భారతదేశ రాష్ట్రాల శాసన వ్యవస్థ సభలలోని ఎగువసభ From Wikipedia, the free encyclopedia
భారతదేశ రాష్ట్రాల శాసన వ్యవస్థలోని సభలలో ఎగువ సభను శాసనమండలి (విధాన పరిషత్) అంటారు.అధికరణ 169 ప్రకారం రాష్ట్రంలలో శాసనమండలి ఏర్పాటు చేయవచ్చు, రద్దు చేయవచ్చు. శాసనమండలి కావాలి అని కోరుకుంటున్న రాష్ట్రంలోని శాసనసభలో 2/3 మెజారిటీతో ఆమోదించాలి. రాజ్యాంగంలోని 171 అధికరణం ద్వారా ఈ విధాన సభను ప్రారంభించవచ్చు. ప్రస్తుత భారతదేశం లోని 28 రాష్ట్రాలలో కేవలం 6 రాష్ట్రాలలో మాత్రమే శాసనమండలి ఉంది.[1] అవి ఉత్తరప్రదేశ్ (100), బీహార్ (75), కర్ణాటక (75), మహారాష్ట్ర (78), ఆంధ్రప్రదేశ్ (58), తెలంగాణ (40). రెండు సభలు కలిగిన రాష్ట్రాల శాసన వ్యవస్థలో ఇది ఎగువ సభ. శాసన మండలి సభ్యులు ప్రజలచే పరోక్షముగా ఎన్నికౌతారు. ఈ సభలోని సభ్యులను ఎన్నికైన స్థానిక సంస్థలు, అసెంబ్లీ సభ్యులు, గవర్నర్, గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులు మొదలైనవారు ఎన్నుకుంటారు. ఈ సభ్యులను ఎం.ఎల్.సి అని పిలుస్తారు. ఇది శాశ్వతసభ. అనగా శాసనసభ వలె దీన్ని రద్దు చేయలేం. కాని శాసనమండలి పూర్తిగా లేకుండా చేయవచ్చు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మూడొంతుల సభకు ఎన్నికలు జరుపుతారు. శాసన మండలి సభ్యుని పదవీకాలం 6 సంవత్సరాలు. ఇది కేంద్ర ప్రభుత్వం లోని రాజ్యసభ వలె ఉంటుంది. శాసనమండలిని మొదటి సారిగా నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు తొలగించారు. కారణం అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సభ్యులు అధికంగా శాసనమండలిలో ఉండడం వల్ల ప్రభుత్వం బిల్లును శాసన మండలి ఆమోదించేది కాదు, దానితో నందమూరి తారక రామారావు అసహనానికి గురై శాసనమండలిని తొలిసారిగా తొలగించారు. తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు తిరిగి మళ్ళీ శాసనమండలిని ప్రవేశపెట్టాలని శాసనసభలో బిల్లు చేశారు, కానీ అది పట్టాలెక్కలేదు. కానీ 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు తిరిగి శాసనమండలిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినా, రెండు తెలుగు రాష్ట్రాలలో శాసనమండలి కొనసాగుతోంది. అసలు మండలి రద్దు అంత తేలిక వ్యవహారం కాదు. ముందుగా శాసనసభలో బిల్లు చేసి దానిని కేంద్రానికి పంపాలి. కేంద్రంలో లోక్సభ రాజ్యసభ ఆమోదించిన రాష్ట్రపతి దగ్గరకు వెళ్ళిన తర్వాత దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే శాసన మండలి రద్దు అవుతుంది. అదేవిధంగా శాసన మండలి ఏర్పాటు చేయాలన్న ఇదే పద్ధతి పాటించాలి. శాసనమండలిని రాజ్యాంగ కర్తలు మేధావులు కోసం ఏర్పాటు చేశారు, కానీ ప్రస్తుతం రాజకీయ నాయకులు దీన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా వాడుకుంటున్నారు.
