స్మితా పాటిల్
భారతీయ నటి / From Wikipedia, the free encyclopedia
స్మితా పాటిల్ (జ.17 అక్టోబర్ 1955[1] – మ.13 డిసెంబర్ 1986[3][4]) ఒక భారతీయ సినిమా, టెలివిజన్ నటీమణి.[5] ఈమె ఒక దశాబ్దకాలంలో 80కి పైగా [2] హిందీ, మరాఠీ సినిమాలలో నటించింది.[6] ఈ సమయంలో ఈమెకు రెండు భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఒక ఫిల్మ్ఫేర్ అవార్డ్ లభించాయి. భారత ప్రభుత్వం ఈమెను 1985లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
స్మితా పాటిల్ | |
---|---|
జననం | (1955-10-17)1955 అక్టోబరు 17 |
మరణం | 1986 డిసెంబరు 13(1986-12-13) (వయసు 31) ముంబాయి, మహారాష్ట్ర, భారతదేశం |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1974–1986 |
గుర్తించదగిన సేవలు | మంథన్ (1977), భూమిక (1977), ఆక్రోష్ (1980), చక్ర (1981), చిదంబరం (1985), మిర్చ్ మసాలా (1985), గులామీ (1985) |
జీవిత భాగస్వామి | రాజ్ బబ్బర్ |
పిల్లలు | ప్రతీక్ బబ్బర్ |
తల్లిదండ్రులు | శివాజీ రావ్ గిరిధర్ పాటిల్ విద్యాతాయి పాటిల్ |
బంధువులు | విద్యా మాల్వాదే (మేనకోడలు) |
ఈమె నటిగా మాత్రమే కాక ఒక స్త్రీవాద ఉద్యమకారిణిగా కూడా ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈమె స్త్రీల సమస్యల పరిష్కారం పట్ల, వారి అభ్యున్నతి పట్ల నిబద్ధురాలై పనిచేసింది. సినిమాలలో భారతీయ సమాజంలోని సాంప్రదాయ స్త్రీల పాత్రలను పోషించి నాగరిక వాతావరణంలో మధ్య తరగతి స్త్రీలలో కలిగే మార్పులను, వారి లైంగిక భావనలను తన నటన ద్వారా చర్చించింది.[7]
ఈమె సినీ నటుడు రాజ్ బబ్బర్ను పెళ్ళాడింది. ఈమె 1986 డిసెంబర్ 13న తన 31వ యేట కాన్పు వల్ల కలిగిన సంక్లిష్టత కారణంగా మరణించింది. ఈమె మరణానంతరం ఈమె నటించిన సినిమాలు సుమారు పది విడుదలయ్యాయి. ఈమె కుమారుడు ప్రతీక్ బబ్బర్ 2008లో సినీనటుడిగా రంగప్రవేశం చేశాడు.