కేంద్రపాలిత ప్రాంతం
భారతదేశ కేంద్రపాలిత ప్రాంతం / From Wikipedia, the free encyclopedia
కేంద్రపాలిత ప్రాంతం అనగా భారతదేశం లోని పరిపాలన ప్రాంతాలలో ఒక ప్రధాన విభాగం. రాష్ట్రాలకు స్వంత ప్రభుత్వాలుండగా, కేంద్రపాలిత ప్రాంతాలు నిండుగా లేకుంటే, పాక్షికంగా భారత ప్రభుత్వంచే పరిపాలించబడుచున్నాయి. [1] [2][3] భారతదేశంలో ప్రస్తుతం ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. (అండమాన్ నికోబార్ దీవులు, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, ఢిల్లీ (ఎన్.సి.టి) జమ్మూ కాశ్మీర్, లడఖ్, లక్షద్వీప్, పుదుచ్చేరి.)
కేంద్రపాలిత ప్రాంతాలు | |
---|---|
రకం | సమాఖ్య |
స్థానం | భారతదేశం |
సంఖ్య | 8 |
జనాభా వ్యాప్తి | లక్షదీవులు - 64,473 (అత్యల్పం); ఢిల్లీ - 31,181,376 (అత్యధికం) |
విస్తీర్ణాల వ్యాప్తి | 32 కి.మీ2 (12 చ. మై.) లక్షదీవులు – 59,146 కి.మీ2 (22,836 చ. మై.) లడఖ్ |
ప్రభుత్వం | భారత ప్రభుత్వం |
చరిత్ర, సాంస్కృతిక వారసత్వం గల కొన్ని ప్రాంతాలను, భౌగోళికంగా ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న ప్రదేశాలను, అంతర్ రాష్ట్ర వివాదాల వలన కేంద్ర ప్రభుత్వంచే పాలించాల్సివచ్చిన ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పరిచారు.
కేంద్రప్రభుత్వం ప్రతి కేంద్రపాలిత ప్రాంతంలో ఒక లెఫ్టినెంట్ గవర్నర్ను నియమిస్తుంది. ఆ అధికారి ప్రాంతీయ ప్రభుత్వానికి అధినేత. కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలలో శాసనసభలు ఉన్నాయి. అటువంటి ప్రాంతాలలో ముఖ్య మంత్రి పదవి కూడా వుంటుంది.