వేటూరి సుందరరామ్మూర్తి
సుప్రసిద్ధ సినీ గేయ రచయిత / From Wikipedia, the free encyclopedia
వేటూరి గా పిలవబడే వేటూరి సుందరరామ్మూర్తి (జనవరి 29, 1936 - మే 22, 2010) సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత. వేటూరి దైతా గోపాలం ఆ తర్వాత మల్లాది వద్ద[1] శిష్యరికం చేశారు. తొలినాళ్ళలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. తర్వాత కొన్ని వేల పాటలను రాశారు. వేటూరి సుందరరామ్మూర్తి 6నంది అవార్డులతో పాటు మొత్తం 14 అవార్డులు, ఒక జాతీయ పురస్కారం అందుకున్నారు. తెలుగు పాటకు శ్రీశ్రీ తర్వాత జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది వేటూరియే.[2]
త్వరిత వాస్తవాలు వేటూరి సుందరరామ్మూర్తి, జననం ...
వేటూరి సుందరరామ్మూర్తి | |
---|---|
![]() వేటూరి | |
జననం | వేటూరి సుందరరామ్మూర్తి (1936-01-29)1936 జనవరి 29 పెదకళ్ళేపల్లి, కృష్ణా జిల్లా |
మరణం | 2010 మే 22(2010-05-22) (వయసు 74) హైదరాబాదు |
నివాస ప్రాంతం | హైదరాబాదు, తెలంగాణ |
ఇతర పేర్లు | వేటూరి |
వృత్తి | సినీ గీత రచయిత పాత్రికేయుడు (పూర్వం) |
మతం | బ్రాహ్మణ హిందూ |
భార్య / భర్త | సీతామహాలక్ష్మి |
పిల్లలు | ముగ్గురు కుమారులు |
మూసివేయి