భారత జాతీయ కాంగ్రెస్
భారతదేశంలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ / From Wikipedia, the free encyclopedia
భారత జాతీయ కాంగ్రెస్ (ఆంగ్లం: Indian National Congress) (ఇంకనూ కాంగ్రెస్ పార్టీ, INC అనిపేర్లు ఉన్నాయి) భారతదేశంలోని ఒక ప్రధాన రాజకీయపార్టీ. 1885 డిసెంబరు 28 న స్థాపితమైన ఈ పార్టీ ఆసియా, ఆఫ్రికాల్లో విస్తరించిన బ్రిటిషు సామ్రాజ్యంలో ఉద్భవించిన తొట్టతొలి ఆధునిక జాతీయవాద పార్టీ.[lower-alpha 1][27] 1920 ల నుండి మహాత్మా గాంధీ నాయకత్వంలో కాంగ్రెసు పార్టీ భారత స్వాతంత్ర్యోద్యమంలో అగ్రభాగాన నిలిచి పోరాడింది.[28] భారతదేశానికి స్వాతంత్య్ర్యం సముపార్జించడమే కాకుండా,[lower-alpha 2][30][lower-alpha 3][32] బ్రిటిషు సామ్రాజ్యంలో వలసవాద వ్యతిరేక ఉద్యమాలకు ఊతమిచ్చింది.[lower-alpha 4][27]
భారత జాతీయ కాంగ్రెస్ | |
---|---|
పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ | సోనియా గాంధీ[1] |
లోక్సభ నాయకుడు | అధీర్ రంజన్ చౌదరి |
రాజ్యసభ నాయకుడు | మల్లికార్జున్ ఖర్గే (రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు) |
స్థాపకులు | ఎ.ఒ. హ్యూమ్ డబ్ల్యు.సి.బెనర్జీ సురేంద్రనాథ్ బెనర్జీ మనోమోహన్ ఘోష్ విలియం వాడర్బర్న్ దాదాభాయి నౌరోజీ బద్రుద్దీన్ త్యాబ్జీ ఫిరోజ్షా మెహతా దిన్షా వాచా మహదేవ్ రానడే[2] |
స్థాపన తేదీ | 28 డిసెంబరు 1885 (138 సంవత్సరాల క్రితం) (1885-12-28) |
ప్రధాన కార్యాలయం | 24, అక్బర్ రోడ్, న్యూఢిల్లీ-110001[3] |
పార్టీ పత్రిక | కాంగ్రెస్ సందేశ్ నేషనల్ హెరాల్డ్ |
విద్యార్థి విభాగం | నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా |
యువత విభాగం | ఇండియన్ యూత్ కాంగ్రెస్ |
మహిళా విభాగం | ఆలిండియా మహిళా కాంగ్రెస్ |
కార్మిక విభాగం | ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ |
రైతు విభాగం | కిసాన్ అండ్ ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్[4] |
రాజకీయ విధానం | |
రాజకీయ వర్ణపటం | Centre[17] |
International affiliation | ప్రోగ్రెసివ్ అలయన్స్[18] సోషలిస్ట్ ఇంటర్నేషనల్[19][20][21] |
రంగు(లు) | Sky blue (customary)[22][23] |
ECI Status | జాతీయ పార్టీ[24] |
లోక్సభ స్థానాలు | 50 / 543 (513 MPs & 30 Vacant) |
రాజ్యసభ స్థానాలు | 28 / 245 (241 MPs & 4 Vacant)[25] |
శాసన సభలో స్థానాలు | 676 / 4,036
(4030 MLAs & 5 Vacant) (see complete list) |
Election symbol | |
Party flag | |
1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో ఎక్కువ సమయం (49 సంవత్సరాలు) అధికారంలో ఉన్న పార్టీ. భారత తొలి ప్రధానమంత్రి అయిన జవాహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సామ్యవాద విధానాలను అనుసరించి ప్రణాళికా సంఘాన్ని ఏర్పరచి, పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టి అమలు చేసింది. నెహ్రూ తరువాత లాల్ బహదూర్ శాస్త్రి స్వల్పకాల పరిపాలన తరువాత, ఇందిరా గాంధీ పార్టీ నాయకత్వం చేపట్టింది.
స్వాతంత్ర్యం తరువాత కరిగిన 17 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 7 సార్లు స్వయంగా మెజారిటీ సాధించగా, మరో మూడు సార్లు కూటమిని ఏర్పరచి అధికారానికొచ్చింది. మొత్తం 54 సంవత్సరాల పాటు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరచింది. కాంగ్రెసు పార్టీ తరఫున మొత్తం ఆరుగురు ప్రధాన మంత్రులు దేశాన్ని పాలించారు. జవాహర్ లాల్ నెహ్రూ తొలి ప్రధాని (1947–1964) కాగా, మన్మోహన్ సింగ్ పార్టీ తరఫున చివరి ప్రధాన మంత్రి (2004–2014). ప్రధానమంత్రిగా పూర్తికాలం పనిచేసిన తొట్టతొలి నెహ్రూ కుటుంబేతర కాంగ్రెసు పార్టీ నాయకుడు పి.వి.నరసింహారావు (1991–1996).
2024 ఏప్రిల్ నాటికి మల్లికార్జున ఖర్గే పార్టీకి అధ్యక్షుడిగా ఉండగా, కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో ఉంది. జార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాల్లో అధికార కూటమిలో భాగస్వామిగా అధికారంలో ఉంది.