పోర్చుగల్
From Wikipedia, the free encyclopedia
పోర్చుగల్ (అధికార నామము పోర్చుగీస్ రిపబ్లిక్) [note 1] ఐరోపా ఖండం లోని ఐబీరియా ద్వీపకల్పంలోని ఒక దేశం. నైఋతి ఐరోపాలో ఉన్న పోర్చుగల్ అట్లాంటిక్ మహాసముద్రానికి తూర్పు, ఉత్తర దిశలలో స్పెయిన్ ఉంది. దీనికి రాజధాని లిస్బన్. అట్లాంటిక్ ద్వీపసముహంలో స్వయంప్రతిపత్తి కలిగిన అజోరెస్, మడియేరా ద్వీపాలు వాటి ప్రాంతీయ ప్రభుత్వ నిర్వహణ చేస్తూ దేశంలో భాగంగా ఉన్నాయి.[3]
República Portuguesa పోర్చుగీస్ రిపబ్లిక్ |
||||||
---|---|---|---|---|---|---|
జాతీయగీతం |
||||||
Location of పోర్చుగల్ (green) – on the European continent (light green & dark grey) |
||||||
రాజధాని అతి పెద్ద నగరం | లిస్బన్5 38°46′N 9°11′W | |||||
అధికార భాషలు | పోర్చుగీసు1 | |||||
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు | మిరాండీస్ | |||||
జాతులు | 95.9% పోర్చుగీస్, 4.1% (బ్రెజీలియన్లు, కేప్వెర్డియన్లు, en:Ukrainians, అంగోలా, ఇతర మైనారిటీలు) | |||||
ప్రజానామము | పోర్చుగీసు | |||||
ప్రభుత్వం | పార్లమెంటరీ రిపబ్లిక్6 | |||||
- | అధ్యక్షుడు | అనిబాల్ కవాకో సిల్వా | ||||
- | ప్రధానమంత్రి | జోసె సోక్రటీస్ | ||||
- | అసెంబ్లీ అధ్యక్షుడు | జైమా గామా | ||||
ఏర్పాటు | Conventional date for Independence is 1139 | |||||
- | స్థాపన | 868 | ||||
- | పునస్థాపన | 1095 | ||||
- | డీ ఫ్యాక్టో సార్వభౌమ | 24 జూన్ 1128 | ||||
- | సామ్రాజ్యం | 25 జూలై 1139 | ||||
- | Recognized | 5 October 1143 | ||||
- | పాపల్ గుర్తింపు (Papal Recognition) | 1179 | ||||
Accession to the European Union |
1 జనవరి 1986 | |||||
- | జలాలు (%) | 0.5 | ||||
జనాభా | ||||||
- | 2007 అంచనా | 10,617,575 (77th) | ||||
- | 2001 జన గణన | 10,355,824 | ||||
జీడీపీ (PPP) | 2007 అంచనా | |||||
- | మొత్తం | $230.834 billion[1] (43వది) | ||||
- | తలసరి | $21,778[1] (IMF) (34వది) | ||||
జీడీపీ (nominal) | 2007 అంచనా | |||||
- | మొత్తం | $223.447 billion[1] (30వది) | ||||
- | తలసరి | $21,081[1] (IMF) (31nd) | ||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2005) | 0.897 (high) (29th) | |||||
కరెన్సీ | యూరో (€)² (EUR ) |
|||||
కాలాంశం | WET³ (UTC0) | |||||
- | వేసవి (DST) | WEST (UTC+1) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .pt4 | |||||
కాలింగ్ కోడ్ | +351 | |||||
1 | మిరాండీస్, spoken in some villages of the municipality of Miranda do Douro, was officially recognized in 1999 (Lei n.° 7/99 de 29 de Janeiro), since then awarding an official right-of-use Mirandese to the linguistic minority it is concerned.[2] The Portuguese Sign Language is also recognized. | |||||
2 | Before 1999: Portuguese escudo. | |||||
3 | Azores: UTC-1; UTC in summer. | |||||
4 | The .eu domain is also used, as it is shared with other European Union member states. | |||||
5 | Coimbra was the capital of the country from 1139 to about 1260. | |||||
6 | The present form of the Government was established by the Carnation Revolution of 25 April 1974, that ended the authoritarian regime of the Estado Novo. |
పోర్చుగల్ ఒక అభివృద్ధి చెందిన దేశము. పోర్చుగల్ ఐక్యరాజ్య సమితి (1955 నుండి), ఐరోపా సమాఖ్య, నాటో, ఓఈసీడీ లలో సభ్యదేశంగా ఉంది.
