ధన్బాద్
From Wikipedia, the free encyclopedia
ధన్బాద్, జార్ఖండ్ రాష్ట్రం, ధన్బాద్ జిల్లా లోని నగరం, ఈ జిల్లా ముఖ్యపట్టణం. జంషెడ్పూర్ తరువాత, రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన నగరం ధన్బాద్. ఇది భారతదేశంలో 42 వ అతిపెద్ద నగరం. 10లక్షలకు పైగా జనాభా గల పట్టణ సముదాయాల్లో భారతదేశంలో 34 వ స్థానంలో ఉంది. ఇది ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో 96 వ స్థానంలో ఉన్నట్లు సిటీ మేయర్స్ ఫౌండేషన్ గుర్తించింది. [4] పశ్చిమ బెంగాల్ లోని పశ్చిమ బర్ధమాన్ జిల్లా ధన్బాద్ జిల్లాకు సరిహద్దుగా ఉంది.
ధన్బాద్ | |
---|---|
Coordinates: 23.7998°N 86.4305°E / 23.7998; 86.4305 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జార్ఖండ్ |
జిల్లా | ధన్బాద్ |
విస్తీర్ణం | |
• నగరం | 275 కి.మీ2 (106 చ. మై) |
• Metro | 577 కి.మీ2 (223 చ. మై) |
Elevation | 222 మీ (728 అ.) |
జనాభా | |
• నగరం | 11,62,472 |
• Rank | 33వ |
• జనసాంద్రత | 4,200/కి.మీ2 (11,000/చ. మై.) |
• Metro | 13,33,719 |
• Metro rank | 42nd |
భాషలు | |
• అధికారిక | హిందీ, బెంగాలీ, ఖోర్తా, ఉర్దూ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 826001 |
Telephone Code | 0326 |
Vehicle registration | JH-10 |
భారతదేశంలోని అతిపెద్ద బొగ్గు గనులకు కేంద్రంగా ఉన్న ఈ నగరాన్ని 'కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా' అని పిలుస్తారు. [5] ప్రతిష్టాత్మకమైన ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ఇప్పుడు ఐఐటి ధన్బాద్ ) సంస్థ ధన్బాద్ లోనే ఉంది. [6] బొగ్గుతో పాటు, ఇది సమాచార సాంకేతికత రంగంలో కూడా ఎదిగింది.
2019 స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ప్రకారం ధన్బాద్ భారతదేశంలో 56 వ పరిశుభ్రమైన నగరం. [7] 2018 స్వచ్ఛ సర్వేక్షణ్లో అత్యంత మురికి నగరంగా పరిగణించబడిన ఈ నగరం ఒక్క ఏడాదిలో గొప్ప పరివర్తనను చూపించింది. [8] ధన్బాద్ మునిసిపల్ కార్పొరేషన్ నగరంలో పచ్చదనాన్ని పెంచడానికి పనిచేస్తోంది. [9] భారతీయ రైల్వేలోని రైల్వే డివిజన్లలో, ధన్బాద్ రైల్ డివిజన్ ముంబై డివిజన్ తర్వాత వార్షికాదాయంలో రెండవ స్థానంలో ఉంది. [10] ఓపెన్సిగ్నల్ సంస్థ చేసిన సర్వేలో భారతదేశంలో అత్యధికంగా 4G మొబైల్ ఫోన్ నెట్వర్క్ లభ్యతతో ధన్బాద్, భారతదేశంలో అగ్ర నగరంగా నిలిచింది. [11]
ప్రస్తుత జిల్లా మంభుమ్ ప్రాంతంలో భాగంగా ఉండేది. సా.శ. ఏడవ శతాబ్దం లో హ్యూయన్ త్సాంగ్ రాసిన యాత్రా చరిత్రలో దీని ప్రస్తావన ఉంది. ఇది శశాంక పాలనలో ఉంది. [12] బ్రిటిష్ పాలనలో తూర్పుభారతంలోని జిల్లాలలో మన్భుమ్ ఒకటి.
మన్భూమ్ సెటిల్మెంట్ రిపోర్టులో (1928) సర్వే సెటిల్మెంట్ కార్యకలాపాల సమయంలో రాతి శాసనాలు, రాగి పలకలు లేదా పాత నాణేలు కనబడలేదని, రాగి రేకులుగానీ, తాళపత్రాలు గానీ ఒక్కటి కూడా కనబడలేదనీ పేర్కొనబడింది. పురాతన ప్రామాణికమైన పత్రాలు అన్నీ కూడా కాగితంపై ఉన్నవే. అన్నీ కేవలం వంద సంవత్సరాల లోపు వయస్సు కలిగినవే. [13] ధన్బాద్ నగరం 1928 నుండి 1956 వరకు మన్భూమ్ జిల్లాలో ఉంది. [13] అయితే, 1956 అక్టోబర్ 24 న, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ సిఫార్సు నోటిఫికేషన్ 1911 ప్రకారం ధన్బాద్ జిల్లా ఏర్పడింది. [14]
జర్నలిస్ట్ సతీష్ చంద్ర నాయకత్వంలో ఇది జరిగింది. 2006 సంవత్సరంలో, ధన్బాద్ స్వతంత్ర జిల్లాగా, ధన్బాద్ దాని ముఖ్యపట్టణంగా 50 సంవత్సరాల వేడుక జరుపుకుంది. 1956 నుండి 2000 నవంబర్ 14 న జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడే వరకు, ఇది బీహార్ రాష్ట్రంలో ఉంది. [15] ఈ ప్రాంతంలో బొగ్గు యొక్క గొప్ప నిక్షేపాల వలన నగరం ఆర్థికంగా అభివృద్ధి చెందింది,[16]