మాతృదేవోభవ
1993 సినిమా / From Wikipedia, the free encyclopedia
మాతృదేవోభవ కె. అజయ్ కుమార్ దర్శకత్వంలో 1993 లో విడుదలై పలువురి మన్ననలు పొందిన సినిమా. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె. ఎస్. రామారావు నిర్మించాడు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించాడు. వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యం అందించాడు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర, కీరవాణి పాటలు పాడారు. ఈ చిత్రానికి మూలం సిబి మలయిల్ దర్శకత్వంలో వచ్చిన మలయాళం సినిమా ఆకాశదూతు. ఇదే సినిమాని కన్నడ భాషలో కరుళిన కూగు (1994) పేరుతోను, హిందీ భాషలో తులసి (2008) పేరుతోను, మరాఠీ భాషలో చిమని పఖరే (2003) పేరుతోను పునర్మించారు. అయితే ఈ సినిమాలన్నీ 1983లో విడుదలైన అమెరికన్ సినిమా హూ విల్ లవ్ మై చిల్డ్రన్? ఆధారంగా నిర్మించబడ్డాయని భావిస్తున్నారు.[ఆధారం చూపాలి]
మాతృదేవోభవ | |
---|---|
![]() | |
దర్శకత్వం | కె. అజయ్ కుమార్ |
కథ | డెన్నిస్ జోసెఫ్ |
నిర్మాత | కె. ఎస్. రామారావు |
తారాగణం | నాజర్, మాధవి, చారుహాసన్, బ్రహ్మానందం, వై. విజయ |
ఛాయాగ్రహణం | ఛోటా కె. నాయుడు |
సంగీతం | కీరవాణి |
నిర్మాణ సంస్థ | |
సినిమా నిడివి | 140 ని |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఈ చిత్రంలో వేటూరి సుందర్రామ్మూర్తి రాసిన రాలిపొయ్యే పువ్వా నీకు... అనే పాటకు జాతీయ పురస్కారం లభించింది. తెలుగు సినిమా పాటకు ఈ అవార్డు దక్కడం ఇది రెండవ సారి. మొదటిసారి శ్రీ శ్రీ కి "తెలుగువీర లేవరా" పాటకు గాను ఈ అవార్డు 1974లో లభించింది.
విధివశాత్తూ భర్తను కోల్పోయిన ఒక స్త్రీ, క్యాన్సర్ సోకి తను కూడా కొద్ది రోజుల్లో మరణిస్తానని తెలుసుకొని తన ముగ్గురు బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం పడే తపన, ఆరాటమే ఈ సినిమా.