గుండమ్మ కథ
1962 తెలుగు సినిమా / From Wikipedia, the free encyclopedia
గుండమ్మ కథ కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో 1962 లో విజయ వాహినీ సంస్థ నిర్మించిన చిత్రం ఇది. ఇందులో సూర్యకాంతం, ఎన్. టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్. వి. రంగారావు, సావిత్రి, జమున ప్రధాన పాత్రలు పోషించారు. చక్రపాణి, డి. వి. నరసరాజు ఈ చిత్రానికి రచయితలు. ఈ చిత్రంలో పాటలన్ని పింగళి రాయగా ఘంటసాల సంగీతాన్నందించాడు. 1958 లో కన్నడంలో విఠలాచార్య తీసిన మనె తుంబిద హెణ్ణు అనే చిత్రానికిది పునర్నిర్మాణం. కథలో షేక్స్పియర్ రాసిన ద టేమింగ్ ఆఫ్ ద ష్రూ అనే నాటకంలోని కొన్ని పాత్రల చిత్రణను వాడుకుంటూ, తెలుగు సాంప్రదాయం ప్రకారం కొన్ని మార్పులు చేశారు. అప్పటి దాకా పౌరాణిక చిత్రాలకే దర్శకత్వం వహించిన కామేశ్వరరావు ఈ సినిమాతో మొదటిసారిగా సాంఘిక చిత్రాన్ని తీశాడు. అప్పటిలో ఇది అగ్రశ్రేణి నటులతో నిర్మించిన మల్టీ స్టారర్, కాని "గుండమ్మ కథ" అని సూర్యకాంతం పాత్ర పేరుమీద సినిమా పేరు పెట్టడమే గొప్ప వైవిధ్యం అని విశ్లేషకులు ప్రస్తావిస్తారు. హాస్యం, సంగీతం ఈ చిత్రానికి విజయాన్ని సమకూర్చాయి.
గుండమ్మ కథ | |
---|---|
దర్శకత్వం | కమలాకర కామేశ్వరరావు |
రచన | చక్రపాణి (స్క్రీన్ ప్లే), డి.వి.నరసరాజు (మాటలు), పింగళి నాగేంద్రరావు (పాటలు) |
నిర్మాత | బి.నాగిరెడ్డి , చక్రపాణి |
తారాగణం | నందమూరి తారక రామారావు , అక్కినేని నాగేశ్వరరావు , సావిత్రి, జమున , ఎస్.వి.రంగారావు , సూర్యకాంతం |
ఛాయాగ్రహణం | మార్కస్ బార్ట్లీ |
సంగీతం | ఘంటసాల |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | జూన్ 7, 1962 (1962-06-07)[1] |
సినిమా నిడివి | 166 ని |
భాష | తెలుగు |