కొల్లూరు మూకాంబిక దేవాలయం
కర్ణాటక రాష్ట్రం, తుళునాడు ప్రాంతం, ఉడిపి జిల్లా, బైందూరు తాలూకాలోని కొల్లూరులో ఉన్న దేవాలయం / From Wikipedia, the free encyclopedia
కొల్లూరు మూకాంబిక దేవాలయం అనేది కర్ణాటక రాష్ట్రం, తుళునాడు ప్రాంతం, ఉడిపి జిల్లా, బైందూరు తాలూకాలోని కొల్లూరులో ఉన్న దేవాలయం. మూకాంబికా దేవి అని పిలువబడే మాతృదేవతకు అంకితం చేయబడిన హిందూ దేవాలయమిది. సౌపర్ణికా నది దక్షిణ ఒడ్డున, కొడచాద్రి కొండల దిగువన ఉన్న ఈ దేవాలయ లింగం ఎడమ వైపున "మహా కాళి, మహా లక్ష్మి, మహా సరస్వతి" కలిసి ఉన్నందున మూకాంబిక ఆదిపర శక్తి, పరబ్రహ్మల కలయికగా చెప్పబడుతోంది.[1][2][3][4][5] గోకర్ణం, కన్యాకుమారి మధ్య ఉన్న భూభాగంలో ఉన్న ఈ దేవాలయాన్ని పరశురాముడు సృష్టించాడని భక్తుల నమ్మకం. దేవాలయంలో స్వయంభూగా వెలిసిన జ్యోతిర్లింగం ప్రధాన దేవతగా ఉంది. లింగం సగానికి కత్తిరించే బంగారు గీతతో ఉంటుంది, దీనిలో ఎడమ సగం త్రిదేవిని, కుడి సగం త్రిమూర్తులను సూచిస్తుంటుంది. దీనితో పాటు, మూకాంబిక దేవి నాలుగు చేతుల పంచలోహ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు.
కొల్లూరు మూకాంబిక దేవాలయం | |
---|---|
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 13.8638°N 74.8145°E / 13.8638; 74.8145 |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | ఉడిపి |
స్థలం | కొల్లూరు |
సంస్కృతి | |
దైవం | మహాకాళి, లక్ష్మి, సరస్వతి |
ముఖ్యమైన పర్వాలు | రథోత్సవం, విజయదశమి |
వాస్తుశైలి | |
నిర్మాణ శైలులు | కేరళ శైలీ |
చరిత్ర, నిర్వహణ | |
నిర్మించిన తేదీ | ~800 సిఈ |
సృష్టికర్త | రాజు హలుగల్లు వీర సంగయ్య |
దేవాలయంలో గణపతి, శివుడు, విష్ణువు, హనుమంతుడు, సుబ్రహ్మణ్యుడు, వీరభద్రుడు, నాగదేవతలకు ఉప మందిరాలు కూడా ఉన్నాయి. ఫాల్గుణ మాసంలో జరిగే రథోత్సవాలు, ఆశ్వీజ మాసంలో జరిగే నవరాత్రులు ఈ దేవాలయంలో ప్రధాన పండుగలు. మూకాసురుడు అనే రాక్షసుడిని చంపిన తర్వాత శక్తి దేవికి మూకాంబిక దేవి అని పేరు పెట్టబడింది. ఈ దేవాలయం కర్ణాటకలో ఉన్నప్పటికీ, పొరుగు రాష్ట్రమైన కేరళ నుంచి ఇక్కడికి ఎక్కువమంది భక్తులు వస్తుంటారు. మతం, కులంతో సంబంధం లేకుండా మలయాళీలు సందర్శించే అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఇది కూడా ఒకటి.