భారతదేశం |
ఈ వ్యాసం భారతదేశ రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం. |
|
|
|
రాష్ట్ర శాసన మండలి సభ్యల సంఖ్య పరిమాణం రాష్ట్ర శాసనసభ సభ్యులలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ ఉండకూడదు. అయితే, దాని పరిమాణం 40 మంది సభ్యుల కంటే తక్కువ ఉండకూడదు. ఈ సభ్యులు రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్లను ఎన్నుకుంటారు.
ప్రతి శాసన మండలి సభ్యుడు (ఎం.ఎల్.సి) ఆరు సంవత్సరాల పదవీకాలం కలిగి ఉంటాడు. సభలో మూడొంతులలో ఒక వంతు సభ్యుల పదవీ కాలం ప్రతీ రెండు సంవత్సరాలకు పూర్తి అవుతుంది. ఈ అమరిక భారత పార్లమెంటులోని ఎగువ సభ అయిన రాజ్యసభను పోలి ఉంటుంది.
శాసనమండలి సభ్యుడు కాదలచిన వ్యక్తి భారత పౌరుడై ఉండాలి. కనీసం 30 ఏళ్ళ వయసు ఉండాలి. మానసికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి. దివాళా తీసి ఉండరాదు. అతడు ఏ రాష్ట్రంలో పోటీ చేస్తే ఆ రాష్ట్రంలో ఓటు హక్కు కలిగి ఉండాలి. అతడు/ఆమె అదే కాలంలో పార్లమెంటు సభ్యునిగా ఉండరాదు.
ఈ క్రింది పద్ధతిలో ఎం.ఎల్.సిలు నియమితులవుతారు.[2]
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 169 ప్రకారం, ఆ రాష్ట్ర శాసనసభ ప్రత్యేక మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించినట్లయితే, భారత పార్లమెంటు రాష్ట్ర శాసనమండలిని సృష్టించవచ్చు లేదా రద్దు చేయవచ్చు. 2024 జనవరి 09 నాటికి, 28 రాష్ట్రాలలో 6 రాష్ట్ర శాసనమండళ్లు కలిగి ఉన్నాయి.[2]
రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉనికి రాజకీయంగా వివాదాస్పదమైంది. శాసనమండలిని రద్దు చేసిన అనేక రాష్ట్రాలు దాని పునఃస్థాపన కోసం అభ్యర్థించాయి. దీనికి విరుద్ధంగా, ఒక రాష్ట్రానికి శాసన మండలి పునఃస్థాపన ప్రతిపాదనలు కూడా వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి. రాష్ట్ర శాసనమండలి రద్దు లేదా పునఃస్థాపన ప్రతిపాదనలకు భారత పార్లమెంటు ద్వారా నిర్ధారణ అవసరం.
భారత రాజ్యాంగం రాష్ట్ర శాసన మండలికి పరిమిత అధికారాన్ని ఇచ్చింది. రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు లేదా రద్దు చేయలేదు. ద్రవ్య బిల్లుల ఆమోదంలో రాష్ట్ర శాసనమండలి పాత్ర కూడా ఉండదు. కానీ రాష్ట్ర శాసన మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్లు రాష్ట్రంలోని కేబినెట్ మంత్రుల హోదాను కలిగి ఉండటం దీనికి ఉన్న కొన్ని అధికారాలు. 2007 ఏప్రిల్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిని పునఃస్థాపించబడింది.
