మాయాబజార్
1957 లో విడుదలైన తెలుగు సినిమా / From Wikipedia, the free encyclopedia
మాయాబజార్ తెలుగు చలనచిత్ర రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఒక సినిమా. సిఎన్ఎన్-న్యూస్18 టీవీ చానెల్ నిర్వహించిన సర్వేలో భారతీయ సినిమాల్లో సార్వకాలిక అత్యుత్తమమైన సినిమాగా మాయాబజార్ ఎంపికైన సినిమా. ఈ చిత్రం ఆంధ్ర దేశమంతటా 1957, మార్చి 27 వ తేదీన విడుదలై అద్భుత విజయం సాధించింది. 2017 మార్చి నాటికి 60 ఏండ్లు పూర్తిచేసుకొన్న ఈ సినిమాపై వివిధ టెలివిజన్ ప్రసార వాహినులు (ఛానళ్ళు), వార్తా పత్రికలు ప్రముఖంగా ప్రత్యేక వ్యాసాలు అందించాయి.
ఈ వ్యాసం 1957 లో విడుదలైన మాయాబజార్ సినిమా గురించి. ఇదే పేరుతో ఉన్న ఇతర సినిమాల కొరకు, మాయాబజార్ (అయోమయ నివృత్తి) చూడండి.
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
మాయాబజార్ (1957 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.వి.రెడ్డి |
---|---|
నిర్మాణం | నాగిరెడ్డి & చక్రపాణి |
రచన | పింగళి నాగేంద్రరావు |
తారాగణం | నందమూరి తారక రామారావు , అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వి.రంగారావు , సావిత్రి , గుమ్మడి వెంకటేశ్వరరావు, ఋష్యేంద్రమణి , ఛాయాదేవి , సంధ్య , సి.ఎస్.ఆర్ |
సంగీతం | ఘంటసాల వెంకటేశ్వరరావు, సాలూరు రాజేశ్వరరావు |
గీతరచన | పింగళి నాగేంద్రరావు |
విడుదల తేదీ | 27 మార్చి 1957 (1957-03-27) (తెలుగు విడుదల) 12 ఏప్రిల్ 1957 (1957-04-12) (తమిళం విడుదల) 30 జనవరి 2010 (2010-01-30) (రంగుల తెలుగు విడుదల) |
నిడివి | 181 నిమిషాలు |
భాష | తెలుగు |
పెట్టుబడి | ₹33 లక్షలు (సుమారు) |
వసూళ్లు | ₹80 లక్షలు (సుమారు) |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
మూసివేయి
షావుకారు, పాతాళభైరవి, మిస్సమ్మ, జగదేకవీరుని కథ, గుండమ్మ కథ లాంటి జనరంజక చిత్రాలను నిర్మించిన విజయా సంస్థ తెలుగు సినీ అభిమానులకందించిన మరొక అపురూప కళాఖండం ఇది. భక్త పోతన, యోగి వేమన, గుణసుందరి కథ, పాతాళ భైరవి, దొంగరాముడు మొదలగు చిత్రములను రూపొందించిన కె వి రెడ్డి ఈ చిత్రానికి కూడా దర్శకుడు.