కాకతీయులు
12-14వ శతాబ్దపు భారతియ సామ్రాజ్యం / From Wikipedia, the free encyclopedia
కాకతీయులు క్రీ. శ. 750 నుండి క్రీ. శ. 1323[2] వరకు నేటి తెలంగాణను, ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించిన రాజవంశము.[3] క్రీ. శ. 8వ శతాబ్దము ప్రాంతములో రాష్ట్రకూటుల సేనానులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కాకతీయులు ఘనమైన పరిపాలనను అందించారు.[4] శాతవాహనుల అనంతరం తెలుగు జాతిని సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిపత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే.[5]
త్వరిత వాస్తవాలు కాకతీయ సామ్రాజ్యం, స్థాయి ...
కాకతీయ సామ్రాజ్యం | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
750–1323 | |||||||||||||||
స్థాయి | సామ్రాజ్యం | ||||||||||||||
రాజధాని | ఓరుగల్లు (వరంగల్లు) | ||||||||||||||
సామాన్య భాషలు | తెలుగు | ||||||||||||||
మతం | హిందూ మతం (జైన మతం నుండి రూపాంతరం చెందింది.)[1] | ||||||||||||||
ప్రభుత్వం | రాజరికము | ||||||||||||||
చక్రవర్తి | |||||||||||||||
చరిత్ర | |||||||||||||||
• స్థాపన | 750 | ||||||||||||||
• పతనం | 1323 | ||||||||||||||
|
మూసివేయి
మరింత సమాచారం కాకతీయ సామ్రాజ్యం, ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఒక భాగం ...
| |||||||||||||||||||||||||||||||||||||||
‡ రాణి
|
మూసివేయి
కాకతీయులు దుర్జయ వంశస్థులుగా కొందరు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.[6] ప్రస్తుత తెలంగాణ అనే పదం కాకతీయుల కాలంలో త్రిలింగ అని, దేశపరంగా, జాతిపరంగా ప్రచారం పొందింది[ఆధారం చూపాలి].[7]
వీరి రాజధాని ఓరుగల్లు (నేటి వరంగల్లు).