శాసన మండలి ఏర్పాటుకు ప్రస్తుతం 4 ప్రతిపాదనలు ఉన్నాయి.[3]
శాసనమండలి | స్థానాలు | మండలి సభ్యుల పరిమాణం[9] | బహుళత్వం/మెజారిటీ ఉన్న పార్టీ | |||
---|---|---|---|---|---|---|
ఎన్నిక | నామినేటెడ్ | మొత్తం | ||||
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి | అమరావతి | 50 | 8 | 58 | తెలుగు దేశం పార్టీ | |
బీహార్ శాసనమండలి | పాట్నా | 63 | 12 | 75 | జనతాదళ్ (యునైటెడ్) | |
కర్ణాటక శాసనమండలి | బెంగళూరు
(వేసవి) |
64 | 11 | 75 | భారత జాతీయ కాంగ్రెస్ | |
మహారాష్ట్ర శాసనమండలి | ముంబై
(వేసవి) |
66 | 12 | 78 | శివసేన | |
తెలంగాణ శాసనమండలి | హైదరాబాదు | 34 | 6 | 40 | భారత జాతీయ కాంగ్రెస్ | |
ఉత్తర ప్రదేశ్ శాసనమండలి | లక్నో | 90 | 10 | 100 | భారతీయ జనతా పార్టీ | |
మొత్తం | — | 367 | 59 | 426 | — |
అధికారపార్టీ | రాష్ట్రాలు | |
---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | 2 | |
Bharatiya Janata Party | 1 | |
జనతాదళ్ (యునైటెడ్) | 1 | |
శివసేన | 1 | |
Telugu Desam Party | 1 |
కౌన్సిల్ | సీటు (లు) | ఇంటి బలం | ఉనికిలో ఉన్న కాలం | రద్దు చేయబడిన చట్టం |
---|---|---|---|---|
అస్సాం లెజిస్లేటివ్ కౌన్సిల్ | షిల్లాంగ్ | 42 | 1935-1947 | భారతదేశం (ప్రోవిన్షియల్ లెజిస్లేచర్స్) ఆర్డర్, 1947 |
బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ | బాంబే | 78 | 1950–1960 | బొంబాయి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం, 1960 |
జమ్మూ కాశ్మీర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ | శ్రీనగర్ (వేసవి) జమ్ము (శీతాకాలం) | 36 | 1957–2019 | జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019 |
మధ్య ప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ | భోపాల్ | 77 | 1956–1969 | మధ్యప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ (రద్దు) చట్టం, 1969 |
పంజాబ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ | చండీగఢ్ | 39 | 1956–1969 | పంజాబ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ (రద్దు) చట్టం, 1969 |
తమిళనాడు లెజిస్లేటివ్ కౌన్సిల్ | చెన్నై | 78 | 1956–1986 | తమిళనాడు లెజిస్లేటివ్ కౌన్సిల్ (రద్దు) చట్టం, 1986 |
పశ్చిమ బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ | కోల్కతా | 98 | 1952–1969 | పశ్చిమ బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ (రద్దు) చట్టం, 1969 |
కొన్నిరాష్ట్రాలు శాసన మండలి అనవసరమని విమర్శిస్తున్నాయి. ఇది రాష్ట్ర బడ్జెట్పై భారంగా పరిగణించబడుతుందని, చట్టాన్ని ఆమోదించడంలో జాప్యానికి కారణమవుతుందని వాటి ప్రధాన వాదన. అంతేగాక రాష్ట్ర శాసన మండలి, ఓటమి పాలైన నాయకులు రాష్ట్ర శాసనసభలో స్థానం పొందేందుకు సహాయం చేస్తుంది. నాయకులు పరోక్షంగా ఎన్నుకోబడినందున ఇది ప్రజాస్వామ్య భావనను తగ్గిస్తుంది. చాలా రాష్ట్రాలు శాసనమండలికి ప్రాధాన్యత ఇవ్వకపోవడానికి ఇవే ప్రధాన కారణాలు.
ఇతర రాష్ట్రాలు లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఏర్పాటుకు మద్దతు ఇస్తున్నాయి, అవి స్థానిక ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహిస్తాయని, వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన వ్యక్తులకు (గవర్నరు నామినేషన్ల ద్వారా) తగిన వాయిస్ ఇస్తాయని వాదించాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.