భారతీయ రైల్వేలు
భారత ప్రభుత్వ రంగ సంస్థ / From Wikipedia, the free encyclopedia
భారతీయ రైల్వేలు (ఆంగ్లం: Indian Railways; హిందీ: भारतीय रेल Bhāratīya Rail); సంక్షిప్తంగా భా.రే.) భారత ప్రభుత్వ విభాగము. భారతదేశంలో రైల్వేలు మొదటిసారిగా 1853 లో ప్రవేశపెట్టబడ్డాయి. 1947 (స్వతంత్రం వచ్చే)నాటికి దేశంలో మొత్తం 42 రైల్వే సంస్థలు నెలకొల్పబడి ఉన్నాయి. 1951లో ఈ సంస్థలన్నింటినీ కలుపుకొని భారత రైల్వే, ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే సంస్థలలో ఒకటిగా ఆవిర్బవించింది. భారత రైల్వే దూర ప్రయాణాలకు, నగరాలలో దగ్గరి ప్రయాణాలకు సబర్బన్ (suburban) అనగా పట్టణపు పొలిమేరలవరకు) అవసరమైన రైళ్ళను నడుపుతోంది.[3][4]
Type | ప్రభుత్వ పరమైన |
---|---|
పరిశ్రమ | రైల్వేలు , లోకోమోటివ్స్ |
స్థాపన | ఏప్రిల్ 16, 1853, జాతీయం 1951 [1] |
Founders | స్థాపకుడు |
ప్రధాన కార్యాలయం | కొత్తఢిల్లీ , |
Areas served | భారతదేశం |
Key people | రైల్వేశాఖ మంత్రి: అశ్విని వైష్ణవ్ |
Products | రైలు రవాణా, సరుకుల రవాణా, సర్వీసులు |
Revenue | INR 1,63,450 కోట్లు (25 బిలియన్లుడాలర్లు)(2014–15)[2] |
Number of employees | 13,34,000 (2014) [3] |
Parent | రైల్వేమంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం |
Divisions | 16 రైల్వే విభాగాలు (కొంకణ్ రైల్వే గాక) |
Website | www.indianrailways.gov.in |
రైలు మార్గాలు భారతదేశపు నలుమూలలా విస్తరించి ఉన్నాయి. భారతీయ రైలు మార్గాలపై ప్రభుత్వానికి ఏకఛత్రాధిపత్యం ఉంది. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటి. రైలు మార్గాలు మొత్తం దూరం సుమారుగా 114500 కి.మీ. ఇది సుమారు 65000 కి.మీ రూటు పై వుంది, 7500 స్టేషన్లు వున్నాయియ 20 11 నాటికి రైల్వేల వద్ద 2,40,000 వాగన్లు, 69,000 కోచ్ లు, 9000 ఇంజిన్లు ఉన్నాయి.[3] ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను కలిగి వున్న సంస్థలలో భారతీయ రైల్వేది (సుమారు పదనాలుగు లక్షలు)ద్వితీయ స్థానము. భారతీయ రైల్వే కంప్యూటరీకరణలో అన్నిటిలో ప్రథమ స్థానంలో ఉంది. ముందస్తుగా ప్రయాణం ఖరారు చేసుకునేటందులకు, మార్పులు చేసుకునేందుకు సౌకర్యం అందిస్తోంది. ఈ విభాగం భారతీయ రైల్వే ఆహార నిర్వహణ, పర్యాటక సంస్థ నిర్వహిస్తుంది. ఇది భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తూ భారత రైల్వే రవాణా వ్యవస్థను నిర్వహిస్తూ ఉంటుంది. రైల్వే మంత్రిత్వ శాఖ కేంద్ర రైల్వే మంత్రి (కేబినెట్ హోదా) నిర్వహణలో ఉండే రైల్వే విభాగం, రైల్వే బోర్డు కింద పనిచేస్తుంది. దీనిని పరిపాలనా సౌలభ్యం కోసం 18 జోన్లుగా విభజించారు.