సత్యవతి (మహాభారతం)
From Wikipedia, the free encyclopedia
సత్యవతి, మహాభారతంలో శంతనుడి భార్య. కౌరవ, పాండవులకు మహాపితామహురాలు. కౌరవ వంశమాత అయన అమె ఒకప్పుడు ఒక సామాన్యపు పల్లె పడతి. దాశరాజు అనే పల్లె పెద్దకు కుమార్తె. ఆమె వంటినుంచి చేపల వాసన వస్తూండడంతో ఆమెకు మత్స్యగంధి అన్న పేరుండేది.ఈమెను గంగాదేవి అనికూడా పిలుస్తారు. ఆమె బిడ్డలకు జన్మనిచ్చి, పుట్టిన వెంటనే నదిలో పారవేస్తుంది. గంగాదేవి చంద్రవంశానికి చెందిన ప్రతీపునికి శంతనుడనే పుత్రుని కంటుంది. శంతనుడు ఆమెను పెళ్ళి చేసుకోవాలంటే కొన్ని షరతులు విధిస్తుంది. దాని ప్రకారం పెళ్ళి తర్వాత ఆమె ఏం చేసినా శంతనుడు అందుకు అడ్డు చెప్పకూడదు. ఆక్షేపించ కూడదు. అలా చేసిన పక్షంలో ఆమె అంతర్ధానమైపోతుంది. శంతనుడు అందుకు అంగీకరించి సత్యవతిని శంతనుడు పెళ్ళి చేసుకుకోగా ఏడుగురు మగ సంతానం కలుగుతారు.ఆమె ఒక్కో బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారవస్తుంది . ఆ ఏడుగురిని పారేసినా ఊరుకున్న శంతనుడు ఎనిమిదవ బిడ్డ విషయంలో మాత్రం ఆమెను వారిస్తాడు. ఆమె ఆ శిశువును శంతనుడికిచ్చి అంతర్ధానమై పోతుంది. ఆ శిశువే దేవవ్రతుడు. అష్టమ వసువు. గంగాదేవి జన్మనిచ్చింది కాబట్టి గాంగేయుడు . శంతనుడి కుమారుడు కాబట్టి శాంతనవుడు .దాశరాజునకు పెంపుడుకూఁతురు. వ్యాసుని తల్లి. శంతనుని భార్య. శంతనుని వలన ఈమె కనిన కొడుకులు చిత్రాంగదుఁడు, విచిత్రవీర్యుఁడు. ఈమె ఉపరిచర వసువు వీర్యమున శాపముచే మత్స్యమై యమునానదియందు ఉన్న అద్రిక అను అప్సరసకు జనించెను. మఱియు ఈమెకు యోజనగంధి, మత్స్యగంధి అను నామములు ఉన్నాయి. ఈమె పరాశరమహర్షి వలన కృష్ణద్వైపాయనుని (వ్యాసుని) కనెను.