15వ శతాబ్దంలో భారతదేశం చేరే నావిక మార్గాన్ని కనుక్కోవడంలో పోర్చుగల్ దేశస్థులు ముందున్నారు. ఆ దేశస్థుడైన వాస్కో డ గామా (Vasco da Gama) 1498లో ఐరోపా నుండి భారతదేశానికి నేరుగా సముద్రమార్గాన్ని కనుగొన్నాడు. వాస్కోడిగామా బృందము మొట్టమొదట కాలికట్లో కాలుమోపింది. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వర్తకులు గోవాలో స్థావరం ఏర్పరచుకొన్నారు. కొద్దికాలంలోనే, 1510లో అఫోన్సో డి ఆల్బుకరెక్ గోవాను స్వాధీనపరుచుకుని అధికారాన్ని బలవంతంగా హస్తగతం చేసుకొన్నాడు. 1531లో దమన్ను, ఆ తర్వాత దియును పోర్చుగీసువారు ఆక్రమించారు. 1539లో గుజరాతు సుల్తాను ద్వారా దమన్ అధికారికంగా పోర్చుగీసువారికి అప్పగింపబడింది. పోర్చుగీసువారు గోవాను స్వాధీనపరుచుకున్న 450 ఏండ్ల తరువాత, 1961లో డిసెంబరు 19న భారత ప్రభుత్వం గోవా, దమన్, దియులను తన అధీనంలోకి తీసుకొన్నది.[4][5]. కానీ పోర్చుగల్ ప్రభుత్వం 1974 వరకు వీటిపై భారతదేశపు అధిపత్యాన్ని అంగీకరించలేదు. అలాగే దాద్రా నగరు హవేలీ కూడా 1779 నుండి 1954లో భారతదేశము స్వాధీనము చేసుకునే వరకు పోర్చుగీస్ కాలనీగా ఉంది.
పోర్చుగల్ ఇబెరియన్ ద్వీపకల్పంలో అత్యంత పురాతన రాష్ట్రంగా ఉంది. పురాతన యూరోపియన్ దేశాలలో ఒకటిగా ఉంది. దాని భూభాగంలో నిరంతరం మాననవనివాసితంగా ఉంది. చరిత్రకు పూర్వం నుండే ఆక్రమించబడింది. ప్రీ-సెల్ట్స్, సెల్ట్స్, కార్తగినియన్లు, రోమన్లు విసిగోత్స్, స్యూబి జర్మానిక్ ప్రజల దండయాత్రలు జరిగాయి. సా.శ. 711 లో ఐబీరియన్ ద్వీపకల్పాన్ని ఆక్రమించిన ముస్లిం మూర్సుకు వ్యతిరేకంగా పోర్చుగల్ క్రిస్టియన్ రీకోనక్స్టా తరువాత పోర్చుగల్ స్థాపించబడింది. "సావో మమేడే యుద్ధం" తరువాత అపోన్సో హెన్రిక్స్ నేతృత్వంలోని పోర్చుగీస్ దళాలు అతని తల్లి థెరెస్సా పోర్చుగల్ నేతృత్వంలోని దళాలను ఓడించగా పోర్చుగల్ కౌంటీ దాని సార్వభౌమత్వాన్ని ధ్రువీకరించింది. అపోన్సో హెన్రిక్స్ తనకుతానుగా పోర్చుగల్ ప్రిన్స్ ప్రకటించుకున్నాడు. తరువాత అతను 1139 లో అవేక్యు యుద్ధంలో పోర్చుగల్ రాజుగా ప్రకటించబడ్డాడు. 1143 లో పొరుగు రాజ్యాలచే గుర్తించబడ్డాడు.[6] 15 వ, 16 వ శతాబ్దాలలో పోర్చుగల్ మొట్టమొదటి ప్రపంచ సామ్రాజ్యాన్ని స్థాపించింది. ఇది ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక, రాజకీయ, సైనిక శక్తులలో ఒకటిగా మారింది.[7][8][9]
ఈ కాలంలో డిస్కవరీ యుగంగా పిలువబడేది పోర్చుగీసు అన్వేషకులు సముద్రపు అన్వేషణకు ముందున్నారు. ప్రత్యేకించి ప్రిన్స్ హెన్రీ ది నావిగేటర్, కింగ్ రెండవ జాన్ ఆధీఅంలో బార్టోలోమేయు డయాస్ గుడ్ హొప్ కేప్ (1488 ), వాస్కో డా గామా భారతదేశం (1497-98), బ్రెజిల్ యూరోపియన్ డిస్కవరీ (1500) సముద్ర మార్గాన్ని కనుగొన్నారు. పోర్చుగల్ ఈ సమయంలో సుగంధ వాణిజ్యాన్ని గుత్తాధిపత్యం కలిగి ఉంది. సామ్రాజ్యం సైనిక పోరాటాలతో ఆసియాలో విస్తరించింది. అయితే 1755 భూకంపంలో లిస్బన్ నాశనం నెపోలియన్ యుద్ధాల సమయంలో దేశం ఆక్రమణ, బ్రెజిల్ స్వాతంత్ర్యం (1822) లో లిస్బన్ విధ్వంసం వంటి సంఘటనలు పోర్చుగల్ను యుద్ధం నుండి చేశాయి, దాని ప్రపంచ శక్తి క్షీణించింది.[10]
