తెలుగు సాహిత్యం - శ్రీనాధ యుగం
From Wikipedia, the free encyclopedia
తెలుగు సాహిత్యంలో 1400 నుండి 1500 వరకు శ్రీనాథ యుగము అంటారు. ఈ యుగాన్ని తెలుగు సాహిత్యంలో ఒక సంధి యుగంగా భావింపవచ్చును. ఈ కాలంలో పురాణ కవుల కావ్యానువాద విధానం కొనసాగింది. తరువాత వచ్చిన ప్రబంధ యుగానికి నేపథ్యంగా నిలిచింది. కొంత వాఙ్మయము అనువాదాలుగానూ, కొంత స్వతంత్ర కావ్యాలుగాను, కొంత నానావిధ వైచిత్ర్యంతోను ఆవిర్భవించింది. పురాణ కావ్యాలలో ప్రబంధ రీతులు గోచరమయ్యాయి. రచనలలో అక్షర రమ్యత, అర్ధగౌరవమూ కూడా భాసించాయి. లోకంలో ఉబుసుపోకకు చెప్పుకొనే కథలవంటివి కావ్యరూపం దాల్చాయి.[1]
తెలుగు సాహిత్యం దేశభాషలందు తెలుగు లెస్స | |
---|---|
తెలుగు సాహిత్యం యుగ విభజన | |
నన్నయకు ముందు | సా.శ. 1000 వరకు |
నన్నయ యుగం | 1000 - 1100 |
శివకవి యుగం | 1100 - 1225 |
తిక్కన యుగం | 1225 - 1320 |
ఎఱ్ఱన యుగం | 1320 – 1400 |
శ్రీనాధ యుగం | 1400 - 1500 |
రాయల యుగం | 1500 - 1600 |
దాక్షిణాత్య యుగం | 1600 - 1775 |
క్షీణ యుగం | 1775 - 1875 |
ఆధునిక యుగం | 1875 – 2000 |
21వ శతాబ్ది | 2000 తరువాత |
తెలుగు భాష తెలుగు లిపి ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా తెలుగు సాహితీకారుల జాబితాలు | |