ఏకవింశతి పత్రపూజ అనేది ఏకవింశతి అనగా 21 విధముల పత్రములతో చేయు పూజ.
వినాయక వ్రతకల్పము లో ఈ పూజ ప్రధానమైనది. ఈ పత్రాలన్నింటిలో అనేక ఔషధగుణాలు కలిగివుంటాయి. ఆయా కాలాలలో వచ్చే రోగాలను కాలానుగుణంగా నయం చేయడం ఈ పత్రాల ప్రత్యేకత. గణనాథుని పూజించే నెపంతో మన పూర్వికులు 21 రకాల పత్రాలలోని ఔషధ గుణాలను మనకు సూచించారు.
మాచీపత్రం: దీన్ని దవనం అని కూడా అంటారు. ఇది కుష్ఠు సంబంధ వ్యాధులను, బొల్లివంటి చర్మవ్యాధులను, నరాల సంబంధవ్యాధులను తగ్గిస్తుంది. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. ఈ పత్రాలున్న పరిసరాల్లో ఎటువంటి సూక్ష్మక్రిములు దరిచేరవు.
బృహతీపత్రం: దీని వాకుడాకు అంటారు. ఇది ఆయాసాన్ని, దగ్గును, మలబద్దకము, అతివిరేచనాలను తగ్గిస్తుంది. బాలింతలకు ఈచెట్టు ఒక వరం. ఇది అనేక దివ్యౌషధాల తయారీకి ఉపయోగపడుతుంది.
బిల్వపత్రం: దీన్ని మారేడు అంటారు. ఇది నీటిని శుద్ధి చేస్తుంది. కీళ్ల సంబంధవ్యాధులను, విరేచనాలను తగ్గిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను వృద్ధిచేస్తుంది. శరీర దుర్వాసనను తగ్గిస్తుంది. అనేక ఔషధాల తయారీలో ఉపయోగపడుతుంది. సూక్ష్మక్రిమి సంహారిణిగా బాగా ఉపయోగపడుతుంది.
దూర్వారయుగ్మం: దీన్ని గరిక అంటారు. ఇది దేహంలో రక్తాన్ని శుద్ధిచేస్తుంది. అధికరక్తస్రావాన్ని, రక్తహీనతను తగ్గిస్తుంది. శరీరంలోని హానికర సూక్ష్మక్రిములను నశింపజేస్తుంది. అజీర్ణవ్యాధిని, అధిక ఆమ్లస్రావాన్ని తగ్గిస్తుంది. సకలచర్మరోగాలను, సోరియాసిస్ లాంటి వ్యాధులను తగ్గిస్తుంది. దుస్స్వప్నాలను నివారిస్తుంది.
దత్తుర పత్రం (ఉమ్మెత్త):- ఊపిరితిత్తులను వ్యాకోచింప చేసి ఉబ్బసం తగ్గేలా చేస్తుంది.
బదరి పత్రం (రేగు ఆకు):- చర్మ వ్యాధులకు మంచి విరుగుడు.
అపామార్గ పత్రం (ఉత్తరేణి): -దగ్గు, ఉబ్బసంకి బాగా పనిచేస్తుంది.
తుర్యా పత్రం (తులసి):-శరీరంలో ఉష్ణాన్ని నియంత్రిస్తుంది. అందుకే ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉండాలి. ఆ గాలికి జలుబు, దగ్గు వంటివి దరి చేరవు.
చూత పత్రం (మామిడి ఆకు):-నోటి దుర్వాసన, చిగుళ్ళ వాపు వంటి సమస్యల నుంచి ఉపసమనం ఇస్తుంది.
కరవీర పత్రం (గన్నేరు ఆకు):-గడ్డలు, పుండ్లు తగ్గటానికి దీని వేరు, బెరడు వాడతారు
విష్ణు క్రాంతం (పొద్దు తిరుగుడు ఆకు):-దీనిపై జరిగిన ఎన్నో పరిశోధనలు చెబుతున్న దేమిటంటే ఇది మంచి స్కిన్ కేర్ మందుగా పనిచేస్తుంది.
దాడిమ పత్రం (దానిమ్మ ఆకు):- వాంతులు, విరేచనాలు, అరికడుతుంది.శరీరంలో ఉన్నా హానికారక క్రిములను నాశనం చేస్తుంది.