ముప్పవరపు వెంకయ్య నాయుడు
భారత ఉప రాష్ట్రపతి / From Wikipedia, the free encyclopedia
ముప్పవరపు వెంకయ్య నాయుడు (జననం 1 జూలై 1949) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2017 నుండి 2022 వరకు భారతదేశానికి 13వ ఉపరాష్ట్రపతిగా పని చేశాడు. వెంకయ్య నాయుడు మోడీ మంత్రివర్గంలో కేంద్ర హౌసింగ్ & పట్టణ పేదరిక నిర్మూలన, పట్టణాభివృద్ధి & సమాచార, ప్రసార మంత్రిగా పని చేశాడు.[1][2][3]
త్వరిత వాస్తవాలు ప్రధాన మంత్రి, ముందు ...
ముప్పవరపు వెంకయ్య నాయుడు | |||
భారతదేశ 13వ ఉపరాష్ట్రపతి | |||
పదవీ కాలం 11 ఆగస్టు 2017 – 11 ఆగస్టు2022 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
---|---|---|---|
ముందు | ముహమ్మద్ హమీద్ అన్సారి | ||
తరువాత | జగదీప్ ధన్కర్ | ||
మాజీ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు , పట్టణాభివృద్ధి మంత్రి | |||
పదవీ కాలం 26 మే 2014 – 17 జులై 2017 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
ముందు | కమల్ నాథ్ | ||
పట్టణ పేదరిక నిర్మూలన శాఖా మంత్రి | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 26 మే 2014 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
ముందు | గిరిజా వ్యాస్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1948-06-23) 1948 జూన్ 23 (వయసు 76) చవటపాలెం , నెల్లూVరు, మద్రాసు రాష్ట్రము (ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్), భారతదేశం | ||
జీవిత భాగస్వామి | ఉష | ||
సంతానం | హర్షవర్ధన్, దీపా వెంకట్ | ||
నివాసం | ఢిల్లీ | ||
పూర్వ విద్యార్థి | ఆంధ్ర విశ్వవిద్యాలయం | ||
మతం | హిందూ |
మూసివేయి
వెంకయ్య నాయుడు 2002 నుండి 2004 వరకు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పని చేశారు.[4] ఆయన అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధికి కేంద్ర మంత్రిగా పని చేశారు.[5][6] వెంకయ్య నాయుడును 2024లో భారత ప్రభుత్వం రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ తో ఆయనను గౌరవించింది.[7][8]