1910 లో జరిగిన విప్లవం రాచరికాన్ని తొలగించిన తరువాత ప్రజాస్వామ్య కాని అస్థిర పోర్చుగీస్ ఫస్ట్ రిపబ్లిక్ స్థాపించబడింది. తరువాత రైట్ - వింగ్కు చెందిన ఎస్టాడో నోవో నిరంకుశ పాలనలో అణిచివేతకు గురైంది. 1974 లో కార్నేషన్ విప్లవం తరువాత పోర్చుగీస్ కలోనియల్ యుద్ధం ముగిసిన తరువాత ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడింది. కొద్దికాలానికే స్వాతంత్ర్యం దాదాపు అన్ని విదేశీ భూభాగాలకు ఇవ్వబడింది. 1999 లో చైనాకు మాకాను అప్పగించిన కాలం చేసుకున్న కాలం కాలనీల సామ్రాజ్యానికి ముగింపుగా ఉంది.[11] పోర్చుగల్ ప్రపంచం అంతటా విస్తారమైన సాంస్కృతిక, నిర్మాణవైభవాన్ని విడిచి పెట్టింది. 250 మిలియన్లకు పైగా పోర్చుగీస్ మాట్లాడే ప్రజలు ఉన్నారు. పోర్చుగీస్ ఆధారిత క్రియోల్ భాషా వారసత్వం కలిగిన ప్రజలు ఉన్నారు. ఐక్యరాజ్యసమితి, ఐరోపా సమాఖ్య సభ్యదేశంగా ఉంది. పోర్చుగల్ నాటో, యూరోజోన్, ఒ.ఇ.సి.డి., కమ్యూనిటీ ఆఫ్ పోర్చుగీస్ భాష దేశాల వ్యవస్థాపక సభ్యదేశాలలో ఒకటిగా ఉంది.
పోర్చుగల్ అనేది అధిక ఆదాయం కలిగిన ఆధునిక ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి చెందిన మార్కెట్, ఉన్నత జీవన ప్రమాణాలతో అభివృద్ధి చెందిన దేశంగా గుర్తించబడింది.[12][13][14] పర్యావరణ పనితీరు (7 వ స్థానం)ఎల్.జి.బి.టి.ఐ. హక్కులు (ఐరోపాలో 6 వ స్థానం) [15] ప్రెస్ స్వేచ్ఛ (18 వ స్థానం) సామాజిక పురోగతి (20 వ స్థానం), శ్రేయస్సు (25 వ స్థానం) పరంగా ఇది అత్యధిక స్థానంలో ఉంది, ఉత్తమ రోడ్ నెట్వర్క్ ప్రపంచదేశాలలో ఒకటిగా ఉంది.[16] దాని రాజకీయ స్థిరత్వం, తక్కువ నేరాల శాతంతో ఇది యురేపియన్ యూనియన్లో అత్యంత ప్రశాంతమైన దేశంగా ప్రపంచంలోని 3 వ స్థానంలో ఉంది.[17] అదనంగా ఇది పదిహేను స్థిరమైన దేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.[18] ఒక ఏకీకృత సెమీ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్ను నిర్వహించడం. పి.ఐ.ఎస్.ఎ. అధ్యయనాల్లో భావవ్యక్తీకరణ అత్యంత సానుకూల పరిణామంతో దేశంలో పోర్చుగీసు, గణితం, విజ్ఞానం, పఠనంలో ఒ.ఇ.సి.డి. సగటు కంటే పోర్చుగల్ ర్యాంకులు అధికంగా ఉన్నాయి.[19] చారిత్రాత్మకంగా కాథలిక్-మెజారిటీ దేశం అయినప్పటికీ గత దశాబ్దాల్లో పోర్చుగల్ ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో నైతిక స్వేచ్ఛను కలిగి ఉన్న ఒక లౌకిక రాజ్యంగా రూపాంతరం చెందింది. జీవిత ఖైదు [20]ని రద్దు చేసిన మొట్టమొదటి దేశం, మరణశిక్షను రద్దు చేయడానికి మొట్టమొదటిది. గర్భస్రావం, స్వలింగ వివాహం, స్వీకరణ వంటి పధ్ధతులు, సింగిల్ స్త్రీల, లెస్బియన్ జంటలు [21], పవిత్రమైన (అద్దె గర్భం)సర్రోగెంసీ[22] చట్టబద్ధమైన హోదా కల్పించి వైద్యపరంగా సహాయపడింది చట్టబద్ధమైనవి. 2001 లో పోర్చుగల్ అనేది అన్ని చట్టవిరుద్ధ మందుల స్వాధీనం, వినియోగాన్ని నేరంగా పరిగణించబడని దేశాలలో ప్రపంచంలో మొట్టమొదటి దేశం, ఇది చికిత్స, హాని తగ్గింపుపై దృష్టి పెట్టింది. ముఖ్యమైన ప్రజా ఆరోగ్య ప్రయోజనాలను దృష్టి సారించింది.[23]