ఠాకూర్ రాంలాల్
From Wikipedia, the free encyclopedia
ఠాకూర్ రాంలాల్, కాంగ్రెసు పార్టీ నేత, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి[1], ఆంధ్ర ప్రదేశ్ గవర్నరు. ఈ సమయములో, 1984 ఆగష్టు 16 న నాదెండ్ల భాస్కరరావు, అప్పటి గవర్నరు రాంలాల్, ప్రధానమంత్రి ఇందిరా గాంధీల లోపాయికారీ సహకారంతో రామారావును అధికారం నుండి తొలగించి, తాను దొడ్డిదారిన గద్దెనెక్కడం.
ఠాకూర్ రాంలాల్ | |||
ఠాకూర్ రాంలాల్ | |||
నియోజకవర్గం | జుబ్బల్, కోట్ఖాయ్ | ||
---|---|---|---|
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి | |||
పదవీ కాలం 28 జనవరి 1977 – 30 ఏప్రిల్ 1977 | |||
ముందు | యశ్వంత్ సింగ్ పార్మార్ | ||
తరువాత | శాంతకుమార్ | ||
పదవీ కాలం 14 ఫిబ్రవరి 1980 – 7 ఏప్రిల్ 1983 | |||
ముందు | శాంతకుమార్ | ||
తరువాత | వీరభద్ర సింగ్ | ||
ఆంధ్ర ప్రదేశ్ గవర్నరు | |||
పదవీ కాలం 15 ఆగష్టు 1983 – 29 ఆగష్టు 1984 | |||
ముందు | కె.సి.అబ్రహాం | ||
తరువాత | శంకర్ దయాళ్ శర్మ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 15 జనవరి 1929 | ||
మరణం | 2002 జూలై 6(2002-07-06) (వయసు 72) సిమ్లా | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు | ||
వృత్తి | రాజకీయవేత్త |
రాంలాల్ 1929, జనవరి 15న జుబ్బల్ లోని భర్తాట గ్రామములో జన్మించాడు. ఈయన విద్యాభ్యాసం సిమ్లా, అమృత్సర్ లలో జరిగింది. లా డిగ్రీ కలిగిన ఈయన రాజకీయాలలో చేరక మునుపు కొంతకాలము న్యాయవాద వృత్తిలో కొనసాగాడు. ప్రజాదరణ కలిగిన నాయుకునిగా, ఠాకూర్ రాంలాల్ 1957లో తొలిసారిగా రాష్ట్ర శాసనసభలో స్వతంత్ర అభ్యర్థిగా అడుగిడినప్పటి నుండి 1998 ఎన్నికల వరకు పోటీ చేసిన అన్ని శాసనసభా ఎన్నికలలో గెలుపొందిన అరుదైన ఘనత సాధించాడు. ప్రజలతో సన్నిహిత సంబంధాలేర్పరచుకొని జుబ్బల్, కోట్ఖాయి నియోజకవర్గాలను తనకు పెట్టనికోటలా మలచుకొన్నాడు. ఇక్కడి నుండే ఈయన 9 పర్యాయాలు ఎన్నికైనాడు. 1990 లో జనతాదళ్ అభ్యర్థిగా పోటీచేస్తూ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ను కూడా ఎన్నికలలో ఓడించాడు.
రాంలాల్ 2002 జూలై 6న సిమ్లాలో తీవ్రమైన గుండెపోటుతో మరణించాడు.[2]