గులేబకావళి కథ
From Wikipedia, the free encyclopedia
గులేబకావళి కథ 1962 సంవత్సరంలో డి. యోగానంద్ దర్శకత్వంలో విడుదలైన జానపద తెలుగు సినిమా. ఇందులో రామారావు, జమున ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని నేషనల్ ఆర్ట్ థియేటర్స్ పతాకంపై నందమూరి త్రివిక్రమరావు నిర్మించాడు. సముద్రాల కథ, మాటలు అందించాడు. జోసెఫ్, విజయా కృష్ణమూర్తి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం ద్వారా సి. నారాయణ రెడ్డి సినీ గేయ రచయితగా తన ప్రస్థానం ప్రారంభించాడు. ఆయన రాసిన నన్ను దోచుకుందువటే అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది.[1]
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
గులేబకావళి కథ (1962 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | kamalakara kameswararao |
---|---|
నిర్మాణం | నందమూరి త్రివిక్రమరావు |
కథ | సముద్రాల |
తారాగణం | నందమూరి తారక రామారావు, జమున, నాగరత్నం, ఋష్యేంద్రమణి, పి.హేమలత, ఛాయాదేవి, బాలసరస్వతి, రాజనాల, మిక్కిలినేని, పద్మనాభం, నల్ల రామమూర్తి, లంక సత్యం, బాలకృష్ణ, పేకేటి శివరాం |
సంగీతం | జోసెఫ్ & విజయా కృష్ణమూర్తి |
నేపథ్య గానం | పి.సుశీల, ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.జి.కృష్ణవేణి, ఎస్.జానకి |
గీతరచన | సి.నారాయణరెడ్డి |
సంభాషణలు | సముద్రాల |
ఛాయాగ్రహణం | రవికాంత్ నగాయిచ్ |
నిర్మాణ సంస్థ | నేషనల్ ఆర్ట్ థియేటర్స్ |
విడుదల తేదీ | జనవరి 5, 1962 |
భాష | తెలుగు |
మూసివేయి