858 జూన్ 28లో బ్రిటిషు ఈస్టిండియా కంపెనీ పాలన విక్టోరియా రాణి సింహాసనానికి మారినప్పుడు ఏర్పాటయింది. [7] (1876లో అదే విక్టోరియా రాణిని భారతదేశపు చక్రవర్తిగా ప్రకటించారు), బ్రిటిషు ఇండియా సామ్రాజ్యం యూనియన్ ఆఫ్ ఇండియా (తర్వాతి కాలంలో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా), డొమినియన్ ఆఫ్ పాకిస్తాన్ (తదనంతర కాలంలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్, దానిలోని తూర్పుభాగం మరింత తర్వాతి కాలంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ అయింది), డొమినియన్ ఆఫ్ సిలోన్ (ప్రస్తుతం శ్రీలంక), సిక్కిం (ప్రస్తుతం భారతదేశంలో భాగం) గా ఐదు సార్వభౌమ రాజ్యాలుగా 1947లో విభాజితమయ్యే వరకు కొనసాగింది. 1858లో బ్రిటిషు రాజ్ ఆరంభమయ్యేనాటికే దిగువ బర్మా బ్రిటిషు పాలనలో భాగంగా ఉంది. 1886 లో ఎగువ బర్మా చేర్చారు. దాంతో బర్మాను 1937 వరకూ స్వయంపాలిత విభాగంగా నిర్వహించారు. తర్వాత అదొక ప్రత్యేక బ్రిటిషు కాలనీగా స్వాతంత్ర్యాన్ని పొందడం ప్రారంభమై చివరకు 1948లో బ్రిటిషు మయన్మార్ బర్మాగా రూపాంతరం చెందింది.