ముహమ్మద్ అలీ జిన్నా
స్థాపకుడు మరియు పాకిస్తాన్ యొక్క 1 వ గవర్నర్ జనరల్ / From Wikipedia, the free encyclopedia
ముహమ్మద్ అలీ జిన్నాహ్ లేదా మహమ్మద్ అలీ జిన్నా (ఆంగ్లం : Muhammad Ali Jinnah or Mahomed Ali Jinnah; ఉర్దూ: محمد علی جناح ) (1876 డిసెంబరు 25 – 1948 సెప్టెంబరు 11), 20వ శతాబ్దానికి చెందిన రాజకీయనాయకుడు, భారత్ను విభజించి పాకిస్తాన్ ను ఏర్పాటుచేసిన నాయకుడు. ఇతడు షియా ముస్లిం. ముస్లిం లీగ్ నకు అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇతడికి పాకిస్తాన్ లో, కాయద్ ఎ ఆజం (ఉర్దూ قائد اعظم ) — "మహా నాయకుడు"), జాతి పిత (పాకిస్తాన్) Baba-e-Qaum (بابا قوم) అని పిలుస్తారు.
ముహమ్మద్ అలీ జిన్నాహ్ | |||
పదవీ కాలం ఆగస్టు 15, 1947 – సెప్టెంబర్ 11, 1948 | |||
ప్రధాన మంత్రి | లియాఖత్ అలీ ఖాన్ | ||
చక్రవర్తి | జార్జి VI | ||
ముందు | లేరు; పదవి సృష్టించబడింది ఎర్ల్ మౌంట్ బాటన్ ఆఫ్ బర్మా (భారతదేశ వైశ్రాయ్ గా) | ||
తరువాత | సర్ ఖ్వాజా నాజిముద్దీన్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | డిసెంబర్ 25, 1876 బ్రిటిష్ రాజ్ కరాచీ, బ్రిటిష్ ఇండియా | ||
మరణం | సెప్టెంబర్ 11, 1948 (వయస్సు 71) కరాచీ, పాకిస్తాన్ | ||
రాజకీయ పార్టీ | భారతీయ జాతీయ కాంగ్రెస్ (1896-1913) ముస్లిం లీగు (1913-1948) | ||
జీవిత భాగస్వామి | ఎమీబాయి జిన్నా మర్యం జిన్నా | ||
సంతానం | దీనా జిన్నా | ||
వృత్తి | న్యాయవాది, రాజకీయవేత్త | ||
మతం | ఇస్లాం - షియా ముస్లిం [1][1][2][3][4] |
జిన్నా భారత జాతీయ కాంగ్రెస్లో ప్రధానపాత్ర పోషించేవాడు, 1916 లక్నో ఒప్పందంలోనూ ముస్లింలీగ్ ను హిందూ-ముస్లింల ఐక్యత కొరకునూ పాటుపడ్డాడు. అంతేగాక అఖిలభారత హోంరూల్ లీగ్ లోనూ క్రియాశీలకంగా ఉన్నాడు. ఇతను రాజ్యాంగ సంస్కరణ ప్రణాళిక-పద్నాలుగు సూత్రాలు తయారుచేశాడు, దీని ప్రకారం ముస్లింల హక్కులు సంరక్షింపబడుతాయి. ముస్లింలీగ్ లోని అభిప్రాయభేదాలవలన ఈ ప్రతిపాదన సఫలం కాలేదు. దీనివలన జిన్నా దీర్ఘకాలం కొరకు లండన్ వెళ్ళిపోయాడు.
అనేక ముస్లిం నాయకులు, జిన్నాను బుజ్జగించి, 1934లో మరలా భారత్ను రప్పించుటలో సఫలీకృతులయ్యారు. భారత్ వచ్చిన జిన్నా ముస్లింలీగ్ ను ప్రక్షాళణా కార్యక్రమం చేపట్టాడు. లాహోర్ తీర్మానం ద్వారా తన "దేశ విభజన" కావాలి ముస్లింల కొరకు ప్రత్యేక దేశం కావాలి అనే పట్టును సాధించుకున్నాడు. 1946లో జరిగిన ఎన్నికలలో ముస్లింలీగ్ అనేక సీట్లను గెలుచుకున్నది. జిన్నా నేరు కార్యాచరణ ఉద్యమం చేపట్టాడు, ఈ ఉద్యమం ద్వారా పాకిస్తాన్ స్వాతంత్ర్యం పొందుటకు మార్గం సుగమమయింది. ఆంగ్లేయుల విభజించు-పాలించు సూత్రాన్ని అమలు పరచుటలో జిన్నా ఒక పావుగా మారాడు. ఇందుకు విరుద్దంగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజాందోళనలకు దిగారు, దక్షిణాసియాలో హింస ప్రజ్వరిల్లినది. దేశాన్ని పాలించుటకు, కాంగ్రెస్-ముస్లింలీగ్ లు ఏకం కాలేదు, కనీసం ఏక సూత్రముపైనా రాలేదు. ఇదే అదనుగా బ్రిటిష్ ప్రభుత్వం భారత్-పాకిస్తాన్ లకు స్వతంత్రాన్ని ప్రకటించింది. స్వాతంత్ర్యం పొందిన ఇరుదేశాలలో కాందిశీకులు ఇరువైపులా ఎక్కువయ్యారు, వీరి గృహసౌకర్యాలను కల్పించడంలో తన సాధారణ పాత్రను అమలులో పెట్టాడు.