From Wikipedia, the free encyclopedia
తెలుగు సాహిత్యాన్ని అధ్యయనా సౌలభ్యం కోసం కొన్ని యుగాలుగా విభజిస్తారు. ఈ విభజన వివిధ పరిశోధకులు వివిధ ప్రమాణాలతో చేశారు. ఆయా కాలాలలో ఉన్న కవుల పేర్ల మీద గాని, లేదా పాలనాధికారుల పేర్లమీద గాని, లేదా కాలానుగుణంగా గాని ఈ యుగాలకు పేర్లు పెట్టారు.
తెలుగు సాహిత్యం దేశభాషలందు తెలుగు లెస్స | |
---|---|
తెలుగు సాహిత్యం యుగ విభజన | |
నన్నయకు ముందు | సా.శ. 1000 వరకు |
నన్నయ యుగం | 1000 - 1100 |
శివకవి యుగం | 1100 - 1225 |
తిక్కన యుగం | 1225 - 1320 |
ఎఱ్ఱన యుగం | 1320 – 1400 |
శ్రీనాధ యుగం | 1400 - 1500 |
రాయల యుగం | 1500 - 1600 |
దాక్షిణాత్య యుగం | 1600 - 1775 |
క్షీణ యుగం | 1775 - 1875 |
ఆధునిక యుగం | 1875 – 2000 |
21వ శతాబ్ది | 2000 తరువాత |
తెలుగు భాష తెలుగు లిపి ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా తెలుగు సాహితీకారుల జాబితాలు | |
యుగ విభజన అనేది అధ్యయనంలో ఒక కొండగుర్తుగా ఉపయోగపడుతుంది. కొన్ని విశిష్టమైన, సమానమైన ధర్మాలు గల కాలాన్ని ఒక "యుగం" అని వ్యవహరిస్తారు.[1] అంటే ఒక కాలంలోని సాహిత్యంలో సమానమైన, లేదా విలక్షణమైన అంశాలను ఆ యుగం పేరుతో గుర్తిస్తారు. యుగ విభజన ఎలా చేసినా గాని అది సమగ్రం, నిర్దుష్టం అని చెప్పలేము. అందేదో ఒక విధముగా అతి వ్యాప్తి, అవ్యాప్తి దోషములు కనిపిస్తూనే ఉంటాయి. ఒకే విధమైన కావ్యములు వివిధ కాలాలలో వెలువడవచ్చును. ఒకే కాలంలో బహువిధాలైన రచనలు కూడా రావచ్చును. ఒక కాలంలో పెక్కురు ఉద్ధండులైన పండితులుండవచ్చును. వాఙ్మయకారులు తమ అభిరుచిని బట్టి సౌకర్యం కోసం ఎలాగైనా యుగ విభజన చేయవచ్చును.[2] వాఙ్మయంలో అంతర ప్రవృత్తి, బాహ్య ప్రవృత్తి అనే రెండు అంశాలున్నాయి. ఇవి కాలాన్నిబట్టి మారడం మనం గ్రహించవచ్చును. అందుకు బయటి భాషా, జాతుల సంపర్కం ఒక కారణం. సమాజాంతర్గతమైన మార్పులు మరొక కారణం. సాహితీ ప్రక్రియలలో అంతకు ముందు కాలంనుండి ఒక ముఖ్యమైన మార్పు సంభవించిన "హద్దు"ను యుగం మారందని చెప్పే సమయంగా భావించవచ్చును. సాహిత్య చరిత్రను అధ్యయనం చేసేటప్పుడు సాహితీమూర్తులనే యుగకర్తలుగా గుర్తించడం భావ్యం అని పింగళి లక్ష్మీకాంతం అభిప్రాయం.Gudipati Suresh
రచనా సౌలభ్యం కోసం సాహితీ చరిత్రాధ్యయనకారులు వాఙ్మయ చరిత్రను కొన్ని యుగములుగా విభజిస్తారు.
పింగళి లక్ష్మీకాంతం తన "ఆంధ్ర సాహిత్య చరిత్ర"లో "యుగకర్త"లైన మహాకవులను ఆయా యుగాలను గుర్తించే దీపస్తంభాలుగా పరిగణించాడు. ఈ విధానాన్ని చాలామంది అంగీకరించారు.[1]
తెలుగు వికీపీడియాలో వ్యాసాల విభజన, వర్గీకరణ, మూసలకు ఈ విభజననే పాటించడం జరుగుతున్నది.
తన విభజన విధానాన్ని వివరిస్తూ పింగళి లక్ష్మీకాంతం ఇలా చెప్పాడు - "యుగ విభాగము సహేతుకముగా (రేషనల్ గా) ఉండవలెను. కాని నిర్హేతుకముగా వుండ చనదు. ఎవరి చిత్తము వచ్చినట్లు వారు (యథేచ్ఛగా) చేయరాదు . ఆయుగకర్తల పేరు మీదుగా వాఙ్మయ చరిత్రను విభాగము చేయుట సమంజసమైన పద్ధతి. .. సాహిత్య చక్రవర్తులగు కవి సార్వభౌములకు మారుగా వారికాశ్రయమునిచ్చిన ధారుణీశ్వరులను సారస్వత సింహపీఠిక నుంచుట అన్యాయము. ఏ యగమునందైనను ఒక రాజు ప్రశస్తమైన కవి కూడనైనచో ఆ యుగమతని పేరుమీద నుంచదగును. అదియు నాతని కవిగా నెంచియే.. .. ఆ రాజులు పోయిరి. ఆ వంశములును ఏనాడో అస్తమించిపోయినవి. ఇక కవిరాజులు వారి గ్రంథ రూపములలో సజీవులైయున్నారు. వీరిని త్రోసిపుచ్చి గతించినవారికై అన్వేషణ జరుపుట భావ్యము కాదు. వారి రాజ్యముల కంటెను వీరి (సాహితీ) రాజ్యములు స్థిరములు, అజరామరములు. .. ఆంధ్ర కావ్య పథమును తీర్చి దిద్దిన మహాకవి నన్నయ పేరుమీద ఈ యుగ విభజన ఆరంభమగుచున్నది" [3]
సాహిత్యాభివృద్ధికి పోషకులు కూడా ముఖ్య కారణం గనుక ఈ విభజన చేయబడింది. ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యంలో ఈ పద్ధతి వాడాడు.
ఒక్కో యుగంలో వెలువడిన రచనా రీతులను అనుసరించి ఈ విభజన చేయబడింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.