![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/57/India_United_States_Locator.svg/langte-640px-India_United_States_Locator.svg.png&w=640&q=50)
భారత అమెరికా సంబంధాలు
From Wikipedia, the free encyclopedia
భారత అమెరికా సంబంధాలు భారతదేశం, అమెరికా మధ్య అంతర్జాతీయ సంబంధాలను సూచిస్తుంది. స్వాతంత్ర్యానంతరం అధికారికంగా మొదలైన భారత అమెరికా సంబంధాల్లో అనేక మార్పుచేర్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. రిచర్డ్ నిక్సన్, ఇందిరా గాంధీల కాలంలో అత్యంత క్షీణ దశను, జార్జి డబ్ల్యూ బుష్, మన్మోహన్ సింగ్ ల కాలంలో ఎంతో స్నేహపూర్వక దశను చవి చూసాయి. కేవల ద్వైపాక్షిక విషయాలకే పరిమితంగా ఉండే ఈ సంబంధాలు, ద్వైపాక్షిక చర్చల్లో వివిధ అంతర్జాతీయ అంశాలను చర్చించే స్థాయికి ఎదిగాయి.[2]
![]() | |
![]() భారతదేశం |
![]() యు.ఎస్.ఏ |
---|---|
దౌత్య కార్యాలయం | |
భారత రాయబార కార్యాలయం, వాషింగ్టన్ డిసి | అమెరికా రాయబార కార్యాలయం, న్యూ ఢిల్లీ |
రాయబారి | |
భారత రాయబారి తరణ్జిత్ సింగ్ సంధు[1] | అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ |
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/09/-G7Biarritz_%2848632275313%29.jpg/640px--G7Biarritz_%2848632275313%29.jpg)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/cd/Secretary_Pompeo_Delivers_Closing_Remarks_at_the_India_2%2B2_Dialogue_%2843603751185%29_%28cropped%29.jpg/640px-Secretary_Pompeo_Delivers_Closing_Remarks_at_the_India_2%2B2_Dialogue_%2843603751185%29_%28cropped%29.jpg)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/88/US_Embassy_New_Delhi.jpg/640px-US_Embassy_New_Delhi.jpg)
భారత స్వాతంత్ర్య ఉద్యమంలోని ప్రముఖ నాయకులకు అమెరికాతో స్నేహపూర్వక సంబంధాలు ఉండేవి. 1947లో యునైటెడ్ కింగ్డమ్ నుండి స్వాతంత్ర్యం పొందిన తరువాత కూడా ఇవి కొనసాగాయి. 1954లో, అమెరికా పాకిస్తాన్ను సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్ (సెంటో) ఒప్పందంలో మిత్రదేశంగా చేర్చుకుంది. పాకిస్తాన్-అమెరికా సంబంధాలను ఎదుర్కోవటానికి భారతదేశం, సోవియట్ యూనియన్తో వ్యూహాత్మక సైనిక సంబంధాలను పెంపొందించుకుంది.[3] అమెరికా సోవియట్ యూనియన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధంలో ఏ శిబిరంలోనూ చేరకుండా ఉండటానికి 1961లో, భారతదేశం అలీనోద్యమంలో వ్యవస్థాపక సభ్యుడయింది. 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో నిక్సన్ ప్రభుత్వం పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడంతో, భారత అమెరికా సంబంధాలు క్షీణించాయి. 1991లో సోవియట్ యూనియన్ రద్దు అయ్యే వరకు ప్రతికూలంగానే ఉంటూ వచ్చాయి. 1990లలో, భారత్ తన విదేశాంగ విధానాన్ని ఏకథ్రువ ప్రపంచానికి అనుగుణంగా మలచుకుని అమెరికాతో సన్నిహిత సంబంధాలను పెంచుకుంది.
ఇరవై ఒకటవ శతాబ్దంలో, భారతదేశం తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని వినియోగించుకుని తన సార్వభౌమ హక్కులను పరిరక్షించుకోడానికీ, బహుళ ధ్రువ ప్రపంచంలో జాతీయ ప్రయోజనాలను పెంపొందించుకోడానికీ ప్రయత్నించింది.[4][5][6] అధ్యక్షులు జార్జ్ డబ్ల్యు. బుష్, బరాక్ ఒబామా పరిపాలనలో, అమెరికా భారతదేశం ప్రధాన జాతీయ ప్రయోజనాలనూ అపరిష్కృతంగా ఉన్న సమస్యలనూ గుర్తించింది.[7]
ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల పెరుగుదల, ప్రపంచ భద్రతా విషయాలపై సహకారం, గ్లోబల్ గవర్నెన్స్ (ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి) విషయాలపై నిర్ణయం తీసుకోవడంలో భారతదేశాన్ని చేర్చడం, వాణిజ్య, పెట్టుబడి వేదికలలో (ప్రపంచ బ్యాంక్, IMF, APEC) ప్రాతినిధ్య స్థాయిని పెంచడం, ఎగుమతి నియంత్రణ విషయాల్లోకి (MTCR, వాస్సేనార్ అరేంజ్మెంట్, ఆస్ట్రేలియా గ్రూప్) ప్రవేశం, అణు సరఫరాదారుల సమూహంలో ప్రవేశానికి మద్దతు, సాంకేతిక భాగస్వామ్యంతో ఉమ్మడి-తయారీ కార్యక్రమం అభివృద్ధి మొదలైనవి భారత అమెరికా సంబంధాల్లో కీలకమైన మైలురాళ్ళుగా మారాయి.[8][9] 2016లో, లాజిస్టిక్స్ ఎక్స్ఛేంజ్ మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ పై రెండు దేశాలు[10][11][12] సంతకం చేశాయి. భారతదేశాన్ని అమెరికా ప్రధాన రక్షణ భాగస్వామిగా ప్రకటించారు.[13]
ప్రకారం గాలప్ వార్షిక ప్రపంచ వ్యవహారాల సర్వే, భారతదేశం గ్రహించిన అమెరికన్లు ప్రపంచంలో తమకు ఇష్టమైన దేశాల్లో ఆరవ దేశంగా భారతదేశాన్ని భావించారు. భారత్కు అనుకూలంగా 2015లో 71% [14] 2017లో 74%, 2019లో 72% [15] మంది అమెరికన్లు భారతదేశం పట్ల అనుకూల అభిప్రాయంతో ఉన్నారు.[16]
2017వ సంవత్సరంలో, ద్వైపాక్షిక వాణిజ్యం (వస్తువులు, సేవలు రెండింటిలోనూ) 9.8% పెరిగి US $126.1 బిలియన్లకు చేరుకుంది. అమెరికాకు భారతదేశ ఎగుమతులు $76.7 బిలియన్ డాలర్లు కాగా, యుఎస్ఎ భారతదేశానికి ఎగుమతులు 49.4 బిలియన్ డాలర్లు [17][18]